India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాకు మంగళవారం విచ్చేసిన అంచనా నిపుణుల బృందానికి ఇటీవలి వరద నష్ట తీరు, చేపట్టిన చర్యల వివరాలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. 229 గ్రామాలలో, 42 పట్టణ ప్రాంతాల్లో 53,430 మంది జనాభా ప్రభావితమయ్యారని, 59 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 9516 మందిని శిబిరాలకు తరలించడం జరిగిందని తెలిపారు. 6 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్కొక్కరికి ₹5 లక్షల చొప్పున ₹30 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించామన్నారు.

ఖమ్మం రాపర్తి నగర్, వెజిటబుల్ మార్కెట్ రోడ్ లో గల BSNL భవన ప్రాంగణంలో ESI డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ నూతన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ జి. సాయి కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కార్మికులు వైద్య, అనారోగ్య, ప్రసూతి, వృత్తిపరమైన ప్రమాదాలు, శాశ్వత వైకల్యం, డిపెండెంట్ ప్రయోజనాలు పొందవచ్చని బ్రాంచ్ మేనేజర్ పేర్కొన్నారు.

∆} ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} చండ్రుగొండలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యాటన ∆} జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ తో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా రాజ్యసభలోని ఛైర్మన్ ఛాంబర్ కు ఎంపీ రవిచంద్ర సోమవారం ఉదయం వెళ్లి ధనఖర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతితో రాజ్యసభ సభ్యుడు పలు అంశాలపై చర్చించారు.

∆} ఖమ్మం:ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు∆}ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ఎన్నో చర్యలు: భట్టి∆}సత్తుపల్లి: కారు బీభత్సం.. తప్పిన ప్రమాదం∆} కొత్తగూడెం:బాధితుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి:ఎస్పీ∆} పినపాక:అన్నం పెట్టే రైతును సుభిక్షంగా చూస్తాం: ఎమ్మెల్యే∆}గ్యారంటీల అమలు కోసం బిజెపి ఉద్యమాలు చేస్తుంది: శ్రీధర్ రెడ్డి∆} అశ్వాపురం: పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పోలి పాడ్యమి సందర్భంగా రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులతో భద్రగిరి పోటెత్తింది. గత నెల రోజుల నుండి కార్తీక మాసం సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈ రోజు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులందరికీ స్వామి వారి తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద అవకాశాన్ని కల్పించామన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి పొంగులేటి పర్యటనలో భాగంగా జూలూరుపాడు, కూసుమంచి మండలాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. కావున సంబంధిత అధికారులు గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.

వాజేడు ఎస్ఐ హరీశ్ తన<<14767070>> రివాల్వర్తో కాల్చుకొని<<>> మృతి చెందిన ఘటన తెలిసిందే. కాగా, ఈనెల 14న హరీశ్ ఎంగేజ్మెంట్ జరగనుందని స్థానికులు తెలిపారు. అంతేకాక ఎంగేజ్మెంట్కు సంబంధించి షాపింగ్ చేయాల్సి ఉందని, తన స్నేహితులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇంతలో ఆత్మహత్యకు పాల్పడడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

∆} మధిరలో ప్రజా విజయోత్సవాల కార్యక్రమం ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} కారేపల్లిలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} భద్రాద్రి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం రద్దు ∆} ఎమ్మెల్యే రాగమయి పర్యటన

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలలో భాగంగా నేడు మధిరలోని రెడ్డి రెడ్డి గార్డెన్స్లో సాంస్కృతిక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.