Khammam

News June 12, 2024

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికులను ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం వెంట ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్, వైరా ఎమ్మెల్యే, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

News June 12, 2024

విద్యా, వైద్యానికే మొదటి ప్రాధాన్యత: డిప్యూటీ సీఎం

image

ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.

News June 12, 2024

ఖమ్మం: కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి

image

కొనిజర్లలో విద్యుత్ షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. కొనిజర్ల ఆయుర్వేద వైద్యశాలలో కరెంటు మరమ్మతులు చేస్తుండగా విద్యాద్ఘాతంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. మృతుడిని వైరా మండలం గొల్లపూడికి చెందిన సతీశ్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News June 12, 2024

KMM: విద్యుత్ బిల్లులు.. ఇక ఈజీ!

image

విద్యుత్ బిల్లుల చెల్లింపును మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్ ) క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గడిచిన మే నెలలో ఖమ్మం సర్కిల్ పరిధిలో 1,19,678 మంది గృహ విద్యుత్ వినియోగదారులు రూ.24.47 కోట్ల బిల్లులను ఆన్లైన్లో చెల్లించారు. ఇక భద్రాద్రి జిల్లాలో 71,865 గృహ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా రూ.13.97 కోట్లను చెల్లించారు.

News June 12, 2024

కొత్తగూడెం: చుట్టపు చూపుకు వెళ్లి.. పాముకాటుకు బలి

image

పాముకాటుతో ములుగు జిల్లా మంగపేట మండలంలో దండాల రాణి అనే బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాలకు చెందిన దండల రాణి అనే బాలిక బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో దేవానగరంలోని పెద్దమ్మ ఇంట్లో పాముకాటుకు గురైంది. ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

News June 12, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింద విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,100 పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.100, అటు పత్తి ధర రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. కాగా మార్కెట్లో రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా క్రయవిక్రయాలు జరపాలని అధికారులు సూచించారు.

News June 12, 2024

డ్వాక్రా మహిళలకు ₹28,30,000 కుచ్చు టోపీ..!

image

ఎర్రుపాలెం: జమలాపురం యూనియన్ బ్యాంక్లో డ్వాక్రా మహిళలకు ఓ వ్యక్తి కుచ్చు టోపీ పెట్టాడు. సీసీ సంతకాన్ని ఫోర్జరీ చేసి వెంకటాపురంలో ఉన్న 30గ్రూపులకు చెందిన 300మంది సభ్యుల రూ.28.3లక్షలను డ్రా చేసుకొని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న మహిళలు బ్యాంకు వద్దకు వెళ్లిఆందోళన చేపట్టారు. రెండు దఫాలుగా డబ్బులు చెల్లిస్తానని బ్యాంకు మేనేజర్ సమక్షంలో కన్నయ్య ఒప్పుకోవడంతో ఆందోళనను విరమించారు.

News June 12, 2024

పాఠశాలలకు చేరిన పుస్తకాలు

image

నేటి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. జిల్లాలో 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు 6,84,740 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఈ మొత్తాన్ని ఇప్పటికే సంబంధిత పాఠశాలలకు సరఫరా చేశారు. 3,94,314 రాతపుస్తకాలను సైతం అందుబాటులో ఉంచారు. ఈసారి నూరు శాతం పుస్తకాలు పాఠశాలలకు చేరటం విశేషం.

News June 12, 2024

పోలీస్ అధికారినంటూ వైద్యుడికి బెదిరింపు

image

భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యుడికి మంగళవారం ఓ వ్యక్తి ఫోన్ చేసి పోలీస్ అధికారినంటూ బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వైద్యుడు ఎవరికి చెప్పాలో అర్థంకాక కొంతసేపు ఇబ్బంది పడ్డారు. చివరకు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ను ఆశ్రయించి విషయం వివరించారు. అయితే సైబర్‌ క్రైమ్‌ నంబర్‌ 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిసింది. అయితే సదరు వైద్యుడు ఫిర్యాదు చేయలేదని సమాచారం.

News June 12, 2024

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చేరండి: కలెక్టర్ గౌతమ్

image

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించాలని, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బడి బాట, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపూర్తిపై విద్యాశాఖ, ఇంజనీరింగ్, మండలసమాఖ్యలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.