India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజావాణిలో 27వేలకుపైగా సమస్యలకు పరిష్కారించినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ నెల 8వ తేదీకి సరిగ్గా ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అయింది. ఈ సందర్భంగా వార్షిక రిపోర్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రజావాణికి ఇప్పటివరకూ మొత్తం 82,955 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో గ్రీవెన్స్కు సంబంధించినవి 43, 272 ఉండగా.. 62 శాతం పరిష్కారమయ్యాయన్నారు. మిగతావి ప్రాసెస్లో ఉన్నట్టు వెల్లడించారు.

> కల్లూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> కొనిజర్ల మండలం సింగరాయపాలెంలో సిపిఎం పార్టీ డివిజన్ సమావేశం
> మధిరలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
> బోనకల్ లో వ్యవసాయశాఖ అధికారుల పర్యటన
> కొనసాగుతున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడలు
> ముదిగొండలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక సర్వే
> తల్లాడ మండలం నారాయణపురంలో చండీయాగం
> ఇల్లందులో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం

వెంకటాపురం మండలం ఆలుబాక శివారులో పెద్దపులి సంచరిస్తోందని రైతులు చెబుతున్నారు. ఆలుబాక- బోధాపురం మిర్చి తోటకు వెళ్ళే గోదావరి పాయలో పులి అడుగుజాడలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో పుచ్చపంట దగ్గర పడుకున్న రైతులకు పులి అరుపులు వినిపించినట్లు చెబుతున్నారు. మంగళవారం స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పులి అడుగులను గుర్తించారు.

ఖమ్మం: ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కస్తాల సత్యనారాయణ అన్నారు. 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న వారికి న్యూ స్కీం క్రింద బాలురకు సం.కి రూ.1,000, బాలికలకు సం.కి రూ.1,500, రాజీవ్ విద్య దీవెన క్రింద 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు సం.కి రూ.3 వేలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఖమ్మం: పామాయిల్ పంట సాగు ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? అని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా.. ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న తెలంగాణ ప్రాంతంలో.. ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తుందా..? అని లిఖిత పూర్వకంగా అడిగారు.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షలలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ 22 మంది విద్యార్థులు పట్టుబడినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 12 మంది, ఆదిలాబాద్లో ఐదుగురు, ఖమ్మంలో ఐదుగురు విద్యార్థులు చిట్టీలు రాస్తూ పట్టుబడగా వారిని డిబార్ చేసినట్లు చెప్పారు.

ఖమ్మం:ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొని సరైన సమాచారం అందించి అధికారులకు సహకరించాలని సోమవారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి మొబైల్ యాప్లో నమోదు చేయడానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు స్టేషన్లలో నెలకొన్న రైల్వే సంబంధిత సమస్యలపై ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు వినతి అందజేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేశ్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దామోదర్ రావులు రైల్వే మంత్రిని కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు.

మహాలక్ష్మి పథకం అమలై ఏడాది అవుతోంది. గతేడాది ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం పాతబస్టాండ్లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 4.30 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు.

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} అన్నపు రెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} పినపాకలో బీఆర్ఎస్ కార్యక్రమం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
Sorry, no posts matched your criteria.