Khammam

News December 7, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా హెడ్ లైన్స్ 

image

∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} మణుగూరులో మంచినీటి సరఫరా బంద్ ∆} బయ్యారంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} దమ్మపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష ∆} పెనుబల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News December 7, 2024

మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు: డిప్యూటీ సీఎం భట్టి

image

రాష్ట్ర మహిళా సంఘాలతో రూ.1000 మెగావాంట్ల సామర్థ్యం ఉన్న సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. వారికి బ్యాంకులతో రుణాలు ఇప్పించి, ఉత్పత్తయిన కరెంటుని గ్రిడ్‌కి కనెక్ట్ చేయించి, తద్వారా వారికి డబ్బులు చెల్లించేలా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీకి తరలుతున్న నేపథ్యంలో కొత్త విద్యుత్తు విధానం తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.

News December 6, 2024

దేశంలో రక్తహీనత కేసులు ఎక్కువయ్యాయి: ఎంపీ రఘురాం రెడ్డి

image

దేశంలో మహిళలు, గర్భిణులు, బాలింతలు, పిల్లలపై రక్తహీనత తీవ్ర ప్రభావం చూపుతోందని, ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది తెలియదా..? అని లోక్ సభలో ప్రశ్నించారు. దీని నివారణకు చేపట్టిన పథకాలు, కార్యక్రమాలతో వచ్చిన మార్పు వివరాలు ఏమిటని అడిగారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ మేరకు శుక్రవారం లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నలో కోరారు.

News December 6, 2024

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల

image

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌లోని దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. పవర్ ప్లాంట్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని వారు తెలిపారు.

News December 6, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} తల్లాడలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన ∆} మణుగూరులో మంచి నీటి సరఫరా బంద్ ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News December 6, 2024

రాత్రి ఖమ్మంలో రోడ్డు ప్రమాదం UPDATE

image

ఖమ్మంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14801070>>ఇద్దరు <<>>చనిపోయిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన శివరాజు(18), హర్షవర్ధన్(15) ఉదయం బైక్‌పై ఖమ్మం వచ్చారు. తిరుగు ప్రయాణంలో వీరి బైక్‌ను RTC బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News December 6, 2024

రామాలయం అభివృద్ధికి రూ.63 కోట్లు: ఎమ్మెల్యే తెల్లం

image

భద్రాద్రి రామాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.63 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తెలిపారు. అటు ఇప్పటికే దీనికి సంబంధించి భూసేకరణ పనులు జరుగుతున్నాయని గురువారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై నాయకులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

News December 6, 2024

కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం: భట్టి 

image

మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే అవకాశం స్థానిక మహిళలకే ఇస్తున్నామని ఆయన తెలిపారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు శిల్పారామంలో వారు తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు.

News December 6, 2024

 మహిళలకు శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల

image

తెలంగాణ మహిళలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇందులో మహిళలకు అవకాశాలు కల్పిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గురువారం సత్తుపల్లి నియోజకవర్గంలోని బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కును మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు.

News December 6, 2024

‘ఖమ్మం జిల్లాలో లక్ష మంది రైతులకు పైగా రుణమాఫీ కాలేదు’

image

ఖమ్మం జిల్లాలో లక్ష మంది రైతులకు పైగా రుణమాఫీ కాలేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. గురువారం సుందరయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు రుణమాఫీ ప్రక్రియ పూర్తియినట్లుగా ప్రకటన చేయటం రైతులను మభ్య పెట్టేందుకేనని పేర్కొన్నారు. ఖమ్మం డిసిసిబి పరిధిలో 80 వేల మందికి పైగా రైతుల రుణమాఫీ చేయకుండా పూర్తి ఎలా అవుతుందని ప్రశ్నించారు.