India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాసులు బుధవారం బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఎస్ఐ ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సైకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన సూచించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు.
ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని అయన స్పష్టం చేశారు. ఇక త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని భట్టి వెల్లడించారు. ఐదేళ్లలో కనీసం రూ.లక్ష కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు తమను ప్రశ్నించడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన 5మండలాలను తిరిగి భద్రాచలం రెవిన్యూ పరిధిలో కలపాలని, కోరుతూ మాజీ ఎమ్మెల్యే వీరయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. భద్రాచలం తప్ప పట్టణాన్ని ఆనుకొని ఉన్న రూరల్ ప్రాంతమంతా ఆంధ్రాలో కలవటం వల్ల పుణ్యక్షేత్రంలో భూ సమస్య ఏర్పడిందని, కనీసం చెత్త వేసుకోవటానికి కూడా స్థలంలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
దమ్మపేట మండలం ముష్టిబండకి చెందిన సత్యనారాయణ పొలానికి వెళ్లి అక్కడ గుండెపోటుతో కుప్పకూలాడు. సత్యనారాయణను గమనించిన తోటి రైతులు సమీపంలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి సమాచారం అందించడంతో ఆయన సత్యనారాయణకు సీపీఆర్ చేశారు. దీంతో స్పృహలోకి వచ్చిన సత్యనారాయణను స్థానికులు, రైతులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఎక్కువ మంది అమితంగా ఇష్టపడే
బోడకాకర కాయల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మంలో మంగళవారం రూ.550కి కిలో చొప్పున బోడకాకర కాయలు విక్రయించారు. హోల్సేల్ మార్కెట్లో వ్యాపారులు కిలో రూ.450 చొప్పున కొనుగోలు చేసి రూ.100 అధికంగా రిటైల్ మార్కెట్లు, రైతు బజార్లు, వీధి వ్యాపారుల ప్రాంగణాల్లో విక్రయిస్తున్నారు. గతేడాది రూ. 200 నుంచి రూ. 250 వరకు ఉండగా, ప్రస్తుతం అది రెట్టింపైంది.
పాలన, పార్టీ కార్యక్రమాలతో
నిత్యం బిజీగా ఉండే మంత్రి పొంగులేటి కల్లూరు మండలం నారాయణపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఫొటోలను తన ట్విటర్ అకౌంట్లో పంచుకున్నారు. పొంగులేటి ట్వీట్పై బీఆర్ఎస్ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. ‘మనది అయితే వ్యవసాయక్షేత్రం అనాలి.. కేసీఆర్ గారిది అయితే ఫాం హౌస్ అనాలి’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
<<13550256>>తలలో పెన్ను గుచ్చుకున్న<<>> నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. సోమవారం భద్రాచలం సుభాష్ నగర్లో ప్రమాదవశాత్తు పెన్నుగుచ్చుకుంది. ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స చేసి వైద్యులు నిన్న పెన్ను తొలగించారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం బాలిక మృతి చెందింది.
ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స జరిగింది. భద్రాచలానికి చెందిన 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు <<13550256>>తలలో పెన్ను గుచ్చుకొని <<>>కోమాలోకి వెళ్లింది. దీంతో హుటాహుటిన తల్లిదండ్రులు చిన్నారిని నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, సుమారు 4 గంటల పాటు వైద్యులు శ్రమించి తలలో గుచ్చుకున్న పెన్నును విజయవంతంగా తీశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది.
దేశవ్యాప్తంగా జులై 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా సీపీ సునీల్ దత్ వెల్లడించారు. బాధితుడు ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ – మెయిల్ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు అపోహలకు తావివ్వకుండా కొత్త చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.
తన పొలాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన <<13548972>>రైతు బోజడ్ల ప్రభాకర్ సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతుడి తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు ఖానాపురం హవేలి పోలీసు స్టేషన్లో పదిమందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ వివరించారు.
Sorry, no posts matched your criteria.