India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటన లక్ష్మీదేవిపల్లి మండలంలో జరిగింది. స్థానికంగా ఓ ప్రైవేటు మెస్లో వంట పనిచేస్తూ ఓ కుటుంబం నివాసముంటుంది. అక్కడే పనిచేస్తున్న మరో వ్యక్తి చాక్లెట్స్ ఇస్తానని చిన్నారిని నమ్మించి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడుస్తూ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆ వ్యక్తికి దేహశుధ్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} దమ్మపేటలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాల అంతరాయం ∆} ఉమ్మడి జిల్లాలో ఎంపీ రామసహాయం పర్యటన

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకటనలో తెలిపారు. ‘ఉ.10 గంటలకు ఖమ్మం దానవాయిగూడెంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారు. 11:45కు ఖమ్మం(R) పోలెపల్లిలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. అనంతరం మ.12:30కు మీడియా ఉంటుంది. సా.5 గంటలకు కొత్తగూడెం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తార’ని పేర్కొన్నారు.

భద్రాద్రి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు పర్యవేక్షణకు ఈ నెల 20న ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేక బృందం రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పనులు వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడిని కోరగా, స్పందించారని వివరించారు. కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో అనువైన భూముల పరిశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విమానాశ్రయం నిర్మాణంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతమైందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వహించారని చెప్పారు. ఉత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన భక్తులకు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరింత పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ మాడ్యూల్ను తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో మంత్రి గ్రీవెన్స్ మాడ్యూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పరిధిలోని జగన్నాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇ.ప్రణీత్ మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల 7,8,9 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ జూనియర్ విభాగంలో మొదటి స్థానాన్ని సాధించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ క్రమంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని, గైడ్ సారలమ్మను టీచర్లు, గ్రామస్థులు అభినందించారు.

ఖమ్మం ఖిల్లా పైకి వెళ్లేందుకు ఏర్పాటు చేయనున్న రోప్వే, జాఫర్ బావి అభివృద్ధితో ఖమ్మం పర్యాటక ప్రాంతంగా మారుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం ఖమ్మం ఖిల్లాను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఖిల్లాకు రోప్వే ఏర్పాటుకు అనువుగా ఉండే మార్గం, ఎక్విప్మెంట్, ఖిల్లాకు రావడానికి రోడ్డు అనుకూలత, పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పండుగ నేపథ్యంలో పహారాను మరింత పెంచుతామని చెప్పారు. అందుకనుణంగా ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఊరికి వెళ్లే ప్రజలు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని సీపీ సూచించారు.

ఖమ్మం జిల్లాలోని డైట్ కళాశాల ద్వారా నైపుణ్యత గల ఉపాధ్యాయులను తయారు చేసి సమాజానికి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం టేకులపల్లిలో పర్యటించి డైట్ అడ్మినిస్ట్రేటివ్ భవన ఆధునీకరణ, అదనపు సదుపాయాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. 70 సం.ల్లో అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యను అభివృద్ధి చేయలేక పోయామని చెప్పారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా కీలకమైందన్నారు.
Sorry, no posts matched your criteria.