Khammam

News June 26, 2024

కొనసాగుతున్న ‘భగీరథ’ సర్వే

image

రాష్ట్రప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా తీరుతెన్నులపై చేపట్టిన సర్వే ఖమ్మం జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. జిల్లాలోని 3.20 లక్షల గృహాలకు గాను 11వ తేదీ నుంచి ఇప్పటివరకు 2,13,883 గృహాల్లో సర్వే పూర్తి చేశారు. తద్వారా 70 శాతం పూర్తి కావడంతో ఇళ్ల వారీగా నల్లా కనెక్షన్లు, సరఫరా, వినియోగం తదితర అంశాలను యాప్లో నమోదు చేస్తున్నారు.

News June 26, 2024

నేలకొండపల్లిలో ఆన్ లైన్ స్కీం.. రూ.100 కోట్లు స్కాం

image

ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణలు పెట్టినా నిత్యం ఎక్కడో ఒక్క చోట ఆర్థిక మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ ఆర్థిక మోసం బయటపడింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఓ వ్యక్తి ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ దందా నిర్వహించి డిపాజిటర్లను నిండా ముంచాడు. సుమారు రూ.100 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టగా బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News June 26, 2024

KMM: 29 నుంచి ఎగ్జామ్స్

image

కాకతీయ విశ్వవిద్యాలయం వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహాచారి, అదనపు నియంత్రణ అధికారి డా.రాధిక విడుదల చేశారు. మొదటి పేపర్ జూన్ 29న, రెండో పేపర్ జులై 1న, మూడో పేపర్ 3న, నాలుగో పేపర్ 5న ఉన్నట్లు తేలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

News June 26, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాఠశాలకు బంద్‌కు పిలుపు
✓వివిధ శాఖలపై ఖమ్మం & భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ పర్యటన
✓ఇల్లందు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓భద్రాచలం నియోజకవర్గం లో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన

News June 25, 2024

రైతు భరోసా పథక అమలుకు పటిష్ట కార్యాచరణ: మంత్రి తుమ్మల

image

ఖమ్మం: రైతు భరోసా పథక అమలుకు పటిష్ట కార్యాచరణ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రైతుల నుండి అభిప్రాయ సేకరణను క్రోడీకరించి, రైతు భరోసా పై కార్యాచరణ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

News June 25, 2024

ఖమ్మం: ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కారించాలి: అదనపు కలెక్టర్

image

ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత గడువులోగా ధరణికి సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలన్నారు. ఈక్రమంలో పరిస్థితులను సిబ్బందిని అడిగితెలుసుకున్నారు.

News June 25, 2024

KMM: చికిత్స పొందుతూ తల్లి, కొడుకు మృతి

image

ముదిగొండ మండలం సువర్ణపురం వద్ద రెండు రోజుల క్రితం రఘునాథపాలెం(M) చిమ్మపూడికి చెందిన తల్లి, కొడుకు కనతాల లక్ష్మమ్మ(55), శేషగిరి(36) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా వీరు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో మృతుల బంధువులు ఫిర్యాదు చేశారు.

News June 25, 2024

కొత్తగూడెం: వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

image

గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా ఓసీల్లో సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. రోజుకు 1.60 లక్షల టన్నులకు గాను 1.10లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైంది. కొత్తగూడెం రీజియన్‌లోని ఇల్లెందులో 11వేల టన్నులకు గాను 6వేల టన్నులు, కొత్తగూడెం ఏరియాలో 40వేల టన్నులకు 30వేలు, మణుగూరు ఏరియాలో 35వేల టన్నులకు గాను 25వేల టన్నుల ఉత్పత్తి జరిగినట్లు అధికారులు తెలిపారు.

News June 25, 2024

ఖమ్మం: భార్యని తిట్టాడని వ్యక్తి సూసైడ్

image

ఇంటి యజమాని అవమానించాడనే మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. స్థానిక శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందిన గోళ్ల జనార్దన్ రావు ఇంట్లో చింతకాయల నాగరాజు (48) తన కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం జనార్దన్ రావు, నాగరాజు భార్య విషయంలో అసభ్యంగా మాట్లాడడంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News June 25, 2024

ఖమ్మం: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ఖమ్మం-మల్లెమడుగు రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి.భాస్కరరావు తెలిపిన వివరాలు.. రాపర్తినగర్ వంతెన సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సోమవారం రైల్వే ట్రాక్ దాటుతుండగా అతణ్ని రైలు ఢీకొని తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలోని మృతి చెందినట్లు తెలిపారు. అన్నం ఫౌండేషన్ సహకారంతో మృతదేహాన్ని శవాగారంలో భద్రపరిచామన్నారు.