Khammam

News January 17, 2025

KMM: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

image

కూసుమంచి హైస్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ మండల కేంద్రానికి చెందిన విజయ్ హఠాత్తుగా కుప్పకూలి పోయాడని స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమై హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించాడని, గుండెపోటే కారణమని వైద్యులు నిర్ధారించారు. తమతో ఆడుతూ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా హఠాన్మరణం చెందడంతో మిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు.

News January 17, 2025

ఖమ్మం: వైరా సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు

image

ఖమ్మం జిల్లా వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ రామచంద్రయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేయడంపై విమర్శలు వచ్చాయి. జీపీఏ చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండానే ప్లాట్ల యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం.. ఎల్‌ఆర్‌ఎస్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం, 10 పాట్లు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం చర్చనీయాంశం కావడంతో అధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు.

News January 17, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} అశ్వరావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్న రేషన్ కార్డుల సర్వే

News January 16, 2025

కనులపండువగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News January 16, 2025

ప్రత్తి మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన తుమ్మల

image

ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాలన్ని మంత్రి తుమ్మల సందర్శించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఐజీతో మట్లాడి ఓ ఫైర్ ఇంజిన్ ను పర్మినెంట్ గా మార్కెట్ లో అందుబాటులో ఉంచాలన్నారు. 

News January 16, 2025

ఖమ్మం: ఒక్క గ్రామంలో 10 మందికి టీచర్ ఉద్యోగాలు 

image

ఎర్రుపాలెం మండలం రాజులడేవరపాడులో 10 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి కొలువులు సాధించిన వారిని గ్రామస్థులు సన్మానించారు. దుద్దకూరు గోపిక్రిష్ణ యాదవ్, దుద్దుకూరు కృష్ణ వేణి, పొదిల సాంబయ్య మరికొందరు జాబ్స్ కొట్టిన వారిలో ఉన్నారు. 

News January 16, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం & భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పర్యటన ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన

News January 16, 2025

ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!

image

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారికి తన భార్య పేరు పేర్కొనలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంలో కూనంనేని స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. తన రాజకీయ ప్రత్యర్థి వేసిన కేసులో ఆధారాలు లేవని, న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని కూనంనేని తెలిపారు.

News January 15, 2025

ఖమ్మంలో: యువకుడి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

image

ఖమ్మం గ్రామీణ మండలం పోలెపల్లి పంచాయతీ రాజీవ్ గృహకల్పకు చెందిన <<15158548>>సంజయ్‌కుమార్ <<>>తన అన్న సాయిని పిక్‌అప్ చేసుకోడానికి వెళ్లి మిస్సయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెనాల్ కాలువలో ఆ యువకుడి డెడ్ బాడీ లభించడం కలకలం రేపింది. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి బంధువులు, స్నేహితులు రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News January 15, 2025

KMM: మేకపోతులు కొనేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్ 

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలైన ఘటన పెనుబల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పార్థసారథిపురం గ్రామానికి చెందిన కీసర రాజు, కుంజా మహేశ్‌ కనుమ కావడంతో బైక్‌పై మేకపోతులు కొనేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.