India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ సూచించారు. 27,984 అభ్యర్థుల కోసం 87 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పరీక్ష సజావుగా జరిగేందుకు, ప్రశ్నాపత్రాలు భద్రతతో కేంద్రాలకు చేరవేసి, ప్రతి 3-5 కేంద్రాలకు ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించామన్నారు. సిబ్బందికి పరీక్షల పట్ల పూర్తి అవగాహనను కల్పించారు.

రాష్ట్ర ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నేతలు కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టి కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులకు జిల్లాలో తమ తమ నియోజకవర్గాలలో సొంత నివాసాలు లేవు. భట్టి మధిర ఎమ్మెల్యేగా ఉండగా వైరాలో ఆయనకు నివాసం ఉంది. పాలేరుకు పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయనకు ఖమ్మంలో నివాసం ఉంది. ఇక ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మలకు పాలేరులో నివాసం ఉంది.

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. రామసహాయం రాధికను ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్మెంట్ ఫైనాన్స్ అడ్వైజరీ బోర్డు సలహాదారుగా ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ నియమించారు. కైకొండాయిగూడెంకు చెందిన రామసహాయం నిర్మల, బుచ్చిరెడ్డి కూతురు రాధిక. వివాహం అనంతరం ఉద్యోగరీత్యా వారు అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె చేసిన సేవాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం చిన్న వెంకటగిరిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

మహిళలు నాణ్యత, నమ్మకమే బ్రాండ్గా వ్యాపారంలో రాణించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. నలుగురు మహిళలు గ్రూప్గా క్యాంటీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకురాలను పలుకరిస్తూ వ్యాపారం సాఫిగా సాగుతుందా? సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.

ఇల్లెందు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే కనకయ్య, మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జిల్లాలోనే తొలి బయో మైనింగ్ కేంద్రం ఇల్లెందులో ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో డంపింగ్ చేసి గుట్టల గుట్టలుగా పెరిగిపోయిన చెత్తను రీసైక్లింగ్ చేసి కాలుష్యం కాకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

KTR ఎవరి కాళ్లు మొక్కేందుకు ఢిల్లీ వెళ్లారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేంద్రం పెద్దలను ఒప్పించి తన చెల్లికి బెయిల్ ఇప్పించినట్లే తనను తాను కాపాడుకునేందుకు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లారని విమర్శించారు. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణకు విదేశాల్లోని సంస్థలకు రూ.55 కోట్లను ఏ విధంగా మళ్లించారని ప్రశ్నించారు. తాను పేల్చబోయే బాంబేదో కేటీఆర్కు తెలుసని చెప్పారు.

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని గార్ల మండలంలోని పెద్ద కిష్టాపురంకి చెందిన భూక్య సంగీత సోమవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను వేడుకుంది. ముల్కనూరులో సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన MLAను కలిసి వినతి పత్రం అందజేసింది. పెద్దకిష్టాపురానికి చెందిన శ్రీకాంత్ తనను మోసం చేసినట్లు పేర్కొంది. ఈ విషయమై PSలో ఫిర్యాదు చేశానని, న్యాయం చేయాలని MLAని కోరింది.

ఖమ్మం జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 5,71,240 లక్షల ఇళ్లు ఉండగా ఆదివారం నాటికి 30,616 ఇళ్లు మాత్రమే సర్వే చేశారు. జిల్లాలో 4,118 బ్లాక్లుగా విభజించగా ప్రస్తుతం 3,150 బ్లాక్లలో సర్వే జరుగుతుంది. 75 ప్రశ్నలతో కూడిన ఫామ్ను నింపడానికి దాదాపు 30 నిమిషాలు పడుతున్నట్లు తెలుస్తొంది.

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Sorry, no posts matched your criteria.