Khammam

News May 2, 2024

కాంగ్రెస్-బీజేపీలు కుట్ర చేసి నోటీసులు ఇప్పించాయి: ఎంపీ

image

ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర విజయవంతం కావడంతో, ఇది చూసి ఓర్వలేక కాంగ్రెస్-బీజేపీలు కుట్ర చేసి నోటీసులు ఇప్పించాయని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. గురువారం ఖమ్మం తెలంగాణ భవన్‌లో జరిగిన పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. నామ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, కాంగ్రెస్ అభ్యర్థి ఢిల్లీ, బెంగళూరు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి అని ఇంటింటికి వెళ్లి వివరించాలన్నారు.

News May 2, 2024

KMM: సహజీవనం.. మద్యం మత్తులో వ్యక్తి.. ఉరేసి చంపేసిన మహిళ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్యచేసింది. ఈ ఘటన ఇల్లందు మండలం వజ్జారిగూడెంలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీను(48)ను సునీత ఉరేసి చంపేసింది. సునీతను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 2, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా నాన్ ఏసీ మిర్చి ధర రూ. 19,050జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,100 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు నాన్ ఏసీ మిర్చి ధర రూ.1450, పత్తి ధర రూ.100 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News May 2, 2024

రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే మంచిది: నారాయణ

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే మంచిదని, అప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు జైళ్లో ఉన్నట్లు అవుతుందని సీపీఐ అగ్రనేత నారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన సీపీఐ జనరల్ బాడి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న సీఎంలు దొంగలు అయినా వారు మంచివారేనని, కానీ వ్యతిరేకిస్తే మాత్రం వారిని జైలుకి పంపిస్తారని మండిపడ్డారు.

News May 2, 2024

ఖమ్మం: డయల్-100కు 4,483 కాల్స్

image

సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల, దాన, మాన ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్ 100కు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నెలలో 4,483 కాల్స్ వచ్చినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. వాటిపై 91FIRలు నమోదు చేశామని, వీటిలో హత్యాయత్నం-1, మహిళలపై వేధింపులు-6, దొంగతనాలు-6, సాధారణ నేరాలు-30, యాక్సిడెంట్లు -19, అనుమానాస్పద మరణాలు-4, ఇతర కేసులు 25 అన్నారు. 

News May 2, 2024

దేశంలో మార్పు కాంగ్రెస్తోనే సాధ్యం: తుమ్మల

image

దేశంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుండాల, ఆళ్లపల్లిలో గురువారం నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్న భాజపాకు ప్రజలే గుణపాఠం చెప్పాలని కోరారు.

News May 2, 2024

‘కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు’

image

కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మోసం చేశాడని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ తన పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నాడని, ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతోనే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. రఘురాంరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

News May 2, 2024

పాల్వంచలో వడదెబ్బతో వృద్ధురాలు మృతి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు తోట భూ లక్ష్మి గురువారం వడదెబ్బతో మృతి చెందింది. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ అధికంగా ఉడడంతో ఎవరు దూర ప్రయాణాలు చేయవద్దని, చిన్న పిల్లలని బయట తిప్పవద్దని వైద్యులు కోరుతున్నారు.

News May 2, 2024

భద్రాచలం వద్ద గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం 

image

భద్రాచలం వద్ద గోదావరిలో తెలియని మృతదేహం గురువారం ఉదయం కొట్టుకు వచ్చింది. స్నానాలు రేపు వద్ద ఒడ్డుకు మృతదేహం కొట్టుకు రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 2, 2024

ఖమ్మం: పత్తి, మిర్చి ధరల వివరాలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలు మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. నాన్ ఏసీ మిర్చి క్వింటా ధర 19050, పత్తి క్వింటా 7100 ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు. మొన్నటికంటే పత్తి ధర 100 రూపాయల దగ్గగ , మిర్చి ధర 400 రూపాయలు పెరిగింది. మిర్చి 500 నుండి 1000 రూపాయల హెచ్చుతగ్గుల మధ్య ధరలు కొనసాగుతున్నాయి.