Khammam

News February 7, 2025

కమర్షియల్ షాపులకు ఆన్‌లైన్ ద్వారా టెండర్ల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్ ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్‌లకు ఆన్లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC DY.RM(O) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 24 వరకు అధికారిక వెబ్ సైట్ Tgsrtc.telanagana.gov.in (Tenders)లో టెండర్‌కు దరఖాస్తు చేసుకువాలన్నారు. 

News February 7, 2025

KMM: సీఎం కప్ ఫుట్‌బాల్ విజేతలకు కలెక్టర్ అభినందన

image

సీఎం కప్ ఫుట్‌బాల్ పోటీల్లో విజయం సాధించిన వివిపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం కలెక్టరేట్‌లో అభినందించారు. అండర్-13, 15, 17 గ్రూపుల్లో రన్నర్స్‌గా నిలవడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. టీమ్ కోచ్ మాధురికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్ ఆదర్శ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

News February 6, 2025

రామయ్య హుండీ ఆదాయం రూ.1,13,23,178

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని 37 రోజుల తర్వాత గురువారం లెక్కించగా రూ.1,13,23,178 లు వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు. అంతేకాకుండా 109 గ్రాముల బంగారం, 895 గ్రాముల వెండి, 298 యూఎస్ డాలర్లు, 155 సింగపూర్ డాలర్లు, 430 యూఏఈ దీరమ్స్, 20 కెనడా డాలర్లు, 85 ఆస్ట్రేలియా డాలర్లు, 45 యూరప్ యూరోస్ కూడా భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు.

News February 6, 2025

KMM: 1,04,995 మందికి రైతు భరోసా నిధులు జమ

image

తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 1,04,995 మంది రైతుల ఖాతాలలో రూ.58,22,56,809 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.

News February 6, 2025

వరుస ప్రశంసలతో దూసుకెళ్తున్న ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తన పనితీరు, వ్యక్తిత్వంతో వరుస ప్రశంసలు అందుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం గురుకు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పాటు నేలపై కూర్చొని సూచనలు ఇచ్చారు. తరువాత రైతు అవతారం ఎత్తి పొలాల బాట పట్టి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. తాజాగా ఖమ్మం ఎన్నెస్పీ ప్రభుత్వ స్కూల్ సందర్శించి విద్యార్థులతో పాటు నేలపై కూర్చొన్ని మోటివేషన్ క్లాసులు విన్నారు.

News February 6, 2025

మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి.. పేరు ఇదే..!

image

మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కానీ కొద్దిరోజులే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్‌‌ తెలిపారు. ఈనెల 2న కెమెరాకు చిక్కిందన్నారు.

News February 6, 2025

ఖమ్మం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే 30 రైళ్లను ఈనెల 10నుంచి 20వరకు రద్దు చేస్తున్నట్లు, ఇంకొన్నింటిని సికింద్రాబాద్- నడికుడి మార్గంలో నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, వారాంతపు రైళ్లను కూడా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు నిర్ణీత తేదీల్లోనే నడుస్తాయని తెలిపారు.

News February 6, 2025

ఖమ్మం: భార్య మర్డర్.. భర్త, అత్తకు జీవిత ఖైదు

image

భార్యను హతమార్చిన కేసులో భర్తకు, ఆమె అత్తకు జీవిత ఖైదు జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. మెజిస్ట్రేట్ వివరాలిలా.. ముదిగొండ మండలం బాణాపురం తండాకు చెందిన టీ.ఉపేందర్ 2017లో కళ్యాణిని వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం 2020లో హత్య చేశాడు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు కాగా, విచారించిన కోర్టు భర్త ఉపేందర్, అత్త పద్మకు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది.

News February 6, 2025

KMM: గుడ్ న్యూస్.. ఒకేషనల్ స్టూడెంట్స్‌కు ఆహ్వానం

image

ఇంటర్మీడియట్ MPHW(ఫిమేల్) ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఏడాది క్లినికల్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కే.రవిబాబు ప్రకటనలో తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారు రూ.1000 ఆసుపత్రి పేరున డీడీ చెల్లించాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని ఎంపిక కాని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.

News February 5, 2025

KMM: మంత్రి పొంగులేటి ప్రకటన.. గ్రామాల్లో సందడి

image

ఈనెల 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడుతుందని మంత్రి పొంగులేటి ప్రకటనతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 577 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాల్టీలు ఉన్నాయి. తాజాగా ఏదులాపురం కేంద్రంగా కొత్త మున్సిపాలిటీ ఏర్పాటైంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.