Khammam

News June 15, 2024

KMM: ఈ-కేవైసీ తప్పనిసరి

image

బీఆర్ఎస్ హయాంలోనే రేషన్‌కార్డుదారుల ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ మొదలైంది. 7నెలలుగా 100శాతం కూడా పూర్తికాలేదు. సెప్టెంబర్‌ 30వరకు గడువును పొడిగిస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో సుమారు 20శాతం, భద్రాద్రి జిల్లాలో 22శాతం మంది ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు, చదువుల కోసం వెళ్లినవారు ఈ-కేవైసీ చేయించేందుకు రావట్లేదని సమాచారం.

News June 15, 2024

ఖమ్మం: వివిధ పనులపై కలెక్టర్ గౌతమ్ సమీక్ష

image

ఖమ్మం జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన రైల్వే, జాతీయ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై అధికారులతో, కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులకు సంబంధించి, వాస్తవ అవసరం మేరకు పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

News June 14, 2024

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

అశ్వారావుపేట మండలం నారమువారిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందాగా.. మరో నలుగురికి గాయాలైయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలివచారు. మృతులు వెంకట లక్ష్మి, దుర్గారావుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

దారుణం.. 9 ఏళ్ల బాలికపై పీహెచ్సీ ఉద్యోగి అత్యాచారం

image

భద్రాద్రి: 9 ఏళ్ల బాలికపై పీహెచ్సీ ఉద్యోగి అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం మణుగూరు మండలంలో చోటు చేసుకుంది. జానంపేట పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News June 14, 2024

భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గౌతమ్

image

ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు కలెక్టర్ గౌతమ్ జిల్లాలో రైల్వే, జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News June 14, 2024

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై సిసిఎల్ఎ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ పాల్గొని పెండింగ్ ధరణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.

News June 14, 2024

కొత్తగూడెం: 3 సంవత్సరాల్లో రూ.84 కోట్ల గంజాయి పట్టివేత

image

భద్రాచలం మీదుగా MH, తమిళనాడు, ఢిల్లీకి నిత్యం గంజాయి తరలిపోతోంది. 2021లో 74 కేసులు నమోదు చేసి 16,146 కిలోలు, 2022లో 50 కేసులు పెట్టి 24,000 కిలోలు, 2023లో 74 కేసులు నమోదు చేయడం ద్వారా 5,244 కిలోల, 2024లో మార్చి నాటికి 35 కేసులు పెట్టి 2,781 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో రూ.84 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 33,400 కిలోల గంజాయిని కాల్చారు.

News June 14, 2024

3 సంవత్సరాల్లో 84 కోట్ల గంజాయి పట్టివేత

image

భద్రాద్రి జిల్లాలో భద్రాచలం మీదుగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ కి నిత్యం గంజాయి తరలిపోతోంది. 2021లో 74 కేసులు నమోదు చేసి 16,146 కిలోలు, 2022లో 50 కేసులు పెట్టి 24,000 కిలోల, 2023లో 74 కేసులు నమోదు చేయడం ద్వారా 5,244 కిలోల, 2024లో మార్చి నాటికి 35 కేసులు పెట్టి 2,781 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో రూ.84 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు. 33,400 కిలోల గంజాయిని కాల్చారు.

News June 14, 2024

ఖమ్మం: తగ్గిన మిర్చి ధర.. స్థిరంగా ఉన్న పత్తి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7,000 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర 100 రూపాయల తగ్గగా.. పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు.

News June 14, 2024

పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.55వేల ఫైన్ విధిస్తూ ఖమ్మం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఉమాదేవి గురువారం తీర్పు నిచ్చారు. రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కాంపాటి కార్తీక్(20) గతేడాది మార్చి 5న ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాలు పరిశీలించిన అనంతరం జడ్జి తీర్పు నిచ్చారు.