Khammam

News January 9, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిర నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} కారేపల్లి లో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News January 9, 2025

KMM: క్వారీ గుంతలో యువకుడి అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఎర్రుపాలెం మండలంలో జరిగింది. నాగవరప్పాడుకు చెందిన రామలింగేశ్వరరావు ములుగుమాడులో ఉన్న క్వారీగుంతలో పడి మృతి చెందాడు. ఈనెల 7న కూలీకి వెళ్లిన రామలింగేశ్వరరావు తిరిగి ఇంటికి రాలేదు. ఆయనకు కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగుండకపోవడంతో పాటు ఫిట్స్ ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరోజే గుంతలో పడిఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

News January 9, 2025

భద్రాచలంలో నేడు, రేపు తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం

image

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా రాముల వారి తొమ్మిది రోజుల ఉత్సవ అవతారాలు నిన్నటితో ముగిశాయి. భక్తులకు స్వామి వారు రోజుకో రూపంలో దర్శనమిచ్చారు. 9వ తారీఖున (నేడు) సాయంత్రం 4 గంటలకు స్వామి వారి తెప్పోత్సవం గోదావరి నదిలో అంగరంగ వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 10న తెల్లవారుజామున 5 గంటలకు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

News January 8, 2025

KMM: రైతు బీమా సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

image

రైతు బీమా, పంటల నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు బీమా పరిహారంలో లోటుపాట్లను సవరించి త్వరతగతిన పూర్తి చేయాలని, అలాగే పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి AEO 25 ఎకరాల ఆయిల్‌పామ్ లక్ష్యం పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, తదితరులు పాల్గొన్నారు

News January 8, 2025

ఖమ్మం: పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్

image

పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI వివరాల ప్రకారం.. KMM జిల్లా కామేపల్లి మండలం రేపల్లేవాడకు చెందిన నెహ్రూ(23) అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. కాగా, వీరి పెళ్లికి యువతి ఇంట్లో వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఈ నెల 3న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. యువకుడి తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News January 8, 2025

ఖమ్మం: సంక్రాంతికి 1030 ప్రత్యేక బస్సులు: RM

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి 1030 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్టీసీ ఆర్‌ఎం సరిరామ్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు HYD-ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు 585, 15 నుంచి 20వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం-HYDకు 445 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సీట్ బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News January 8, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిరలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ∆} కరకగూడెంలో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} పెనుబల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి సర్వే

News January 8, 2025

ఖమ్మం: సంక్రాంతికి 1030 ప్రత్యేక బస్సులు: RM

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి 1030 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్టీసీ ఆర్‌ఎం సరిరామ్ తెలిపారు. ఈ నెల 9 నుంచి 14 వరకు హైదరాబాద్-ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు 585, 15 నుంచి 20వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం-హైదరాబాద్‌కు 445 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సీట్ బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News January 7, 2025

మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి..!

image

త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అవుతుందనే ప్రచారంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఆశావహులు పండుగలు, పబ్బాలకు తాయిలాలు ఇస్తుండడమే కాక శుభ, అశుభ కార్యాల్లో స్థానికులతో మమేకమవుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 589 పంచాయతీల్లో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తొంది. ఇప్పటికే నామినేషన్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి.

News January 7, 2025

30 నుంచి 35% నిధులు రైతు ప్రయోజనాలకే: తుమ్మల

image

బడ్జెట్లో 30 నుంచి 35% నిధులు రైతు ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరంలోనే రూ.73,000 కోట్లు రైతుల కోసం ఖర్చుపెట్టి దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికల కోడ్ వంకతో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతు బంధు రూ.7,600 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసిందని తుమ్మల అన్నారు.