Khammam

News May 7, 2024

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

అధిక లాభాలు, ఆన్‌లైన్ ట్రేడింగ్ ముసుగులో కేటుగాళ్లు వేసే వలలో పడి మోసపోవద్దని సీపీ సునీల్‌దత్ ప్రజలకు సూచించారు. ఇటీవల ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట రూ.లక్షలు మోసపోయామంటూ పలువురు తమ వద్దకు వచ్చారని చెప్పారు. అపరిచిత లింకులు, వెబ్ సైట్లను, అప్లికేషన్లను, మెసేజ్‌లను నమ్మకూడదన్నారు. బాధితులు సైబర్ క్రైం హెల్ప్‌లైన్ 1930కు తక్షణమే కాల్ లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయాలన్నారు.

News May 7, 2024

నేడు ఖమ్మం జిల్లాలో హీరో వెంకటేశ్ పర్యటన

image

సినీ హీరో వెంకటేశ్ నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. పర్యటన వివరాలను రఘురామి రెడ్డి వెల్లడించారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఖమ్మం మయూరి సెంటర్, పాత బస్టాండ్, జడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ ఉంటుందని వెల్లడించారు.రాత్రి 8 గంటలకు కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు.

News May 6, 2024

తులం బంగారం తుస్సుమంది: పువ్వాడ

image

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హామీలన్నీ అటకెక్కాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని గట్టయ్య సెంటర్లో నిర్వహించిన మీటింగ్‌‌‌లో మాట్లాడారు.’తులం బంగారం తుస్సు మనే.. కళ్యాణ లక్ష్మీ బుస్సుమనే’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.  ఐదు నెలల్లో అన్ని సంక్షేమ పథకాలు గాల్లోకి వదిలిపెట్టారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో నామాను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

News May 6, 2024

ఖమ్మం: అమాంతం పెరిగిన చికెన్ రేటు

image

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. వేసవి ఎండ ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఎక్కువయ్యాయి. కిలో చికెన్ రూ.280కి విక్రయిస్తున్నారు. ఈ ప్రభావం నాటు కోడి మాంసంపైనా పడింది. గత వారం వరకు రూ.450 ఉన్న నాటు కోడి మాంసం ఈ వారం రూ.500లకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలో సాధారణ రోజుల్లో 40 టన్నులు, పెళ్లిళ్ల సీజన్లో 50 టన్నుల వరకు కోడిమాంసం వినియోగం ఉంటోంది. ఆదివారమైతే అది 120 టన్నులు అవుతోంది.

News May 6, 2024

మే 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం

image

మే 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం ఉందని ఓటర్లు వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా వైరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఆయన సోమవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News May 6, 2024

ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్ళకు శంకుస్థాపనలు:డిప్యూటీ సీఎం

image

ఖమ్మం: సొంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్న పేదింటి ప్రజలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలు చేస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్క అర్హులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News May 6, 2024

ఖమ్మం: 8 రోజులపాటు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

image

ఈ నెల 7 నుంచి 14 వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు వర్ష సూచన, ఎండ తీవ్రత దృష్ట్యా హమాలీ కార్మికుల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని 8 రోజులపాటు బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీ నుంచి యథావిధిగా మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.

News May 6, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. పత్తి జండా పాట క్వింటా రూ.7,150, నాన్ ఎసీ మిర్చి ధర క్వింటా రూ.18,000, ఏసీ మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలికినట్లు అధికారులు వెల్లడించారు. వారం రోజులుగా రూ.50 నుంచి 300 వరకు హెచ్చుతగ్గుల మధ్య ధర కొనసాగుతోంది. ఏసీ మిర్చికి స్వల్పంగా ధర పెరుగుతోంది.

News May 6, 2024

ఖమ్మంలో జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

image

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటు కారేపల్లిలో 14.5 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఖమ్మం ఖానాపురం వద్ద 13 మి.మీ., కామేపల్లి మండలం లింగాల 8, ఖమ్మం ప్రకాష్ నగర్ 7, రఘునాథపాలెం, పమ్మిలో 4.8, పంగిడిలో 4.5, నేలకొండపల్లిలో 3.5, నాగులవంచలో 2.8, చింతకానిలో 2.3, కొణిజర్లలో 1.5, ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ 0.8, బాణాపురం, బచ్చోడులలో 0.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో వాతవరణం చల్లబడింది. 

News May 6, 2024

ఖమ్మం: గుండెపోటుతో యువతి మృతి

image

గుండెపోటుతో యువతి మృతిచెందిన ఘటన కలకోటలో శనివారం రాత్రి జరిగింది. కలకోటకి చెందిన మౌనిక(27) ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసి అవనిగడ్డలో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. అనారోగ్యానికి గురవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు.