India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✓పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఇల్లందులో సింగరేణి అద్దె వాహనాల వేలం
✓కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అశ్వరావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓ భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె
గృహ జ్యోతి పథకం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎన్పీడీసీఎల్ ఖమ్మం ఎస్ఈ ఏ.సురేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం గతంలో దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణ ప్రాంత వాసులు మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ లు సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీలు పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సారపాక గాంధీనగర్లో మూడేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ సంక్షేమ పథకాలను అమలుచేస్తుందన్నారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్లో ఖమ్మం జిల్లాలో 653మంది హాజరవగా319 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 48.85గా ఉంది. భద్రాద్రి జిల్లాలో 494మంది పరీక్ష రాయగా 230మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 46.56గా ఉంది.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్లో ఖమ్మం జిల్లాలో 653మంది హాజరవగా319 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 48.85గా ఉంది. భద్రాద్రి జిల్లాలో 494మంది పరీక్ష రాయగా 230మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 46.56గా ఉంది.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ లో ఖమ్మం జిల్లాలో 9,950 మంది హాజరవగా 6,679 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 67.13గా ఉంది. భద్రాద్రి జిల్లాలో 4,716 మంది పరీక్ష రాయగా 3,027 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 59.41గా ఉంది.
ఖమ్మం కార్పొరేషన్ నూతన కమిషనర్ గా అభిషేక్ అగస్త్య(IAS)ను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 సివిల్స్ బ్యాచ్కు చెందిన అభిషేక్ అగస్త్య 38 ర్యాంకుతో ఐఏఎస్కు ఎంపికయ్యారు. అభిషేక్ అగస్త్య స్వస్థలం జమ్మూకశ్మీర్. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ గా రానున్నారు.
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో బాధితురాలు ఈశ్వరమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మంత్రి జూపల్లితో కలిసి మాట్లాడారు. ఘటనలో పూర్తి సమాచారం సేకరించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.