India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుమలాయపాలెం FPCలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా తాత్కాలిక పద్ధతిన పనిచేయుటకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని FPC చైర్మన్ గోవింద కవిత ఓ ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్, అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ డిప్లొమా, తత్సమాన అర్హత అన్నారు. అర్హులు ఈ నెల 27 లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

∆}పాల్వంచ:కోతుల దాడిలో మహిళ మృతి∆} ఖమ్మం:2,3నెలల్లో సర్వేయర్ల నియామకం: పొంగులేటి∆}ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్ పై కేసు: మాజీ ఎమ్మెల్యే∆}కారేపల్లి:రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి∆} ఎర్రుపాలెం:రైతు పంట పొలం వద్ద క్షుద్ర పూజలు∆}ఎన్నికల వరకే రాజకీయాలు: మాజీ ఎమ్మెల్యే కందాల∆}ఖమ్మం పోలీస్ కమీషనరేట్ ఏవోగా చంద్రకళ∆}భద్రాచలం:పేకాట స్థావరాలపైపోలీసుల దాడులు∆}BRSనేతలు ప్రజల గొంతు నొక్కారు:కూనంనేని

కోతులు మీదకి ఎగబడడంతో బైక్ అదుపుతప్పి కిందపడి మహిళ మృతి చెందిన ఘటన మహబుబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలానికి చెందిన మద్దెల నాగమణి పాల్వంచ నుంచి వరంగల్కి బైక్ పై వెళ్తుంది. ఈ క్రమంలో మహబుబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని గాదెవాగు సమీపంలో కోతులు బైక్ మీదకి ఎగబడడంతో బైక్ అదుపుతప్పి కిందపడిడంతో నాగమణి మృతి చెందినట్లు తెలిపారు.

పల్లీలు అమ్ముకుని జీవిస్తున్న దివ్యాంగురాలికి ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ బ్యాంక్ నుంచి రూ.లక్ష రుణం ఇప్పించి మానవత్వం చాటుకున్నారు. కొద్దిరోజుల క్రితం త్రీటౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోతు కమల పల్లీలు అమ్ముతుండగా అటుగా వెళుతున్న కలెక్టర్ ఆమె వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమె తన పరిస్థితిని వివరించింది. స్పందించిన కలెక్టర్ కమిషనర్కు విషయాన్ని చెప్పి బ్యాంక్ ద్వారా రుణం ఇప్పించారు.

ఖమ్మం జిల్లా మంత్రులపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ మంత్రులు బోళాశంకరులని ఏది అడిగినా ఆలోచించకుండానే సరే అంటారని, కానీ ఖమ్మం జిల్లా మంత్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓకే చేస్తారని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యాఖ్యానించారు. భట్టి ఆచి తూచి వ్యవహరిస్తారన్నారు. కాగా జిల్లా మంత్రులపై కూనంనేని వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

2,3 నెలల్లో వెయ్యి మంది సర్వేయర్లను నియమిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 35 నియోజకవర్గాల్లో రెవెన్యూ-ఆటవీ శాఖల మధ్య భూ వివాద సమస్యలు ఉన్నాయని చెప్పారు. వాటి వివరాలను స్థానిక ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా సమాచారమిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బోగస్ ఓఆర్సీల వల్ల కొన్ని భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు మిత్రుడని ప్రజాశాంతి అధ్యక్షుడు KA పాల్ అన్నారు. అతను సీఎం అవ్వాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఆయన మాట్లాడారు. పొంగులేటి మొదట ఖమ్మం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచన చేయాలన్నారు. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం మాత్రం అభివృద్ధిలో మాత్రం ముందుకు వెళ్లడం లేదన్నారు.

మండలంలో పాలనపై MROలు పట్టు సాధించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు, ధరణి, ప్రజావాణి దరఖాస్తులు, మీసేవా దరఖాస్తులు, కళ్యాణ లక్ష్మి షాదీముబారక్, ఓటర్ల జాబితా తయారీ అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. సంక్రాంతిలోపు ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఓడించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రజాశాంతి పార్టీ ద్వారా సర్పంచ్గా గెలిస్తే భారీగా నిధులు కేటాయిస్తూ వంద రోజుల్లో ఆ గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామని గురువారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయలేక బీజేపీ, కాంగ్రెస్ దేశ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట పది రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ మద్దతు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పది రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు.
Sorry, no posts matched your criteria.