Khammam

News April 2, 2024

KMM: 3 నుంచి ‘ పది ‘ జవాబుపత్రాల మూల్యాంకనం

image

టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంకు ఖమ్మంలోని సెయింట్‌ జోసెఫ్‌ ఉన్నత పాఠశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది 2,18,980 పత్రాలను ఇక్కడ దిద్దగా ఈసంవత్సరం 2,10,480 పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది. గత సంవత్సరం జవాబు పత్రాలు అధికంగా ఉండటంతో భద్రాద్రి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు మూల్యాంకన విధులు నిర్వర్తించారు. ఈసారి కేవలం ఖమ్మం జిల్లాకు చెందినవారు మాత్రమే ఈకార్యక్రమంలో పాల్గొనున్నారు.

News April 2, 2024

దళిత బంధు యూనిట్లు అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

image

చింతకాని మండలం నందు 25 గ్రామ పంచాయతీలకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లు వివిధ వాహనాలు ఇతరులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. లబ్ధిదారుని వివరాలను సేకరించి సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

News April 1, 2024

లారీని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి పరిస్థితి విషమం

image

బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గేటు వద్ద ఓ లారీని సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే ఐటీసీ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్ల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

చర్ల: ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన సుక్మా జిల్లా తెట్టమడుగు అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. దీన్ని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఆప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలిస్తుండగా జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, నక్సల్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

News April 1, 2024

ఖమ్మం జిల్లాలో భానుడి ప్రతాపం

image

భానుడి ప్రతాపంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మూడు రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడంతో ప్రజలు చుక్కలు చూస్తున్నారు. మరో నాలుగు రోజులు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అత్యవసర పనులు ఉంటేనే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు.

News April 1, 2024

ఖమ్మం రీజియన్‌కి మరో 195 బస్సులకు ప్రతిపాదనలు

image

మహాలక్ష్మి స్కీం సందర్భంగా ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ మేరకు ఖమ్మం రీజియన్‌లో అదనంగా 195 బస్సులు, 1000 మంది సిబ్బంది అవసరముందని.. ఇందుకోసం యాజమాన్యానికి ప్రతిపాదనలను పంపించామని రీజినల్ మేనేజర్ వెంకన్న అన్నారు. ఇటీవల రీజియన్‌కు 20 ఏసీ, నాన్‌ ఏసీ బస్సులు వచ్చాయి. వీటిని వివిధ డిపోలకు కేటాయించి అవసరమైన రూట్లలో తిప్పుతున్నామని చెప్పారు.

News April 1, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,350 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు మిర్చి ధర రూ.200 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News April 1, 2024

KTDM: ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోల లెటర్ 

image

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను తన్ని తరమండి అంటూ ఆదివారం మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ చర్ల విలేకరులకు లేఖను పంపారు. ప్రతిపక్ష పార్టీలను నిలదీయాలని, బీజేపీ ఈసారి కూడా దేశంలో తమదే అధికారం అని విర్రవీగుతుందని లేఖలో పేర్కొన్నారు. బూటకపు పార్లమెంటు ఎన్నికలను తరిమి కొట్టండి అంటూ మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

News April 1, 2024

పోడు వివాదం.. 19 మంది మహిళలు రిమాండ్

image

సత్తుపల్లి మండలం బుగ్గపాడు సమీపంలోని చంద్రాయపాలెం పోడు వివాదంలో సీఐ టి.కిరణ్, పోలీసులపై దాడి ఘటనలో 19 మంది మహిళలను అరెస్ట్ చేసి ఆదివారం రాత్రి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, మరికొందరు పరారీలో ఉండగా గాలిస్తున్నట్లు చెప్పారు. వివాదంలో ముఖ్య భూమిక పోషించిన మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్ర కోసం గాలింపు ముమ్మరం చేశామని ఏసీపీ రఘు తెలిపారు. వీరి కోసం పలువురి ఇళ్లలోనూ సోదా చేశారు.

News April 1, 2024

కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా..?

image

కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా ..? అని మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రయత్నిస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన అధోగతికి మీరు కారణం కాదా అని ప్రశ్నించారు.