India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాడి పశువుల పెంపకానికి మరింత చేయూతను అందిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయాల జాతీయ సేవా పథకంలో భాగంగా పశు వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పాడి పశువుల పెంపకం అనేది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ దాని ద్వారా లాభాలను అర్జించవచ్చని తెలిపారు.

రైతు పండుగ కార్యక్రమం విజయవంతం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వారి నివాసంలో ఆదివారం పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి అభినందనలు తెలిపారు. రైతాంగంకు ఆధునిక సాగు పద్ధతులు యాంత్రీకరణ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని చెప్పారు. బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పై రైతు భరోసా పై యావత్ తెలంగాణ కు స్పష్టత ఇచ్చారని పేర్కొన్నారు.

అమెరికా కాల్పుల్లో ఖమ్మం రాపర్తినగర్కు చెందిన <<14750277>>సాయితేజ <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎంపీ రఘురాంరెడ్డి ఫోన్లో సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా పంపించాలని వీదేశీ మంత్రిత్వ శాఖతో మాట్లాడినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువస్తామని చెప్పారు.

ధరణి పెండింగ్ దరఖాస్తుల ను పరిష్కరించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం కలెక్టర్ ధరణి దరఖాస్తులపై జిల్లా స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి మాడుల్స్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేయాలన్నారు. అన్ని మాడ్యూల్స్లో దాఖలైన ధరణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు.

పదేళ్ల BRS పాలనలో ఛిన్నాభిన్నమైన తెలంగాణను CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాగు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. MBNRసభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా ఆర్థిక వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ ఆగమైందని, ఏడాదిగా బాగు చేస్తున్నామని తెలిపారు. ‘అన్నా.. కష్టాలున్నా.. అప్పులున్నా.. కడుపు కట్టుకోనైనా సరే రైతు రుణమాఫీ చేద్దామని’ సీఎం అన్నారని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు.

వివిధ కారణాలవల్ల రుణమాఫీ కానీ రైతుల ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేసి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు మహబూబ్నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల మాదిరి తాము గాలి మాటలు చెప్పేటోళ్లం కాదని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రుణమాఫీ సక్రమంగా జరిగిందా అంటూ ప్రశ్నించారు.

అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఖమ్మం రాపర్తినగర్కు చెందిన <<14749255>>యువకుడు సాయితేజ<<>> చనిపోయిన విషయం తెలిసిందే. MS చదివేందుకు చికాగో వెళ్లిన సాయితేజ అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు జాబ్ చేసే సమయంలో దుండగులు ముసుగు వేసుకొచ్చి అతడిని డబ్బులు అడిగారు. భయపడిన సాయితేజ వెంటనే అతడి దగ్గర ఉన్న డబ్బులన్నీ వారికి ఇచ్చేశాడు. అయినా సరే వారు దారుణంగా సాయితేజ గుండెలపై కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు ప్రకారం.. నేలకొండపల్లి మండల చెన్నారానికి చెందిన శనగాని వెంకన్న అయ్యప్ప స్వామి మాల ధరించి ఇరుముడి సమర్పించేందుకు శబరిమల వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రక్తపు వాంతులు, విరోచనాలు అయ్యాయి. గమనించిన తోటి అయ్యప్ప స్వాములు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

∆} వివిధ శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు ∆} సత్తుపల్లి మండలంలో మంచినీటి సరఫరా బంద్ ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మంలో ప్రజా విజయోత్సవాల కార్యక్రమం ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు అధికారులు రెండు రోజుల సెలవులు ప్రకటించారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు కోరారు.
Sorry, no posts matched your criteria.