Khammam

News November 16, 2024

KMM: విభిన్న తరహాలో ట్రాన్స్‌జెండర్ మోసం

image

శుభకార్యాలకు వచ్చి పలువురు ట్రాన్స్‌జెండర్లు డబ్బులు తీసుకుంటారు. కానీ ఈ ట్రాన్స్‌జెండర్ వేరు. CI దామోదర్ కథనం మేరకు.. జనగామ వాసి సిరివెన్నెలకు ఇల్లందు వాసి, ట్రాన్స్‌జెండర్ నాగదేవి పరిచయమైంది. ఇటీవల ఆమెకు మీ ఇంట్లో దోషం ఉందని నాగదేవి చెప్పింది. దోష నివారణకు HYDలోని ఆమె తమ్ముడి నిఖిల్ ఇంట్లో పూజలు చేసి రూ.55లక్షలు వసూలు చేసింది. మోసపోయామని తెలుసుకున్న వారు PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News November 16, 2024

గ్రూప్ -3 నిర్వాహణకు 87 పరీక్ష కేంద్రాలు సిద్ధం

image

గ్రూప్ -3 పరీక్షల నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఈనెల 17న ఉదయం 10:00 నుండి 12:30 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. అదేవిధంగా 18న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 27,984 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. 87 కేంద్రాలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

News November 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఖమ్మంలో ఎంపీ రఘురామిరెడ్డి పర్యటన> ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పూజలు > దమ్మపేటలో బీఆర్ఎస్ నాయకుల సమావేశం > చర్లలో సీపీఎం మండల మహాసభ > ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు > ముదిగొండలో సహకార సొసైటీ వారోత్సవాలు > భద్రాచలం ఆలయంలో ప్రత్యేక పూజలు> ఖమ్మం గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం > ఖమ్మం గ్రంధాలయంలో ముగ్గుల పోటీలు > రాజేశ్వరపురంలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు

News November 15, 2024

బోనకల్: 60 ఏళ్ల వృద్ధుడిపై అత్యాచార కేసు

image

బోనకల్ మండలంలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటయ్య (60) అనే వృద్ధుడిపై అత్యాచార కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుబాబు గురువారం తెలిపారు. ఈ నెల 11న రాత్రి వివాహితను కోటయ్య మేకల షెడ్డులోకి లాక్కెళ్లి మద్యం తాగించి, అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్సై చెప్పారు. ఆమె భర్త ఒంటిపై గాయం గమనించి అడగగా, బాధితురాలు నిజాన్ని వెల్లడించిందన్నారు.

News November 15, 2024

ఖమ్మం: మూడు రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇవాళ కార్తీక పౌర్ణమి/ గురునానక్ జయంతి, 16న శనివారం వారాంతపు సెలవు, 17న ఆదివారం సాధారణ సెలవు అని ప్రకటించారు. తిరిగి సోమవారం రోజున పునః ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News November 15, 2024

ప్రతి ఒక్కరూ బాల్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

image

ప్రతి ఒక్కరూ తమ బాల్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తూ, లక్ష్యం నిర్దేశించుకొని మంచిగా చదివి ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, స్థానిక బాల సదనంలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పండిట్ జవహార్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి, పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వేడుకలో పాల్గొని పిల్లలతో సరదాగా గడిపారు.

News November 14, 2024

KMM: రేపు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం

image

రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు డయల్ యువర్ RM కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో, ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఏమయినా సూచనలు, సలహాలు లేదా ఏవైనా సమస్యలను తెలియజేయడానికి, పైన సూచించిన సమయంలో 99592 25954 నంబర్‌కు డయల్ తెలిపారు.

News November 14, 2024

పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్

image

పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ వి.పాటిల్ అన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం, బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

News November 14, 2024

రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: మంత్రి పొంగులేటి

image

రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, కానీ రైతుల ముసుగులో అధికారులపై దాడులు చేయడం సరికాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలను ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు.

News November 14, 2024

ఖమ్మంలో గ్రూప్ -III పరీక్షకు 87 కేంద్రాలు

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ -III పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కమిషన్ ఛైర్మన్ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కమిషన్ సభ్యులతో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో 27,984 మంది పరీక్ష రాస్తున్నరని వారి కోసం 87 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాల రెవెన్యూ అధికారి రాజేశ్వరి, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.