India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశం నుంచి జరిగే ఎగుమతుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ప్రాధాన్య శాతం ఏ విధంగా ఉందని ఖమ్మం ఎంపీ రామసహాయ రఘురాంరెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారని అడిగారు. దీనికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

గార్ల నుంచి డోర్నకల్ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న రైల్వే గేటును మూడు రోజులపాటు మూసి వేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్, ఇతర పనుల నిమిత్తం 17 నుంచి 19 తేదీ వరకు తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

భద్రాచలం ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు DEC 31 నుంచి 2025 JAN 20 వరకు జరుగనున్నాయి. అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రామయ్య తన దశావతారాలలో భక్తులకు ప్రత్యేక దర్శనమిస్తారు. DEC 31న మత్స్యావతారం, JAN 1న కూర్మావతారం, 2న వరాహావతారం, 3న నరసింహావతారం, 4న వామనావతారం, 5న పరుశురామావతారం, 6న శ్రీరామావతారం,7న బలరామావతారం, 8న శ్రీకృష్ణావతారం, 9న తెప్పోత్సవం,10న ఉత్తర ద్వార దర్శనమిస్తారు.

మంత్రి పొంగులేటి అసెంబ్లీ చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో కూర్చొని మాట్లాడాలనే కోరిక నాకు వ్యక్తిగతంగా ఉందని’ ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఏడాది కాలంపై ఎలాంటి వ్యతిరేకత లేదు.. వైఎస్ఆర్ సమయంలో ఇలానే ప్రచారం జరిగిందని గుర్తుచేశారు. 2,3 ఏళ్ళల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలో అమలు చేస్తుందని స్పష్టం చేశారు.

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం∆} మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరు పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటింటి సర్వే∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు అవగాహన కల్పించారు. అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా తాడ్వాయిలో సంచరిస్తున్నట్లు రైతులు అధికారులకు తెలిపారు. దీంతో వారు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు పాదముద్రల ఆధారంగా పులి ఎటువైపు వెళ్లిందో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు.

ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా. పి.శ్రీజతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రజావాణిలో డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వో ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారు ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. ముందుగా ఉ.4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

> కొత్తగూడెంలో జిల్లా సీఎం కప్ పోటీలు > ఖమ్మం సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ప్రెస్ మీట్ > ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష > కొత్తగూడెం జిల్లాలో నేటి ప్రజావాణి రద్దు > భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్> అశ్వాపురం తుమ్మలచెరువుకు అధికారుల రాక> సత్తుపల్లిలో సెమీ క్రిస్మస్ వేడుకలు > ఇల్లందులో సీపీఎం జిల్లా మహాసభపై ప్రత్యేక సమావేశం

స్వర్గీయ NTR ఆశయ సాధనకు కృషిచేద్దామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. NTR అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం లకారం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన NTR సినీ వజ్రోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పొట్ల నాగేశ్వరావు, డా.రామనాథం, మాజీ MLC బాలసాని పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.