India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళిని సోమవారం సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ గుండా శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీఈఎస్ సంస్థలను ఎక్స్టెన్సీ కేంద్రాలుగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలిపారు. పాలీటెక్నిక్, ఎస్సీడబ్లుడీసీలలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, క్రీడలు, కళలు, సంగీతం, వ్యక్తిత్వ వికాసానికి చేస్తున్న కార్యక్రమాలను వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలో సంతానం లేక బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటుచేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. కాగా ఇప్పటివరకు హైదరాబాద్లోని గాంధీ, పేట్ల బురుజు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుతుండగా ఇకపై ఖమ్మంలోనూ అందనున్నాయి. డబ్బు ఖర్చు చేసే స్తోమత లేని వారికి ప్రభుత్వ నిర్ణయం ఉపయోగకరం కానుంది.

U-19 ఆసియా కప్ భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గెలుపులో భద్రాచలం అమ్మాయి గొంగిడి త్రిష కీలక పాత్ర పోషించింది. 47 బంతుల్లో 52 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. ఈ మ్యాచ్ మాత్రమే కాదు టోర్నీ అంతా నిలకడగా ఆడి 159 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను ఎంపికైంది. త్రిష ఇలానే ఆడితే మున్ముందు సీనియర్ టీంకు ఎంపికవుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నియోజకవర్గాల వారీగా నిర్వహించే సదరం క్యాంపుల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈనెల 23న వైరా, 27న సత్తుపల్లి, జనవరి 2న మధిర, జనవరి 9న ఖమ్మం, జనవరి 17న పాలేరు నియోజకవర్గాల వారి కోసం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ కిరణ్కుమార్ ప్రకటించారు. స్లాట్ బుక్ చేసుకున్న రశీదు, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో హాజరు కావాలన్నారు.

మానసిక వేదనకు గురై పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ గార్ల మం. పినిరెడ్డిగూడెం చెందిన బానోత్ వంశీ అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ రియాజ్ పాషా తెలిపారు. వంశీ గతంలో ఒక యువతిని ప్రేమించగా ఆమె కొద్ది రోజుల క్రితం చనిపోయింది. వంశీ మనస్తాపంతో పురుగు మందు సేవించి మృతి చెందాడు. మృతుడి తల్లి భద్రమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

∆} ఖమ్మం జిల్లాలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన ∆} పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

భద్రాచలం, పినపాక, మధిర, ములుగు నియోజకవర్గాల నుంచి కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని MLC తాతా మధు ఆరోపించారు. ఈరోజు ఆయన మండలిలో మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ‘లారీలు పట్టకుంటున్నా మంత్రి గారి కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి మేమేం చేయలేం’ అని అధికారులు చెప్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.

తిరుమలాయపాలెం మండలం పిండిపోలులో గుర్తు తెలియని వ్యక్తులు వెంకటమ్మ అనే మహిళపై దాడి చేశారు. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన వెంకటమ్మకు భర్త లేడు. కిరాణ షాపు నడుపుకుంటూ జీవిస్తోంది. అర్ధరాత్రి సుమారు ఒంటిగంట టైంలో దుండగులు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రూ.10వేలు, గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} ఖమ్మం జిల్లాలో ఎంపీ రఘురాంరెడ్డి పర్యటన ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటింటి సర్వే ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళ 5. 25 కిలోల మగ బిడ్డకు జన్మనిచ్చిన ఘటన శుక్రవారం భద్రాచలంలో చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం ఇరవైండికి చెందిన నందినికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. నందినికి వైద్యులు డెలీవరి చేశారు. ఈ ప్రసవంలో 5. 25 కిలోలు ఉన్న బాలభీముడుకు నందిని జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.