Khammam

News November 30, 2024

ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజుల సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు రెండు రోజుల సెలవులు ప్రకటించారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు కోరారు.

News November 30, 2024

సీనియర్ సిటిజన్స్‌కు వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

సీనియర్ సిటిజన్స్ కు జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ప్రాధాన్యతతో ఒకేచోట వివిధ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో సీనియర్ సిటిజన్‌ల కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య సేవల విభాగాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే వయో వృద్ధులకు సీనియర్ సిటిజన్ వైద్య సేవల విభాగం ద్వారా సంపూర్ణ సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు.

News November 30, 2024

ప్రభుత్వ విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో వరసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ రేపు ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అనేక మరణాలు జరిగాయని వారు ఆరోపించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ఎగ్స్ గ్రేషియా చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. SFI,PDSU,AISF సంఘాలు బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆసంఘాల ప్రతినిధులు తెలిపారు.

News November 29, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

∆} ఖమ్మం:రైతుకు ఏది మేలు అయితే అదే అమలు చేస్తాం: తుమ్మల∆} ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే∆}కొత్తగూడెం: కోచింగ్ లేకుండానే మూడు ఉద్యోగాలు∆} వైరా:భర్తపై భార్య కత్తితో దాడి∆} మధిర: షిఫ్ట్ కారులో వచ్చి పలు ఇండ్లలో దొంగతనాలు∆} మణుగూరు: జర్నలిస్టులపై కేసు కొట్టివేత∆}వెంకటాపురం:ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి

News November 29, 2024

మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై మీ కామెంట్..?

image

రైతు బంధుపై మంత్రి తుమ్మల ‘మహబూబ్ నగర్‌ రైతు పండుగ’ సభలో ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారు’ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. తాము రైతులకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పల్లకీలో ఊరేగించబోమని, ప్రభుత్వం తరఫున చేయాల్సినంత చేస్తామన్నారు. మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్ తెలపండి.

News November 29, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటాలు ఏసీ మిర్చి ధర రూ.16,325 జెండా పాట పలకగా, క్వింటాలు పత్తి ధర రూ.7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.75 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News November 29, 2024

REWIND: కేసీఆర్ అరెస్టు తర్వాత ఇదే జరిగింది..

image

2009 NOV 29న కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్‌ను మొదట రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలనుకున్నారు. చివరకు ఖమ్మంకు తీసుకెళ్లారు. NOV 29 నుంచి DEC 2 వరకు ఖమ్మం జైలులో, ప్రభుత్వాసుపత్రిలో కేసీఆర్ ఉన్నారు. హ్యూమన్ రైట్స్ ఆదేశాలతో HYD తరలించారు.

News November 29, 2024

REWIND: మలిదశ ఉద్యమానికి పురుడుపోసిన ఖమ్మం గడ్డ!

image

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ మలిదశ ఉద్యమంలో భాగంగా KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి ఊపిరి పోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. నాటి కేసీఆర్ దీక్షతో తెలంగాణ సుభిక్షం అయింది.

News November 29, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్ష దివస్ కార్యక్రమం∆} ఖమ్మంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ర్యాలీ ∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లి మండలంలో మంచినీటి సరఫరా బంద్ ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో రుద్రాభిషేకం ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News November 29, 2024

KMM: డ్రగ్స్ నియంత్రణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ ప్రాధాన్యత అంశంగా అధికారులు పని చేయాలని, ఈ దిశగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజతో కలిసి కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.