India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ క్రాస్ రోడ్ సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొన్నాయి. ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బైక్ – లారీ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ములుగు(D) వాజేడు SI హరీశ్కు సూర్యాపేటకు చెందిన యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆమె గురించి వాకబు చేయగా గతంలో ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని తెలిసింది. పెళ్లి ఇష్టంలేదని, సెటిల్మెంట్ కోసం ఆమెను హరీశ్ రిసార్ట్కు పిలిచారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో విషయం ఉన్నతాధికారులకు చెబుతానని యువతి బెదిరించింది. దీంతో హరీశ్ సూసైడ్ చేసుకున్నారు.

∆} వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} కొనిజర్లలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు కార్యక్రమం
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పినపాక లో ఎమ్మెల్యే పాయం పర్యటన

ఖమ్మం: ART మందులు వాడుతున్న ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా ART మందులు వాడి జీవన కాలాన్ని పెంచుకోవాలని డిఎంహెచ్ఓ కళావతి అన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ART సెంటర్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో డిఎంహెచ్వో పాల్గొని మాట్లాడారు. అలాగే వైద్య అధికారులతో కలిసి హెచ్ఐవి/ ఎయిడ్స్ కు సంబంధించిన అవగాహన పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సురేందర్, మోహనరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టల్ శాఖ ఉద్యోగాలకు 95శాతo తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులనే ఎంపిక చేయాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో పోస్టల్ శాఖ కార్యదర్శి వందిత కౌల్ కు బుధవారం ఢిల్లీలోని పోస్టల్ శాఖ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పదవ తరగతిలో గ్రేడ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు.

సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ను రాష్ట్ర మంత్రులతో గురువారం ప్రారంభిస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద చెప్పారు. ఈ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పాల్గొంటారని చెప్పారు. కావున మీడియా మిత్రులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన

తెలంగాణ ఉద్యమకారుడు మోరే భాస్కర్రావు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కొత్తగూడెం ప్రాంతం నుంచి ఆయన కీలక పాత్ర పోషించారు. 2001లో KCR ప్రారంభించిన TRS పార్టీ తరఫున ఈ ప్రాంతం నుంచి కీలక నేతగా పనిచేశారు. వార్డు కౌన్సిలర్గా, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా విధులు నిర్వహించారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మోరే భాస్కర్.

ఖమ్మం: ACB టోల్ ఫ్రీ నెంబర్ 1064 విస్తృత ప్రచార నిమిత్తం రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. లంచం ఇవ్వవద్దని, లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదులకు 9154388989/040-23251555, వాట్సాప్ నెంబర్ 9440446106, ఇ-మెయిల్ dg_acb@telangana.gov.in, KMM రేంజ్ 9154388981/ 0874-2228663 కు సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.