India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది శూన్యమన్నారు. ఇళ్ల నిర్మాణం చేసి మొండిగా వదిలేసిందన్నారు. రైతు భరోసా విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు.

అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తూ పారదర్శకంగా ఓటరు జాబితా ఉండాలని ఖమ్మం ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి.బాల మాయదేవి సూచించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో 98.15% ఓటర్ కార్డులు పంపిణీ పూర్తి చేశామని, చనిపోయినవారి పేర్లు తొలగించామని అదనపు కలెక్టర్ తెలిపారు. బీసీ గురుకులాల్లో కామన్ డైట్ అమలు పర్యవేక్షించాలని అబ్జర్వర్ సూచించారు. ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందించాలని అన్నారు.

న్యాయస్థానం పరిధిలో ఉన్నా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను ఏసీబీ అధికారులు విచారణకు పిలవడాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తప్పుబట్టారు. ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో KTRపై అక్రమ కేసు బనాయించిందని ఆరోపించారు. ఈ కేసు వాదోపవాదాలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని కోరడం శోచనీయం అన్నారు.

భద్రాద్రి క్షేత్రంలో కొలువైన జగదభిరాముడి సోమవారం నిజరూప రామావతారంలో దర్శనమిచ్చారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముందుగా దేవస్థాన వేద పండితులు స్వామివారిని బేడా మండపానికి తీసుకొచ్చి రామావతారంలో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం వేద మంత్రోచ్చరణలు,మేళతాళాలు, భక్తుల కోలాటాలు,రామ నామ స్మరణల నడుమ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు.

ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. కొత్తగూడానికి చెందిన పవన్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల లెక్చరర్/ యాజమాన్యం వేధింపులు తట్టుకొలేక సూసైడ్ చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా కొత్తగూడెంలో ఓ వ్యక్తికి మాంజా తగిలి గొంతుకు గాయమైన విషయం తెలిసిందే.

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి సర్వే ∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

సర్పంచ్ అభ్యర్థులకు ప్రజాశాంతిపార్టీ అధినేత KAపాల్ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. టెన్త్ పాసై, రూ.10తో సభ్యత్వం పొందిన ఎవరైనా వచ్చే స్థానికఎన్నికల్లో తమ పార్టీ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేయవచ్చన్నారు. శనివారం ఖమ్మంలో మాట్లాడుతూ.. తమ పార్టీ మద్దతుతో సర్పంచులు గెలిచిన గ్రామాల్లో 100రోజుల్లోనే ఉచిత విద్య,వైద్యం అందిస్తామన్నారు. జిల్లాను అభివృద్ధి చేయలేని భట్టి విక్రమార్క రాజీనామా చేయాలన్నారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమ పంటలను మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు.

ఖమ్మం నగరంలో ఆదివారం ఐఎన్టీయూసీ ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షుడు కొత్త సీతారాముల అధ్యక్షతన జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి 26 సంఘాల సంఘటిత, అసంఘటితరంగా జిల్లా బాధ్యులు ఐఎన్టీయూసీ మండల ప్రెసిడెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువనాయకులు తుమ్మల యుగంధర్, ఐఎన్టీయూసీ ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీ నాగన్న గౌడ్ జలీల్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.