Khammam

News May 5, 2024

నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

image

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఆదివారం నగరంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో ప్రారంభమవుతుంది. ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు. ఏర్పాట్లను డీఈవో సోమశేఖరశర్మ, రెండు జిల్లాల కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు పర్యవేక్షిస్తున్నారు.

News May 5, 2024

వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం

image

ఈ వేసవిలో నానాటికీ ఎండలు పెరుగుతున్నాయి. పలువురు వడదెబ్బ బారిన పడి చికిత్స పొందుతుండగా ఇంకొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే, వడదెబ్బ మృతుల్లో పేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందుతుంది. ఇందుకోసం ప్రతీ మండలానికి త్రిసభ్య కమిటీని నియమించగా.. వీరు విచారణ జరిపి నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తారు. అక్కడ పరిశీలన అనంతరం రూ.50 వేలు పరిహారం మంజూరు చేస్తారు.

News May 5, 2024

భద్రాద్రి: ఒకే వీధి.. తండ్రిది AP.. కుమారుడిది తెలంగాణ

image

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. ఉమ్మడి APలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. విజభన తర్వాత ఆయన ఇల్లు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చింది. మరోవైపు అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది ఏపీలోని అరకు లోక్‌సభ స్థానంలో ఉండటం విశేషం.

News May 5, 2024

KMM: ఎన్నికల ప్రచారానికి 6 రోజులే గడువు

image

ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచార పర్వానికి 6 రోజులే గడువుంది. 13న పోలింగ్ జరగనుండగా 2 రోజుల ముందుగా 11న సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీల అధినేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సభలు, కార్యక్రమాలకు ఇబ్బందిగా మారాయని అభ్యర్థులు చెబుతున్నారు. అనుకున్న స్థాయిలో ప్రచార షెడ్యూల్ పూర్తి చేయలేకపోతున్నారు.

News May 5, 2024

కొత్తగూడెం: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

image

చింతూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పీవీ నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆకస్మికంగా ఛాతిలో నొప్పి ఉందంటూ ఒక్కసారిగా కుప్ప కూలడంతో తోటి సిబ్బంది వెంటనే రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు శనివారం చింతూరు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఏఎస్ఐ మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

News May 5, 2024

KMM: తటస్థ ఓటర్లకు పార్టీల గాలం..!

image

పార్లమెంటు ఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలకంగా మారారు. దీంతో వీరి ఓట్లను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు? తటస్తులు ఎంతమంది? అన్న కోణంలో ప్రధాన పార్టీలు ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. కాగా, ప్రధానంగా ఖమ్మం జిల్లాపై ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక దృష్టిసారించారు.

News May 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} ఖమ్మంలో నేడు సినీ సంగీత విభావరి
∆} ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న హోమ్ ఓటింగ్
∆} వివిధ శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} వేంసూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్
∆} పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లి మండలంలో ఎంపీ వద్దిరాజు పర్యటన

News May 5, 2024

మండుతున్న ఎండలు.. ఈత కొడుతూ.. సేద తీరుతూ..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మండుతున్న ఎండల కారణంగా ప్రతి ఒక్కరూ చల్లగా ఉండేందుకు ఈతపై ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని స్విమ్మింగ్ పూల్స్, పంట పొలాల్లోని బావుల వద్ద.. ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో అక్కడ ఈత కొడుతూ.. చిన్నారుల నుంచి పెద్దల వరకు సేద తీరుతున్నారు.

News May 5, 2024

KMM: మండే ఎండలో రాజకీయ కాక .!!

image

ఖమ్మం జిల్లాలో రాజకీయం కాకలు రేపుతోంది. మండు వేసవిలో వచ్చిన ఎన్నికలు ఎండల తీవ్రతలాగే .. రాజకీయ వేడి కూడా పెరుగుతోంది. నియోజకవర్గంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనే ఉన్నది. అధికార కాంగ్రెస్ ఇటు ప్రచారంతో పాటు.. వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

News May 5, 2024

జోరుగా హుషారుగా ఎన్నికల క్యాంపెయిన్!

image

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ప్రచారం రోజు రోజుకూ జోరందుకుంటుంది. సమావేశాలు, సభలతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. తమ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఆయా పార్టీల నేతలు జిల్లాలో వాడవాడనా తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే చేయబోయే అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు.