Khammam

News March 21, 2024

బయ్యారంలో రజాకార్ సినిమా బృందం సందడి

image

రజాకార్ సినిమా బృందానికి గురువారం బయ్యారం మండలం కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ యాట సత్యనారాయణ, సినిమా నటి అనసూయ అమరవీరుల స్తూపానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, మండల కళాకారులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

News March 21, 2024

పోలీస్ స్టేషన్లలో 50 నాటు తుపాకీలు అప్పగింత: ఎఎస్పీ 

image

కుక్కునూరు, కూనవరం, విఆర్ పురం, ఐ పోలవరం, చింతూరు, ఎటుపా, రాజవొమ్మంగి మండలాల్లో ఇప్పటి వరకు గిరిజనులు 50 సింగిల్ బార్ తుపాకులను వివిధ పోలీస్టేషన్లలో అందజేశారని ఎఎస్పీ జగదీష్ అన్నారు. రాజవొమ్మంగి పోలీస్ సిబ్బంది విశ్రాంతి భవనాన్ని ఆయన ప్రారభించారు. ఆయుధాల నియంత్రణ చట్టం ప్రకారం నిషేధిత తుపాకులు కలిగి ఉండడం నేరమని, ఇకపై తుపాకీతో దొరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 21, 2024

ఖమ్మం: కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై హై టెన్షన్

image

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై హై టెన్షన్ నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర కలదు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఖమ్మంకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ సాగుతోంది. BRSతరఫున నామా, BJPతరఫున జలగం బరిలో ఉండగా కాంగ్రెస్లో నందిని,యుగేందర్,ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి ఖరారు కాగా అలకలు లేకుండా చేసి ప్రకటన చేయాలనీ అధిష్టానం భావిస్తుంది.

News March 21, 2024

ఖమ్మం: అధికారులు లంచం అడుగుతున్నారా?

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ అధికారులు(అన్ని శాఖలు) ఎవరైనా పనులు చేసేందుకు ప్రజల నుంచి లంచాలు అడిగితే అవినీతి నిరోధక శాఖ నెంబర్లకు ఫోన్ చేయాలనీ ఆ శాఖ డీఎస్పీ రమేష్ తెలిపారు. డీఎస్పీ నెంబర్-9154388981, ఇన్స్పెక్టర్ నంబర్స్-9154388984, 9154388986, 9154388987, టోల్ ఫ్రీ నెంబర్-1064 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కాగా, ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

News March 21, 2024

నేను సీఎం అవ్వాలనుకోవడం లేదు: పొంగులేటి

image

తాను సీఎం అవ్వాలనుకోవడం లేదని, ఆ ఆలోచనే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తానే సీఎం అనడం ఊహాజనితమైన అన్నారు. తాను ఎవరికీ టచ్‌లో లేనని, రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ సీట్లను గెలుచుకుంటుందని పేర్కొన్నారు.

News March 21, 2024

ఖమ్మం జిల్లా రైతు సోదరులకు ముఖ్య గమనిక

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 23, 24, 25వ తేదీల్లో మార్కెట్ అధికారులు సెలవులు ప్రకటించారు. 23న వారాంతపు యార్డ్ బంద్, 24న సాధారణ సెలవు, 25న హోలీ పండుగ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తిరిగి 26న మార్కెట్ పునఃప్రారంభమై క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.

News March 21, 2024

రెండోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ MLA

image

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని రెండోసారి కలిశారు. వారు మాట్లాడుతూ.. మువ్వ విజయ్ బాబుకు రాష్ట్ర విద్యాశాఖ మౌళిక సదుపాయాల కల్పనాధికారిగా ఛైర్మన్ పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కలిసిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఛైర్మన్ మువ్వ విజయబాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ ఉన్నారు.

News March 21, 2024

ఖమ్మం: కీలక నేత పార్టీ మార్పు..?

image

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ మారుతున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఎంపీ నామాను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు దిల్లీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామా పోటీ చేస్తారని టాక్. ఇదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. అటు నామా దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.

News March 21, 2024

బీఆర్ఎస్ కు నీళ్లు ఇవ్వమని అడిగే హక్కు లేదు: మంత్రి తుమ్మల

image

బీఆర్ఎస్ నాయకులకు నీళ్లు వదలమని అడిగే హక్కు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత వర్షాకాల సీజన్ లో వాళ్లు అధికారంలో ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయలేకపోయారని అలాంటప్పుడు ఈ సీజన్ లో నీళ్లు ఇవ్వమని అడిగే హక్కు వారికి ఎలా ఉంటుందని మంత్రి ప్రశ్నించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలను పూర్తిగా ఎండబెట్టే పరిస్థితికి తెచ్చారని బీఆర్ఎస్ పై ఆయన మండిపడ్డారు.

News March 21, 2024

కొత్తగూడెం: బాలికకు గర్భం.. రూ.2లక్షల జరిమానా

image

సుజాతనగర్ మండలంలో పదో తరగతి బాలికపై అదే తరగతికి చెందిన <<12894244>>బాలుడు అత్యాచారానికి <<>>పాల్పడిన ఘటన తెలిసిందే. బాలిక తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా.. సదరు బాలుడికి రూ.2 లక్షలు జరిమానా విధించారు. తాజాగా ఈ విషయం బయటకు రావడంతో రంగంలో దిగిన ఐసీడీఎస్ అధికారులు బాలికను విచారించి బాలుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.