Khammam

News May 2, 2024

ఎండలతో భగ్గుమంటున్న భద్రాద్రి జిల్లా

image

నాలుగు రోజులుగా ఎండలు భగభగ మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి భానుడు ప్రభావం చూపిస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని చుంచుపల్లిలో రికార్డుస్థాయిలో 46.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో జిల్లాలో ఇదే అత్యధికం. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News May 2, 2024

వడదెబ్బకు మాజీ వార్డు సభ్యులు కంపాటి మృతి

image

ములకలపల్లి అంబేద్కర్ నగర్ కు చెందిన సీపీఐ నాయకులు, మాజీ వార్డు సభ్యులు కంపాటి పుల్లయ్య వడదెబ్బకు మృతిచెందారు. వాంతులతో కళ్లుతిరిగి పడిపోవడంతో కుటుంబసభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందారు. మృతదేహాన్ని సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు నరాటి ప్రసాద్, మండల కార్యదర్శి ఎండి. యూసఫ్, నాయకులు నరాటి రమేష్, అనుముల సాయి, సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.

News May 2, 2024

KCR సభకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం

image

గార్ల మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని ముల్కనూర్ వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. బాధితులను ఎంపీ మాలోతు కవిత పరామర్శించారు.

News May 2, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఎన్నికల నిర్వహణపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభo

News May 2, 2024

ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

image

కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. బుధవారం ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు అధికారుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News May 1, 2024

BREAKING.. KMM: కేసీఆర్ సభకు వెళ్లొస్తుండగా ఆటో బోళ్తా

image

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8మందికి గాయాలయ్యాయి. కాగా, మహబూబాబాద్‌లో కేసీఆర్ సభకు వెళ్లి ఇంటికెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులకు MHBD ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.

News May 1, 2024

ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకి హైకోర్టు నోటీసులు జారీ

image

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు భద్రాచలం ఎమ్మెల్యే నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.

News May 1, 2024

ఖమ్మం కాంగ్రెస్‌కు కంచుకోట: భట్టి

image

ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిదని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షింస్తూ DCC కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరెట్ శక్తులకు దోచి పెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్‌ను ప్రధాని చేయాలన్నారు.

News May 1, 2024

KMM: ఒకే రోజు.. ఒకే ఊర్లో ముగ్గురు మృతి

image

ఖమ్మం జిల్లాలో విషాదం జరిగింది. కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో ఒకే రోజు గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. నాయకన్ గూడెం గ్రామానికి చెందిన ఎల్లబోయిన నరసయ్య, ఉల్లోజు రాములు, దొంతగాని మంగమ్మలు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 1, 2024

రుణమాఫీ తప్పకుండా చేస్తాం: మంత్రి తుమ్మల

image

రైతులకు రూ. 2లక్షల రుణ మాఫీని ఆగస్టు 15 లోపు ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దమ్మపేట మండలంలోని అల్లిపల్లి గ్రామంలో అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొనగా మంత్రి మాట్లాడారు. అందరి సమష్టి కృషితో పనిచేసి ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు.