Khammam

News November 11, 2024

60 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

image

ఖమ్మంలోని తెల్దారుపల్లిలో దాదాపు 60ఏళ్లకు సీపీఎం నాయకత్వాన్ని కోల్పోయింది. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019తర్వాత సీపీఎంపై తిరుగుబాటు ఎగురవేసిన తమ్మినేని కృష్ణయ్య ఆయన భార్యను ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత పరిణామాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కృష్ణయ్య కుమారుడు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో పార్టీ గ్రామకమిటీని ఇటీవల ఎన్నుకున్నారు.

News November 11, 2024

పాల్వంచ: సర్వేను పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఎన్యూమరేటర్లను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని బొల్లోరిగూడెం 11వ వార్డులో పర్యటించారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పర్యవేక్షించి వివరాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని ఎన్యూమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉంటే సూపర్‌వైజర్లకు తెలపాలని అన్నారు.

News November 10, 2024

గడ్డి మందు తాగి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

గడ్డి మందు తాగి ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ధనలక్ష్మి తన ఇంట్లో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 10, 2024

ఖాళీ స్థలాల యజమానులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం, చెత్త వేయడం వల్ల దోమలు, కోతులతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఖాళీ ప్లాట్ లను యజమానులు శుభ్రం చేయకుంటే వెంటనే ప్రభుత్వ స్థలంగా బోర్డులు పెట్టాలని ఆదేశించారు. కూడలి ఉన్న ప్రదేశంలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు.

News November 10, 2024

చండ్రుగొండ : హాస్టల్లో పాము కలకలం

image

చండ్రుగొండ ఎస్సీ బాలుర వసతి గృహంలో పాము ప్రత్యక్షమైంది. హాస్టల్ బాత్రూంలో నుంచి పాము బయటకు వస్తున్న క్రమంలో స్థానికులు గుర్తించారు. ఆ సమయంలో హాస్టల్లో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మిగతావారు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం. అయితే హాస్టల్ పరిసర ప్రాంతం పిచ్చి మొక్కలు చెత్తాచెదారంతో నిండి ఉంటుందని స్థానికులు చెప్పారు. శుభ్రం చేయించాలని కోరారు.

News November 10, 2024

కచ్చితమైన సమాచారంతో వివరాలు నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్

image

కులగణన సర్వే కోసం జారీ చేసిన బుక్ లెట్లోని మొత్తం అంశాలపై ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుంచి కచ్చితమైన సమాచారం సేకరణతో నమోదులు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సర్వే ప్రక్రియను సూపర్‌వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ బాధ్యులు సూపర్ చెక్ చేయాలని, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

News November 9, 2024

ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

image

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డిపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధు పార్టీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి సీఎం అయినా కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు సరికాదని జిల్లా అధ్యక్షుడు అన్నారు. సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర అధ్యక్షుడు నాగరాజు, నాయకులు బ్రహ్మయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.

News November 9, 2024

 మిర్చి తోటకు దిష్టి తగలకుండా రైతు వినూత్న ఆలోచన

image

జూలూరుపాడు తాను సాగు చేస్తున్న మిర్చి తోటకు దిష్టి తగలకూడదని ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. కాకర్ల గురువాగుతూ క్రాస్ రోడ్డు వద్ద ఓ రైతు తన మిర్చి తోటలో ఓ సినీనటి బ్యానర్ ను ఏర్పాటు చేశాడు. ఇలా బ్యానర్ ఏర్పాటు చేయడం వల్ల మిర్చి తోటకు రోడ్డుపై వెళ్లే పలువురు దిష్టి తగలకుండా మంచిగా సాగు అవుతుందని ఆ రైతు అంటున్నాడు. 

News November 9, 2024

భద్రాద్రి అభివృద్ధిని పట్టించుకునే వారే లేరా?

image

ప్రపంచంలోనే భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. దేశం నుంచే కాకుండా ఇతర దేశస్తులు భద్రాద్రికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిందని చెప్పిన పనులు ప్రారంభించలేదు. ప్రస్తుత ప్రభుత్వమైన ఆలయాన్ని అభివృద్ధి చేస్తుందో లేదో చూడాలి. దీనిపై మీ కామెంట్!

News November 9, 2024

57 వేల పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం: పొంగులేటి

image

 నిరుద్యోగ యువతకు ప్రజా ప్రభుత్వం వచ్చిన 10 నెలల వ్యవధిలో 57 వేల పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించామని చెప్పారు. డిసెంబర్ నెలలో వారికి ఉద్యోగాల నియామక ఆదేశాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని పొంగులేటి పేర్కొన్నారు.