Khammam

News May 11, 2024

ఓటర్ స్లిప్పు రాలేదా.. ఆందోళన వద్దు

image

ఖమ్మం: ఈనెల 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఓటర్ స్లిప్పు రానివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే స్లిప్పు రాకుండా ఒక ఎస్ఎంఎస్ తో పోలింగ్ బూతులో ఓటు ఉందో లేదో సులభంగా తెలుసుకొని అవకాశం ఉంది. ఓటరు తన ఫోను నుంచి ఈ సీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ కార్డు నెంబరు నమోదు చేసి 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు మెసేజ్ పంపించాలి. వెంటనే పోలింగ్ బూత్ నెంబర్ ఓటర్ జాబితాలోని క్రమసంఖ్య వివరాలతో మెసేజ్ వస్తుంది.

News May 11, 2024

ఓటింగ్ క్రతువును వీక్షించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు

image

పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ క్రతువును వీక్షించేందుకు సంబంధిత కలెక్టరేట్లలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు కలెక్టర్, ఇతర ఎన్నికల సిబ్బంది పర్యవేక్షించటానికి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, తనిఖీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన నిఘానేత్రాల ద్వారా అక్కడి తంతును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

News May 11, 2024

కొత్తగూడెం: ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

image

ఉరేసుకుని యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గుండెపూడిలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిసిన వివరాలిలా.. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బిందు(21) ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఉరేసుకుంది. బయటకు వెళ్లిన తండ్రి ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి విగతజీవిగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 11, 2024

ఖమ్మం: ’63 మంది నామినేషన్ చెల్లుబాటు’

image

NLG-WGL-KMM జిల్లాల పట్టభద్రుల MLC బై పోల్‌కు 69 మంది అభ్యర్థులు 117 సెట్ల నామినేషన్లు సమర్పించారని రిటర్నింగ్‌ అధికారి హరిచందన తెలిపారు. 6 నామినేషన్లు తిరస్కరించినట్లు వెల్లడించారు. 63మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుందన్నారు. ఈ నెల 27న పోలింగ్, జూన్‌ 5న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.

News May 11, 2024

KTDM: ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లా గంగలోర్ పీఎస్ పరిధిలోని పీడీయా  అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాగా మృతుల సంఖ్య పెరిగే మరింత అవకాశం ఉందని తెలిసింది. అలాగే మృతి చెందిన వారిలో అగ్ర నేతలు ఉన్నట్లు సమాచారం.

News May 11, 2024

KMM: ఇవాల్టితో ప్రచారానికి తెర

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగడుతున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

News May 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
> ఖమ్మం నగరంలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ
> ఎన్నికల నిర్వహణపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
> ఖమ్మం రూరల్ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
> ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల పొంగులేటి పర్యటన
> ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

News May 11, 2024

నిషేధ ఆజ్ఞలు అమలులో ఉంటాయి : సీపీ

image

ఈనెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిషేధ ఆజ్ఞలు అమలులో వుంటాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు, ఊరేగింపులు అన్ని రకాల ప్రచారాలు నిషేధించబడతాయన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. 

News May 10, 2024

లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై పటిష్టమైన ఏర్పాట్లు చేశాం: సీపీ

image

శాంతియుత వాతావరణంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. తదితర ఎన్నికల విధులపై సిబ్బందికి పోలీస్‌ కమిషనర్‌ దిశా నిర్దేశం చేశారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉండటంతో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలపై సూచనలు చేశారు.

News May 10, 2024

రేపు సాయంత్రం నుండి మద్యం షాపులు బంద్

image

ఈ నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ రాత్రి 10 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని సూచించారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు.