Khammam

News February 3, 2025

KMM: ‘BRS నేతలు పింక్ డైరీలో పేర్లు రాయండి’

image

బీఆర్ఎస్ నేతల చేతుల్లో ఎప్పుడూ పింక్ డైరీ ఉండాలని, నిత్యం సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యకర్తలపై కొందరు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, సమస్యలతో పాటు ఇబ్బందులు పెట్టేవారి పేర్లను రాయాలని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు.

News February 3, 2025

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఖమ్మం జట్టు సిద్ధం

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా టీం ఎంపికైందని కోచ్ వీరరాఘవయ్య తెలిపారు. కల్లూరు మినీ స్టేడియంలో జరిగిన శిబిరంలో టీం ఎంపికైందని చెప్పారు. శిబిరంలో ప్రతిభ కనబరిచిన 12 మంది క్రీడాకారులను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, కార్యదర్శి కటికల క్రిస్టోఫర్ బాబు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.. వీరు ఆదిలాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

News February 2, 2025

KMM: రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు

image

NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్‌లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News February 2, 2025

అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుంది: పొంగులేటి

image

ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సత్తుపల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తో కలిసి కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, భరోసానిచ్చారు.

News February 2, 2025

ఖమ్మం: యువకుడిపై పోక్సో కేసు నమోదు: సీఐ రమేశ్

image

ప్రేమించాలని బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ రమేశ్ తెలిపారు. ప్రకాష్ నగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన బాలికను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఆమె చదువుతున్న పాఠశాలకు సైతం వెళ్లి బెదిరిస్తుండటంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News February 2, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆}  ఖమ్మంలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన∆} నేలకొండపల్లిలో రామదాసు జయంతి ఉత్సవాలు

News February 2, 2025

జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరం: MP

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి, జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరమని ఎంపీ రాఘురాం రెడ్డి అన్నారు. నిన్న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాలు కనిపించడంలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నేషనల్ హైవేలు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్‌‌పై ప్రస్తావించలేదన్నారు.

News February 2, 2025

ఖమ్మం జిల్లాకు నేడు మంత్రి పొంగులేటి రాక

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నేలకొండపల్లి, ఖమ్మం, అశ్వారావుపేట, వైరా మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు గమనించి సకాలంలో హాజరుకావాలని సూచించారు.

News February 1, 2025

బడ్జెట్లో ఖమ్మంకు తీవ్ర అన్యాయం: సీపీఎం

image

ఖమ్మం: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ, బిహార్ ఎన్నికల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని ఆరోపించారు. జిల్లాకు నిధుల కేటాయింపుపై అన్యాయం చేశారని, దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

News February 1, 2025

జాతీయ స్థాయి క్రికెట్‌కు ఖమ్మం బాలికలు

image

ఖమ్మం జిల్లాకు చెందిన యమున, యశస్వినిలు అండర్-17 జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు కోచ్ మతీన్ తెలిపారు. హర్యానాలో 3 నుంచి 7 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. వీరిని పలువురు అభినందించారు.