Khammam

News March 24, 2024

పంట దిగుబడులపై రైతన్నల దిగాలు!

image

యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు గుబులు పట్టుకుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో నానాటికీ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ ప్రభావం బోర్లు, బావుల కింద సాగు చేసిన పంటలపై పడింది. సాగు చేసిన పంటల్లో చాలావరకు ఇప్పటికే ఎండిపోగా… మిగతావి వడబడుతున్నాయి . పెట్టుబడి వచ్చే స్థాయిలోనూ దిగుబడి సాధించే పరిస్థితి కానరావడం లేదు. వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న ఎండిపోగా రైతులకు కన్నీరే మిగులుతోంది.

News March 24, 2024

కూసుమంచి , ఖమ్మం మీదుగా కొత్త రైల్వే లైన్

image

డోర్నకల్‌ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల వరకు నూతనంగా రైల్వేలైన్‌ మంజూరు కాగా.. నిర్మాణానికి సర్వే పూర్తికావడంతో మార్కింగ్‌ ఇస్తున్నారు. ఈ రైల్వేలైన్‌ పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల మీదుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మార్కింగ్‌ చేస్తుండగా తాము భూములు కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 24, 2024

ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలి: కలెక్టర్

image

పదో తరగతి పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ శనివారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్థానిక నిర్మల్ హృదయ్ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం, త్రాగునీరు, కనీస మౌళిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎండల దృష్ట్యా వైద్య శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.

News March 23, 2024

25న రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం

image

భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేకం మహోత్సవం జరగనున్నాయి. ఈనెల 25న పెళ్లి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ద్వారం వద్ద సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచుతారు. తలంబ్రాలు కలిపే క్రతువును ప్రారంభిస్తారు. అదే రోజు హోలీ కావడంతో వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు.

News March 23, 2024

అనుమతులు లేకుండా ఎరువులను నిల్వ ఉంచిన గోడౌన్ సీజ్?

image

జూలూరుపాడు మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బయో కంపోస్ట్ ఎరువులను నిల్వ ఉంచిన ఓ గోడౌన్ ను శనివారం వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. అక్రమంగా బయో కంపోస్ట్ ఎరువులను నిల్వ ఉంచారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించి సంబంధిత గోడౌన్ ను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2024

భద్రాచలంలో పది కిలోల గంజాయి పట్టివేత

image

భద్రాచలం కూనవరం రోడ్డులో కారులో అక్రమంగా తరలిస్తున్న 10 కిలోల గంజాయిని శనివారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, ఐదు సెల్ ఫోన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. పట్టుబడిన గంజాయి, ఫోన్లు, కారు విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సీఐ రమేష్ తెలిపారు.

News March 23, 2024

KTDM:ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో తుపాకుల మోత మోగింది. పెడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి జవాన్లు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జవాన్లు గాలిస్తున్నారు.

News March 23, 2024

భద్రాద్రి కంటే ఖమ్మంలోనే ఎక్కువ..

image

ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో పోలీసుశాఖ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘాను కట్టుదిట్టం చేస్తోంది. ఖమ్మంలో 83, భద్రాద్రిలో 15 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయి. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు భద్రాద్రిలో 128 ఉండగా.. ఖమ్మంలో లేవు. రౌడీ షీటర్లు ఖమ్మంలో 244, భద్రాద్రిలో 236 మంది ఉండగా.. వారికి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

News March 23, 2024

ఖమ్మం: ‘ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ ఇస్తాం’

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 101 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఒక్క రోజే గడువు కారణంగా దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాలేదని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు 15లోగానే నియామకాలు చేపట్టామని, ఇప్పటికే 38మందిని ఎంపిక చేశామని, ఎన్నికల తర్వాత మరోమారు నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలకు వైద్యులను భర్తీ చేస్తామని తెలిపారు.

News March 23, 2024

ఖమ్మం: ‘ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ ఇస్తాం’

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 101 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఒక్క రోజే గడువు కారణంగా దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాలేదని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు 15లోగానే నియామకాలు చేపట్టామని, ఇప్పటికే 38మందిని ఎంపిక చేశామని, ఎన్నికల తర్వాత మరోమారు నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలకు వైద్యులను భర్తీ చేస్తామని తెలిపారు.