Khammam

News May 6, 2024

ఖమ్మం: నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో II, IV, VI సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 1,70,991 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 122 పరీక్ష కేంద్రాలను, 8 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

News May 6, 2024

ఖమ్మం జిల్లాలో ఎగిరేది ఏ జెండా..?

image

ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఫైట్ మరింత ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ నుంచి రఘురాం రెడ్డి పోటీ చేస్తుంటే.. బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. ముగ్గురూ పోటాపోటీగా ప్రచారాలు చేస్తుండడంతో.. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్లో ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. దీంతో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

News May 6, 2024

KMM: గ్రామాల్లో కనిపించని ఎన్నికల సందడి !?

image

ఎన్నికలంటే ఓ పండగ! దాదాపు ఇరవై రోజుల పాటు నిత్యం నాయకుల మాటల పోరు, ర్యాలీలూ, సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో కనిపిస్తున్న ఊర్లలో ఎన్నికల ఊపు కనిపించడం లేదు.

News May 6, 2024

మరో ఆరు రోజులే.. ప్రచారం జోరు ..!

image

MP ఎన్నికల ప్రచారానికి గడువు మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. దీంతో పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. తీవ్ర ఎండలోనూ నాయకులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు పర్యటించి క్యాడర్లో జోష్ నింపారు. అటూ ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తిస్తున్నాయి. బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. దీంతో ఖమ్మం పార్లమెంట్లో రాజకీయం వేడెక్కింది.

News May 6, 2024

ఈవీఎంల ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు ఉండొద్దు: కలెక్టర్

image

ఈవిఎంల కమిషనింగ్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చేపడుతున్న ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవిఎం, వివిప్యాట్ల కమిషనింగ్ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈక్రమంలో సిబ్బందికి ఆయన‌ సలహాలు సూచనలు చేసారు.

News May 5, 2024

KMM: రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు జరగనున్నాయి.

News May 5, 2024

డీప్ ఫేక్ ఆడియోలు సమాజానికి ముప్పు: మాజీ మంత్రి పువ్వాడ

image

డీప్ ఫేక్ ఆడియోలు సమాజానికి పెను ముప్పుగా మారుతున్నాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. గత కొంతకాలంగా తనపై కూడా అసత్య ప్రచారాలు జరిగినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పువ్వాడ హెచ్చరించారు. దీనిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆయా పార్టీల నాయకుల డీప్ ఫేక్ ఆడియోలు, వీడియోలు వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే.

News May 5, 2024

జిమ్‌ను సందర్శించిన వెంకటేశ్, పొంగులేటి కూతుళ్లు

image

ఖమ్మం ఇల్లందు రోడ్డులో గల ఓ జిమ్‌లో సినీ హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత, మంత్రి పొంగులేటి కుమార్తె స్వప్ని రెడ్డి ప్రచారం నిర్వహించారు. సీపీఐ, సీపీఎం బలపరిచిన ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ క్యాంపెయిన్ చేశారు. వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. 

News May 5, 2024

ఖమ్మంలో హీరో వెంకటేశ్ పర్యటన రూట్ మ్యాప్

image

ఖమ్మంలో హీరో వెంకటేశ్ క్యాంపెయిన్ షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఎల్లుండి సాయంత్రం 5గంటలకు మయూరి సెంటర్, పాత బస్టాండ్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు కొత్తగూడెంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు.

News May 5, 2024

ఖమ్మం: మొత్తం 11 నామినేషన్లు

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మూడోరోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 11కు చేరింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ వేయగా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి రేపు నామినేషన్ వేస్తారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.