Khammam

News November 28, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం & భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో మంచినీటి సరఫరా బంద్ ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} ఖమ్మంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటన ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన

News November 28, 2024

పేదలందరికీ ఇళ్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం కూసుమంచిలో పర్యటించారు. గత ఎన్నికల్లో ఎంతో కష్టపడి తనను గెలిపించారని, నియోజవర్గ ప్రజలు ఆశలను వమ్ము చేయనని అన్నారు. త్వరలోనే  పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని.. ఇదంతా ప్రజలిచ్చిన దీవెనలు, ఆశీస్సులతోనే జరిగిందన్నారు. 

News November 27, 2024

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో బుధవారం 17, అటు భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతాలతో 15,16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎముకలు కొరికే ఈ చలిలో ఉదయాన్నే బయటకు రావాలంటేనే ప్రజలు గజ గజలాడుతున్నారు. అటు వృద్ధులు, పిల్లలు పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది.

News November 27, 2024

ఖమ్మం రీజీయన్‌ RTCలో 116 కాంట్రాక్టు ఉద్యోగాలు

image

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఖమ్మం రీజీయన్‌లో 116 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT

News November 27, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరుల విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో మంచినీటి సరఫరా బంద్ ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన

News November 27, 2024

భద్రాచలాన్ని మండలంగా ప్రకటిస్తూ జీవో జారీ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరొక మండలాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. భద్రాచలం పట్టణాన్ని మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ను వెలువరించింది. భద్రాచలాన్ని మండలంగా ప్రకటిచడంతో మళ్లీ ఎన్నికల సందడి నెలకొననుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎంపీపీ జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ వర్గాలు అనందం వ్యక్తం చేస్తున్నాయి.

News November 27, 2024

CM రేవంత్ తో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

image

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. నిర్దిష్ట సమయంలో ధాన్యం సేకరణ పూర్తి కావాలని, సేకరించిన వాటికి చెల్లింపులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అటు జిల్లాలో జరుగుతున్న ధాన్యం సేకరణ వివరాలను జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

News November 27, 2024

రూ.100 కోట్లు తిరిగి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే కూనంనేని

image

అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దీంతోపాటు అదానీ చేసుకున్న ఒప్పందాలలో ఏమైనా అవినీతి జరిగిందా అనే కోణాన్ని కూడా ప్రభుత్వం బయట పెట్టాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

News November 26, 2024

కొత్తగూడెం ఎయిర్‌పోర్డుపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

image

తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని సీఎం తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. త్వరలోనే కొత్తగూడేనికి సాంకేతిక బృందాన్ని పంపించనున్నట్లు చెప్పారు. కొత్తగూడెంతో పాటు వరంగల్ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేసే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు.

News November 26, 2024

‘ఉచిత కోచింగ్ కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’

image

విదేశాలకు వెళ్లి చదవాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం IELTS, GRE, TOFEL పరీక్షలకు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. ఆసక్తి, అర్హత గల జిల్లా మైనార్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30 లోపు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.