Khammam

News June 21, 2024

భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

image

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో శుక్రవారం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కారులో తరలిస్తున్న 150 కిలోల నిషేధిత గంజాయిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన కారును 150 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 21, 2024

అల్బెండజోల్‌తో రక్తహీనతకు చెక్: DMHO మాలతి

image

పిల్లలను రక్తహీనత నుండీ కాపాడేందుకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.మాలతి వెల్లడించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్ కార్యాలయంలో, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఆమె, డీఈఓ సోమశేఖర శర్మతో కలిసి విద్యార్థులకు మాత్రలు మింగించే కార్యక్రమం ప్రారంభించారు.

News June 21, 2024

కొత్తగూడెంలో నకిలీ నోట్ల చలామణి ముఠా అరెస్ట్

image

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఓ ముఠాను సుజాతనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ప్రకారం.. తూ.గో. జిల్లాకు చెందిన సింగంశెట్టి సత్య ఫణికుమార్, రాజమండ్రికి చెందిన వంశీకృష్ణతో సుజాతనగర్ చెందిన సురేశ్, రాకేశ్  నాయకులగూడెం వద్ద నకిలీ నోట్లు చలామణి చేసేందుకు వచ్చిన నలుగురు సభ్యుల ముఠాను పట్టుకోగా ఒకరు పరారైనట్లు తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు.

News June 21, 2024

ఖమ్మం జిల్లాలో ధరణి దరఖాస్తులు 10 శాతం పెండింగ్

image

ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 90 శాతం ధరణి దరఖాస్తులను అధికారులు క్లియర్ చేశారు. మరో 10 శాతం పెండింగ్ ఉన్నా.. వాటిలో తహశీల్దార్ల స్థాయిలోనే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో మొత్తం 78,710 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 57,101. (73 శాతం) దరఖాస్తులను పరిష్కరించగా, 13,269 (27 శాతం) అప్లికేషన్లను రిజక్ట్ చేశారు. మరో 8,340 దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News June 21, 2024

నల్గొండ జిల్లాలో పాల్వంచ యువతి సూసైడ్

image

ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దామరచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన దొడ్డా సురేశ్ యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ పాల్వంచకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> బోనకల్లో సిపిఎం మండల రాజకీయ శిక్షణ తరగతులు
> తల్లాడలో కౌలు రైతు సంఘం మండల కమిటీ సమావేశం
> అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
> సత్తుపల్లిలో ఏరువాక కార్యక్రమం
> ఎమ్మెల్యే మట్ట రాగమయి పర్యటన
> ఖమ్మం జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్
> మధిరలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
> నీట్ పరీక్షను రద్దు చేయాలని కొత్తగూడెంలో ఎస్ఎఫ్ఐ నిరసన

News June 21, 2024

హైవేపై ఎగ్జిట్స్.. ఫలించిన తుమ్మల ప్రయత్నాలు

image

గ్రీన్ ఫీల్డ్ హైవేలో వేంసూరు, లింగాల వద్ద ఎగ్జిట్ రోడ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు తుమ్మల ఇచ్చిన హామీ నెరవేర్చినట్లైంది. ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలన్న ప్రజల కోరిక మేరకు మంత్రి తుమ్మల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ ఎగ్జిట్స్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.

News June 21, 2024

భద్రాచలం: కమర్షియల్ షాపులకు టెండర్లు ఆహ్వానం: DY.RM

image

ఖమ్మం రీజియన్, భద్రాచలం డిపో పరిధిలోని కూనవరం రోడ్‌లో కొత్తగా నిర్మించనున్న 11 కమర్షియల్ షాపులకు ఆన్‌లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 20 నుంచి జూలై 09 వరకు అధికారిక వెబ్ సైట్ https://tender.telangana.gov.in టెండర్ వేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9963507506 సంప్రదించాలన్నారు.

News June 20, 2024

సింగరేణి తెలంగాణకే తలమానికం: భట్టి

image

సింగరేణి ఉద్యోగాల గని, తెలంగాణకే తలమానికం అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో 42 వేలమంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారని, 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగుతుందని స్పష్టం చేశారు.

News June 20, 2024

ఖమ్మం: వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా

image

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం వ్యవసాయశాఖ అధికారులతో వానాకాలం పంటసాగు వివరాలు, ఎరువుల నిల్వలు, సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగు వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ 19 వరకు 17,50,000 ఎకరాలలో వివిధ పంటలు సాగు అయ్యాయని, ఇందులో అత్యధికంగా ప్రత్తి 15,60,677 ఎకరాలలో.. తరువాత కంది పంట 76,000 ఎకరాలలో సాగు అయిందని మంత్రికి అధికారులు వివరించారు.