India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రైతులెవరూ నకిలీ ఎరువులు కొని మోసపోవద్దని సూచించారు. త్వరలో స్కూళ్లు కూడా ఓపెన్ కాబోతున్నాయని వాటి కోసం ముందస్తుగానే రూ.120కోట్లు కేటాయించామన్నారు.
నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. గతంలో ఈ స్థానం నుంచి గెలవకపోవడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్లన్న గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తద్వారా గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…
ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కొత్తగూడెంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండే రెండు ప్రధాన కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో చెప్పుకోలేకపోవటం ఒక కారణమైతే.. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన రెండో తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవాలు జరపరాదని కూనవరం SI శ్రీనివాస్ సూచించారు. స్థానిక పోలీస్టేషన్లో సోమవారం పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయోద్దని, పెట్రోల్, డీజిల్ బాటిల్స్ అమ్మకాలు నిషేధం అన్నారు.
ఖమ్మం-శ్రీకాకుళం మధ్య సూపర్ లగ్జరీ సర్వీసులు ప్రారంభించినట్లు DM యు.రాజ్యలక్ష్మి తెలిపారు. 9937 సర్వీస్ నెంబర్ గల బస్సు ఖమ్మంలో 6:15 బయలుదేరుతుందన్నారు. 9938 సర్వీస్ నెంబర్ గల బస్సు శ్రీకాకుళంలో 4:00 స్టార్ట్ అవుతుందని చెప్పారు. మరిన్ని వివరాలకు 99592 25990 నంబర్ను సంప్రదించాలన్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంట భీమా పథకం అమలుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 5.79 లక్షల మంది రైతులు పంటలను సాగు చేస్తుండగా ప్రతి ఏడాది ఏదో విధంగా పంటలు నష్టపోతున్నారు. ఈ సమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పంట భీమా పథకం అమలు చేస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం భూసార పరీక్షల కోసం ప్రభుత్వం ప్రధాన ల్యాబ్లకు రూ.7.2 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. గతంలో వర్షాధారిత ప్రాంతాల్లో 25 ఎకరాలకు ఒకటి చొప్పున సేకరించి పరీక్షలకు పంపించే వారు. ఈసారి ఎంపికైన మండలాల్లో కొద్దిమంది భూముల నుంచే నమూనాలు సేకరిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే ఏఈఓలు మట్టి నమూనాలను సేకరించే పనిలో ఉండగా ఖమ్మం జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 10 గంటలకు కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందుకు చేరుకుంటారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఇల్లందు సింగరేణి జేకే గ్రౌండ్లో జరిగే పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.
ఎప్సెట్లో మంచి ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఆదివారం జరిగింది. సీఐ శ్రీహరి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లగాని మేఘన(19) ఇంటర్ చదివింది. హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా శనివారం విడుదలైన ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదని మనస్తాపంలో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది.
Sorry, no posts matched your criteria.