Khammam

News January 27, 2025

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర రూ.14,800 జెండా పాట పలుకగా, క్వింటా పత్తి ధర రూ.7,225 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత శుక్రవారంతో పోలిస్తే ఇవాళ కొత్త మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి మాత్రం రూ.75 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలన్నారు.

News January 27, 2025

వైరా: పంట కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి మృతి

image

వైరా మండలం గౌండ్లపాలెం సమీపంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బైక్ అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News January 27, 2025

ఖమ్మం: లారీ ఢీకొట్టడంతో వ్యాపారి దుర్మరణం 

image

రోడ్డుప్రమాదంలో కూరగాయల వ్యాపారి మృతి చెందిన ఘటన ఏదులాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలిలా.. ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండా పంచాయతీ ఇందిరమ్మకాలనీకి చెందిన పెండ్ర వెంకన్న (48) కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. పనిమీద టీవీఎస్‌పై వెళుతుండగా లారీ ఢీకొట్టడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News January 27, 2025

కామేపల్లి మాజీ సర్పంచ్‌కు అవార్డు 

image

ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన గణతంత్ర వేడుకలలో పీఎం మత్స్య సంపద పథకం లబ్ధిదారుడు, కామేపల్లి పెద్దచెరువు మత్స్యశాఖ సొసైటీ సభ్యుడు అజ్మీర రాందాస్ నాయక్ పాల్గొన్నారు. కామేపల్లికి చెందిన రాందాస్ నాయక్ అతని సతీమణి చిన్ని పరేడ్లో పాల్గొననున్నారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద నిర్వహించిన వేడుకల్లో మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ కదిరి అహ్మద్ రాందాస్ నాయక్‌కు అవార్డును అందజేశారు.

News January 27, 2025

కల్లూరులో సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి 

image

కల్లూరుకి చెందిన ఇల్లూరి నాగాచారి(45) సాగర్ కాలువలో పడి మృతిచెందారు. పోలీసుల వివరాలిలా.. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కల్లూరు పాత బస్టాండ్ వద్ద ప్రమాదవశాత్తు సాగర్ నాగాచారి కాలువలో పడ్డారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గాలింపు చేపట్టగా ఆదివారం సాయంత్రం రఘునాథ బంజర వద్ద అతని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

News January 27, 2025

KMM: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

image

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ క్రమ పద్ధతిలో అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ముదిగొండ మండలం ఖానాపూర్‌లో నిర్వహించిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని చెప్పారు. అటు పెండింగ్లో ఉన్న రుణమాఫీ సైతం త్వరలో పూర్తి చేస్తామన్నారు.

News January 27, 2025

1,31,723 మంది రైతులకు రుణమాఫీ చేశాం: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో 1,31,723 మంది రైతులకు రూ. 908 కోట్ల 76 లక్షల మేర 2 లక్షల రుణ మాఫీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. అటు 42,461 మంది రైతుల నుంచి 24 లక్షల 41 వేల క్వింటాళ్లకు పైగా సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రూ.  122 కోట్ల 5 లక్షలు బోనస్ అందించామని కలెక్టర్ పేర్కొన్నారు.

News January 26, 2025

ఖమ్మం: బైక్‌ను ఢీకొన్న లారీ.. ఒకరు స్పాట్ డెడ్

image

ఎదులాపురం గ్రామపంచాయతీ వరంగల్ X రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వస్తున్న ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తిపై నుంచి లారీ టైర్లు వెళ్లడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.

News January 26, 2025

ఖమ్మంలో రోజూ 69వేల మంది మహిళల ప్రయాణం: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి రోజు సుమారు 69 వేలకు పైగా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. రూ.21,31,00,000 సబ్సిడీని ప్రభుత్వం భరించి లబ్ధిదారులకు 7,53,723 సిలిండర్లను రూ.500కే సరఫరా చేసినట్లు తెలిపారు. అలాగే ప్రతి నెలా దాదాపు రూ.10 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించి 2,57,995 గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందన్నారు.

News January 26, 2025

మహిళల ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు:కలెక్టర్ 

image

ఖమ్మం జిలాల్లో మహిళల ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా 20 స్త్రీ టీ స్టాల్స్, 4 మిల్క్ పార్లర్, 56 పాడి పశువుల యూనిట్ లు, 1260 బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, 9177 మైక్రో ఎంటర్ ప్రైజెస్, ఒక అమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే మధిరలో ప్రత్యేకంగా ఇందిరా మహిళా డెయిరీ ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు.