India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో యువత ఆన్లైన్ గేమ్స్కు బానిసలవుతున్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, నిరుద్యోగులు ఉంటున్నారు. కూసుమంచి మం. గైగోళ్ళపల్లికి చెందిన ఉపేందర్ ఆన్లైన్ గేమ్స్లో రూ.5 లక్షల వరకు పోగొట్టుకుని <<15051449>>బలవన్మరణానికి <<>>పాల్పడ్డాడు. ఆన్లైన్ గేమ్స్ ప్రమాదకరమని దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} కూసుమంచిలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రెండు రోజులు సెలవులు ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటింటి సర్వే ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

దశాబ్దాల నుంచి ఖమ్మం, పాలేరు ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు ముంపు సమస్యకు మరో 7 నెలల్లోగా శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్నేరు నది ఒడ్డున ముంపునకు గురవుతున్న నివాస కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నదీ తీరం వెంబడి రూ.690 కోట్లతో 17km రిటైనింగ్వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. జులై 15వ తేదీలోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రుద్రంపూర్ ప్రాంతంలో సింగరేణి, అటవీ భూముల్లో సర్వే జరుగుతుందని, అపోహలు నమ్మొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం అమలు చేసిన మా ప్రాంతాలకు రావాలని పట్టుబట్టి సాధించేవరకు నిద్రపోని వ్యక్తి కూనంనేని అని చెప్పారు. కొత్తగూడెం అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి అన్నారు.

కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందేలను నిషేధించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు పోలీస్ అధికారులతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని సీపీ అధికారులకు స్పష్టం చేశారు.

దక్షిణాది అయోధ్యలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో శ్రీరామచంద్రుడు దర్శనమిస్తున్నారు. శుక్రవారం రాములోరు నరసింహావతారంలో భక్తులను కనువిందు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అధ్యాయనోత్సవాలలో భాగంగా పర్ణశాల రామయ్య శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని అర్చకులు తెలిపారు.

ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న <<15045226>>ఓ వ్యక్తి ఆత్మహత్య<<>>కు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కూసుమంచి మండలం గైగోళ్ళపల్లికి చెందిన కోరట్ల ఉపేందర్ (32) కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో రూ.5 లక్షల వరకు పోగొట్టుకుని మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం& భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి సర్వే ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో వేలంపాట ∆} ములకలపల్లి లో ఎమ్మెల్యే జారే పర్యటన ∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా మొదలైన విషయం తెలిసిందే. ఈరోజు(శుక్రవారం) రామయ్య నరసింహ అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ అవతారంలో స్వామివారిని దర్శిస్తే రాహు గ్రహ బాధల నుంచి విముక్తులవుతారని ప్రతీతి. జనవరి 9న సాయంత్రం 4 గంటలకు గోదావరిలో తెప్పోత్సవం, 10న తెల్లవారుజామున ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు (శుక్రవారం) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పీఏ రాఘవరావు ఓ ప్రకటన విడుదల చేశారు. సుజాతనగర్, పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, కొత్తగూడెం, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, అధికారులు గమనించాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.