Khammam

News March 23, 2024

ఖమ్మంలో రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం 

image

ఖమ్మం రైల్వే స్టేషన్ నర్తకి థియేటర్ సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు 25 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సామాజిక కార్యకర్త అన్నం శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని శరీర భాగాలు ఒకచోట చేర్చి మార్చురీకి తరలించారు. మృతుడి చేతికి రాగి కడియం  ఉంది.

News March 23, 2024

కొత్తగూడెం: గడ్డిమందు తాగి సూసైడ్

image

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆళ్లపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దూరు గ్రామానికి చెందిన పోలేబోయిన లక్ష్మయ్య(40) ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిక తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 23, 2024

KTDM: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: జిల్లా ఎస్పీ

image

మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు  ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ముందస్తుగా సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచారు. కొత్తగూడెం, భద్రాచలం,ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అధికంగా ఉన్నాయని.. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాల సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

News March 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓ పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటు నమోదుపై ప్రత్యేక కార్యక్రమం
✓చర్ల మండలంలో సంత వేలం పాట
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
✓మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అన్నపురెడ్డిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన

News March 23, 2024

శిశు మరణాలను నివారించాలి: డీఎంహెచ్ఓ

image

భద్రాద్రి జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాల నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్.శిరీష అన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సంభవించిన ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

News March 23, 2024

డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకుల డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు విద్యార్థినీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌ తెలిపారు. మణుగూరులోని బాలుర డిగ్రీ కళాశాలతో పాటు కొత్తగూడెం, దమ్మపేట, ఖమ్మం బాలికల కళాశాలల్లో చేరేందుకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 28 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News March 23, 2024

ఖమ్మం: మట్టికుండ.. చల్లగుండ

image

ఖమ్మం జిల్లాలో ఎండలు దంచుతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. వేసవిలో తాగునీటి కోసం మట్టి కుండలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మట్టి కుండల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సైతం సూచిస్తుండంతో పేద, ధనిక తేడా లేకుండా వీటిని కొంటున్నారు. సైజును బట్టి రూ.80 నుంచి రూ.300 వరకు ధరలు పలుకుతున్నాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు.

News March 23, 2024

రెండు రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

రెండు రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ఇద్దరు ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించగా.. కాంగ్రెస్, BJP పెండింగ్లో ఉంచాయి. అయితే BJP అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బరిలో ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

News March 23, 2024

ఖమ్మం: ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

image

కారేపల్లి బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పి.రామగోపిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈఓ జయరాజు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి విధులకు హాజరుకాకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పాఠశాలలో విద్యావలంటీర్‌ను ఏర్పాటుచేసినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

News March 23, 2024

కవితా కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది: ఎంపీలు

image

ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసుపెట్టి అక్రంగా అరెస్ట్ చేసారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఢీల్లీలో ఎంపీలు నామా, కే.ఆర్ సురేష్‌‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో కవితా బాధితురాలని, నిందితురాలు కాదని వారు పేర్కొన్నారు. ఇన్ని రోజులు సాగదీసి, లోక్ సభ ఎన్నికలకు ముందు కేసును తెరపైకి తేవడం రాజకీయ కోణమన్నారు . తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందన్నారు