India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో గోత్ర ప్రవర వివాదం పరిష్కరించాలంటూ హైకోర్టును కొందరు రామ భక్తులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వివాద పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కమిటీని హైకోర్టు నియమించింది. భద్రాచలం దేవస్థానంలో మూడు రోజులు పాటు కమిటీ విచారణ చేపట్టనుంది.
తిరుమల తిరుపతి శ్రీవారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. తెలుగు ప్రజల కష్టాలు తీర్చే శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, కీర్తిని కాపాడుకోవాలని, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదని పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. రైతులు విత్తనాలు విత్తుకోగా , మరికొంత మంది విత్తుకునేందుకు భూమిని సిద్ధం చేస్తున్నారు. యాంత్రికరణ పెరిగిన నేపథ్యంలో అన్నదాతలు ట్రాక్టర్ల సాయంతో పనులు పూర్తి చేస్తున్నారు. పత్తిలో కలుపుతీసేందుకు డౌర కొట్టడానికి ఎద్దుల అవసరం ఉండేది. ఎద్దుల పోషణకయ్యే ఖర్చు, మనిషిని కేటాయించే పరిస్థితి లేక చాలా మంది రైతులు కాడెద్దులను దూరం పెడుతున్నారు.
కొత్తగూడెం గాజులరాజం బస్తీలో విషాదం చోటు చేసుకుంది. సింగరేణి ఉద్యోగి యాదగిరి- సంధ్య దంపతుల కూతురు త్రికోవెల వాణి 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపంతో ఈనెల 13న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఆరోగ్యం విషమించడంతో HYD ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం వాణి మృతిచెందింది. బాలిక మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,000 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
భార్య మద్యం తాగొద్దని మందలించినందుకు పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో జరిగింది. ఎస్సై హరీశ్ వివరాలు.. శ్రీరాంనగర్ గ్రామానికి చెందిన పూనెం ప్రసాద్ (50) ట్రాక్టర్ నడుపుతూ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యతో గొడవపడుతూ ఉండేవాడని, దీంతో ఆమె మద్యం తాగొద్దని పలుమార్లు మందలించడంతో పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఖమ్మం వికలాంగుల కాలనీలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్న మల్లయ్యకు తొలుత శైలజతో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమె కనిపించకుండా వెళ్లిపోవడంతో నేలకొండపల్లి మండలం భైరవునిపల్లి కళావతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఆమెను అడ్డు తొలగించాలని గొంతు నులిమి హత్య చేసి గుండెపోటుతో మృతి చెందిందని బంధువులకు తెలిపాడు. ఈమేరకు పోలీసులు విచారించగా నేరం ఒప్పుకున్నాడు.
ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో బస్సుల సర్వీసులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కూసుమంచి మండలంలో 33గ్రామాలకు, రఘునాథపాలెం మండలంలో 15పంచాయతీలకు, చింతకాని మండలంలో 21గ్రామాలకు బస్సులు తిరగడం లేదు. ఈ సందర్భంగా విద్యార్థిని మన్విత మాట్లాడుతూ.. తాను డిగ్రీలో చేరినప్పుడు తన ఊరికి బస్సొచ్చేదని..ఏడాదిక్రితం రద్దు చేశారని తెలిపింది. బస్సెక్కాలంటే 3KM దూరంలోని నాగులవంచకు వెళ్లాల్సి వస్తోందని వాపోయింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2018 ఎన్నికలకు ముందు రేషన్ కార్డులను ఇచ్చిన గత ప్రభుత్వం.. తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా రేపు మాపు అంటూ ఊరించడమే తప్ప ఆచరణలో అమలు చేయడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు పురపాలికల్లో నిషేధిత ప్లాస్టిక్ (సింగల్ యూజ్డ్) విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వాటి వాడకం ఏటా రెట్టింపు అవుతోంది. పట్టణాల్లోంచి ప్రవహించే వాగులు, డ్రైనేజీల్లో వ్యర్థాల్ని అడ్డగోలుగా పారబోస్తున్నారు. ఇవి వర్షాకాలంలో ప్రవాహాలకు అడ్డుగా నిలిచి ముంపు బెడద తీవ్రమవుతోందని బాధిత ప్రాంతాల వాసులు గగ్గోలు పెడుతున్నారు.
Sorry, no posts matched your criteria.