India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచాలని, విద్యార్థుల ఆరోగ్యం పెంపొందటానికి పుష్టికరమైన ఆహారం చాలా అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ అన్నారు. ఖమ్మంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన మధ్యాహ్న భోజన కుక్ కం హెల్పర్ల జిల్లా స్థాయి వంటలు పోటీలను ఆయన ప్రారంభించారు. పలు స్కూల్స్ కి చెందిన కుక్లు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్వారిగూడెం సమీపంలోని కోళ్ల ఫారం వద్ద లారీ-బైక్ ఢీకొన్న ఘటనలో బైక్పై వెళుతున్న ఇద్దరు చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అశ్వారావుపేట అస్పత్రికి తరలించారు.

తల్లి మందలించడంతో కూతురు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం అశ్వారావుపేటలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని దండాబత్తుల బజార్కు చెందిన సామినేని వెంకన్న, వరలక్ష్మీ దంపతుల కుమార్తె జశ్విత సాయి(17) ఇంటర్ చదువుతోంది. ఉదయం లంచ్ బాక్స్ సర్దుకునే విషయంలో తల్లీ, కూతురికి గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

> ఖమ్మంలో CPM పార్టీ డివిజన్ మహాసభ > కల్లూరులో ఎమ్మెల్యే రాగమయి పర్యటన > మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన > ఢిల్లీలో రైతులపై దాడిని నిరసిస్తూ కొత్తగూడెంలో రైతు సంఘం నిరసన >చింతూరులో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్పై అవగాహన

వైరాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. నరసింహారావు అనే వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. రూ.15 లక్షలు ట్రాన్స్ఫర్ చేయకపోతే నిన్ను పోలీసులు అరెస్టు చేస్తారంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు భయపడి వారికి రూ.15 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. మరల రూ.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలని బెదిరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టిజిఎస్ ఆర్టీసీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏసీ బస్సుల్లో బేసిక్ టికెట్ చార్జిపై 10% రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఏసీ బస్సులు ఉన్న అన్ని రూట్లలో రాయితీ ఈ నెల 31 వరకు వర్తిస్తుందని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సీట్ బుకింగ్ కొరకు www.tgsrtcbus.in సంప్రదించాలన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా క్షేత్ర స్థాయి డాటా సేకరణలో పొరపాట్లకు తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో MROలు, MPDOలు, MPOలు, మునిసిపల్ కమిషనర్ లకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, అధికారులకు అవగాహన కల్పించారు. రొటీన్ కార్యక్రమంలా భావన వద్దని, ఒక పేదవారికి శాశ్వత ఇంటి హక్కు ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల వివరాలను యాప్లో ఒకేసారి ఎంట్రీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అందులో నుంచే దశలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. గత పాలకులు ధరణి పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, వాటిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. అసైన్డ్ భూముల హక్కులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి CMగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది గడిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగిలిన నాలుగేళ్లలో కొత్తగూడెం ఎయిర్ పోర్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, టెక్ట్స్ టైల్ పార్క్ పూర్తి, పలు చోట్ల ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు, పలు ఐటీ, ఇతర ఇండస్ట్రీస్ను తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మిగిలిన నాలుగు ఏళ్లలో జిల్లాకు ఏం కావాలో కామెంట్స్ చేయండి.

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇటీవల భద్రాద్రి ఆలయాన్ని సందర్శించిన రేవంత్.. భద్రాద్రి గోదావరి కరకట్ట పనులను ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు. పాలేరు నియోజకవర్గానికి జేఎన్టీయూ కాలేజీని మంజూరు చేశారు. ఖమ్మంలో రేపు తుమ్మలతో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. ఏడాది పాలనపై మీ కామెంట్.
Sorry, no posts matched your criteria.