India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో స్వాతి (28)ని భర్త భానోత్ భద్రం హత్య చేసి <<14604036>>పత్తి <<>>చేనులో పాతి పెట్టిన సంగతి తెలిసిందే. నిందితుడి వివరాల ప్రకారం.. ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఈ నెల 9న స్వాతిని కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం అతని తల్లి సహాయంతో ఓ సంచిలో మూటగట్టి చేనులో పాతిపెట్టినట్లు తెలిపాడు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది.

ఈనెల 15న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఆడంబరాల కార్యక్రమాలను నిర్వహించొద్దని, జిల్లాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, కేక్ కట్టింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని తన అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తెలుగు ప్రజలు తనపై చూపించిన అభిమానంతో జిల్లా సమగ్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని తెలిపారు.

HYDలోని రాజ్ భవన్లో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి మంత్రి సమస్యలతో కూడిన ఆర్జీలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని అన్నారు. బుధవారం గాంధీ భవన్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం కుటుంబ సమేతంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదపండితుల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15న గురునాయక జయంతి, 16, 17న వారాంతపు సెలవు కారణంగా మూడు రోజులపాటు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 18 సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారస్థులు గమనించాలని కోరారు.

మాజీ సీఎం KCR పాలనలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం CBIతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి(TRS) చీఫ్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. HYD బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, కరెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ ట్రాన్సఫర్మేషన్లో KCR రూ.వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. KCR అవినీతి తెలియజేసేందుకు DEC 6 నుంచి భద్రాచలం-చిలుకూరు బాలాజీ టెంపుల్కు పాదయాత్ర చేస్తామన్నారు.

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం రాత్రి బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క సమక్షంలో వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ప్రజా పాలనతో మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వంట గ్యాస్ రూ.500కి అందించడమే కాక, అభివృద్ధి పథంలో మధిర నియోజకవర్గం నిలుస్తోందని నందిని విక్రమార్క తెలిపారు.

వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించడానికి కావాల్సిన నిధులు, పథక అమలు తీరుతెన్నులపై చర్చించారు. వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావు, డైరెక్టర్ గోపి, సహకార సంస్థల ప్రతినిధులలు పాల్గొన్నారు. ఈ యాసంగి నుంచి రైతులకు అవసరమైన పనిముట్లను, యంత్రాలను, సబ్సిడీపై సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్దం చేసామని వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ గోపి తెలిపారు.

> మధిర మండలం జీలుగుమాడులో విద్యుత్ సరఫరాకు అంతరాయం > వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రైతులతో ప్రత్యేక సమావేశం > భద్రాచలంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య పర్యటన > వైరాలో కొనసాగుతున్న పది జిల్లాల స్థాయి క్రీడా పోటీలు > మెస్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన> కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే > భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు
Sorry, no posts matched your criteria.