India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సింగరేణి కార్మికులకు రూ.1.25 కోట్ల ప్రమాద భీమా పాలసీ అమలు స్కీంను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సివిల్స్కు ఎంపికైన విద్యార్థులకు సింగరేణి సహకారంతో లక్ష రూపాయల చెక్కులను సీఎం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సింగరేణి ఎండీ బలరాం నాయక్ పాల్గొన్నారు.

పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని 7 పంచాయతీలను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యాయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలలో ఆరో రోజు (ఆదివారం) పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరశురామావతారంలో ఉన్న స్వామి వారికి బేడా మండపంలో ధనుర్మాస పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహారాజభోగం,మహా నివేదన తరువాత స్వామివారిని తిరువీధులలో ఊరేగిస్తారు.

∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} బూర్గం పహాడ్ మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో చలి తీవ్రత ఆదివారం ఒక్కసారిగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో 17, భద్రాద్రి జిల్లాలో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు పలు ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అటు ఉదయాన్నే పనికి వెళ్లే రోజువారీ కూలీలు చలి తీవ్రత కారణంగా వణుకుతూ పయనమయ్యారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా గ్రామపంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.

పురుగు మందు తాగి టెన్త్ విద్యార్థి మృతి చెందిన ఘటన జూలూరుపాడు మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బాల్యతండాకు చెందిన చరన్ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. జనవరి 1న కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లలేదని కుటుంబ సభ్యులు మందలించగా.. చరణ్ పురుగు మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ పాపారావు కేసు నమోదు చేశారు.

ప్రజలు, పక్షుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశించారు. ఎస్హెచ్ఓలు తనిఖీలు చేపట్టి షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజలు సైతం ఈ మాంజా వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించామన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలం నడుమ ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

ఖమ్మం జిల్లా చింతకాని నుంచి అనంతసాగర్ వెళ్లే మార్గ మధ్యలో ఉన్న మైసమ్మ గుడి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు వందేభారత్ రైలు కింద పడి ఆ వ్యక్తి మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. వ్యక్తి నుజ్జు నుజ్జు కావడంతో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.