Khammam

News June 16, 2024

ఖమ్మం: మహిళ మెడలో గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ

image

ఖమ్మం రోటరీ నగర్‌లో స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం ఒంటరి ఆడవాళ్లను టార్గెట్ చేసుకుని మెడలోని బంగారాన్ని లాక్కెళ్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో రోటరీ నగర్‌లో శనివారం గుర్తు తెలియని ఓ వ్యక్తి బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని కిరాణా షాపు దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్, పెరుగు ప్యాకెట్ కావాలని అడిగాడు. వాటిని ఇస్తున్న క్రమంలో శనివారం మహిళ మెడలోంచి మూడు తులాల పుస్తెలతాడు లాక్కొని పరారయ్యాడు.

News June 16, 2024

ఖమ్మం: నకిలీ వైద్యుల గుండెల్లో గుబులు

image

నకిలీ వైద్యులను గుర్తించి వారిపై NMCచట్టం 34, 54 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు పబ్లిక్ రిలేషన్ కమిటీ ఛైర్మన్ డా.నరేష్‌ కుమార్ తెలిపారు. కూసుమంచి, నెలకొండపల్లి, ముదిగొండ, పిండిప్రోలు ప్రాంతాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైద్య పట్టా లేకుండా వైద్యం ఎవరు చేయరాదని, పారామెడికల్ కోర్సు చేసిన వారు ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలన్నారు.

News June 16, 2024

KMM: సెల్ఫీ దిగిందని అసభ్యకరంగా మెసేజ్‌లు.. అరెస్ట్

image

యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన గండమాల రాహుల్, HYDకు చెందిన ప్రనీశ్ స్నేహితులు. తన సోదరుడికి స్నేహితుడు కావడంతో ప్రనీశ్ సోదరి కొంతకాలం క్రితం రాహుల్‌తో సెల్ఫీ దిగింది. దీన్ని అదనుగా తీసుకుని రాహుల్ ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News June 16, 2024

కొత్తగూడెం: 250 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిపివేత

image

వార్షిక మరమ్మతుల నేపథ్యంలో కొత్తగూడెం థర్మల్ విద్యుత్తు కేంద్రంలో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. మరో నెలన్నర రోజుల తర్వాతే గ్రిడ్‌కు ఉత్పత్తి అనుసంధానం చేయనున్నట్లు సీఈ ప్రభాకర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కర్మాగారంలో చివరిసారిగా 2021లో వార్షిక మరమ్మతులు నిర్వహించారు. అప్పట్లో రూ.36 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

News June 16, 2024

సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న మెసేజ్ లకు స్పందించవద్దు: సీపీ

image

ఎస్బీఐ యూనో అప్లికేషన్స్ ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న లింకులు, మెసేజ్ లను స్పందించి మోస పోవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏ బ్యాంక్ అయినా అప్ డేట్ కోసం వివరాలు అడగవని, మోసపూరిత మెసేజ్‌లలో వచ్చిన లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News June 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC రీజినల్ మేనేజర్ బదిలీ

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చెరుకుల్లి వెంకన్న బదిలీ అయ్యారు. ఆయనను TGSRTC చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (ప్రధాన కార్యాలయం) గా నియమించారు. ఆ స్థానంలో రంగారెడ్డి రీజియన్ నుండి డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) గా ఉన్న సరీరాం పదోన్నతి పొంది ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ గా రానున్నారు.

News June 15, 2024

గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త

image

బోనకల్ మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గుండె కుడివైపు ఉందంటూ వివాహమాడిన భార్యను పుట్టింటికి పంపించాడు ఓ భర్త. వివరాలకెళ్తే.. KMMకు చెందిన భవానిని బోనకల్ (M)కి చెందిన భాస్కరచారి వివాహమాడాడు. కాగా భార్యకు గుండె కుడివైపున ఉందంటూ ఇటీవల తెలియడంతో భాస్కరచారి తల్లిదండ్రులతో కలిసి గత కొన్ని నెలలుగా వేధింపులు గురి చేస్తున్నాడు. వారి వేధింపులను తట్టుకోలేక భవాని పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది.

News June 15, 2024

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు నూతన కలెక్టర్‌లు

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్‌లు బదిలీ అయ్యారు. ఖమ్మంలో పనిచేస్తున్న గౌతమ్ స్థానంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ముజామ్మిల్ ఖాన్ వచ్చారు. ఇక భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక అలా బదిలీ కాగా.. ఆమె స్థానంలో జితేశ్ వి. పాటిల్ కలెక్టర్‌గా నియామకమయ్యారు. అయితే బదిలీ అయిన కలెక్టర్‌లు గౌతమ్, ప్రియాంక‌కు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు.

News June 15, 2024

పినపాక: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామానికి చెందిన మద్దెల వెంకటరమణ (45) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై శనివారం మృతి చెందింది. గమనించిన కుటుంబ సభ్యులు 108కి సమాచారం తెలపగా పినపాక పిహెచ్‌సీకి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలో తండ్రి మృతి చెందగా, తాజాగా తల్లి మృతి చెందడంతో కూతురు అనాథగా మారింది.

News June 15, 2024

ఖమ్మం: ఖననం చేసిన వ్యక్తి మృతదేహానికి శవపరీక్ష

image

ఖననం చేసిన వ్యక్తి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన ఘటన సత్తుపల్లి మండలం గంగారంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారంలోని జలగంనగర్-1కు చెందిన విజయకుమారిని జలగంనగర్-2కు చెందిన విజయ్ కుమార్(38)కు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు విచారణ నిమిత్తం పూడ్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు.