Khammam

News May 1, 2024

ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపిలోల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఖమ్మంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పాలేరు, మధిర, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పీవో, ఏపీవో, ఓపిలో లకు చేపట్టిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణలో వీరి పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా వారి సలహాలు సూచనలు చేసారు.

News May 1, 2024

KMM: టెన్త్ ఫెయిలైన విద్యార్థులారా.. ఇది మీకోసమే.!

image

టెన్త్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఉ.9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రీకౌంటింగ్కు 15రోజుల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్సర్ షీట్ ఫొటో కాపీ కోసం సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలన్నారు.

News May 1, 2024

ఖమ్మం లోక్‌సభ బరిలో త్రిముఖ పోరు.!

image

నిన్న, మొన్నటి వరకు ఖమ్మంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ పర్యటన, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని సంకేతాలు కనిపిస్తున్నాయి. BRS అభ్యర్థి నామా, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి, BJP తాండ్ర వినోద్ రావు మధ్య రసవత్తర పోరు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

News May 1, 2024

బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రజలను మోసం చేస్తున్నాయి: మంత్రి

image

బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన రఘురాం రెడ్డిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేశామన్నారు.

News May 1, 2024

ఖమ్మం: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పోస్ట్ కార్డు రాశాం:పొంగులేటి

image

మాజీ సీఎం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తాను, ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థి రఘురాంరెడ్డి కేంద్రానికి పోస్ట్ కార్డు రాశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మాజీ సీఎంలు ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు మద్దత్తు ఇచ్చారని ఇప్పుడు కూడా ఇవ్వాలన్నారు.

News May 1, 2024

అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖమ్మం!

image

ఖమ్మం నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే.. నియోజకవర్గంలోని 10/10 అసెంబ్లీ సీట్లని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రధాన పార్టీల మధ్యన హోరాహోరీ పోటీ నడుస్తోంది. దీంతో మూడు పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిదో వేచి చూడాలి.

News May 1, 2024

పది ఫలితాల్లో ఖమ్మం జిల్లా వెనుకంజ 

image

పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెరిగినా రాష్ట్రంలో ర్యాంక్ మాత్రం పడిపోయింది. గతేడాది 88.72 శాతం ఉత్తీర్ణత సాధించగా జిల్లా రాష్ట్రస్థాయిలో 18వ స్థానంలో నిలిచింది. ఈసారి 92.24% ఉత్తీర్ణత నమోదైనప్పటికీ రాష్ట్రస్థాయిలో ర్యాంక్ మాత్రం 21వ స్థానానికి పడిపోవడం గమనార్హం. జిల్లాలో మొత్తం 16,541 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 15,258 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది.

News May 1, 2024

సున్తీ చేస్తుండగా మర్మాంగం కట్

image

సున్తీ చేస్తూ మర్మాంగాన్ని కోసిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. నగరంలోని ఎన్‌ఎస్‌టీ రోడ్డులోని ఆర్డీఓ కార్యాలయం వద్ద అబ్దుల్ హమీద్ ఆర్‌ఎంపీ వైద్యుడు అదే ప్రాంతానికి చెందిన బాలుడికి సున్తీ చేస్తూ మర్మాంగాన్ని కోశాడు. వెంటనే ఆ బాలుడిని తల్లిదండ్రులు పక్కన ఉన్న ప్రవేటు హస్పిటల్‌కి తరలించగా.. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ నిమ్స్‌కి తరలించారు.

News May 1, 2024

బీఆర్ఎస్‌ని బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం: భట్టి

image

గత ఎన్నికలో అప్రజాస్వామిక బీఆర్ఎస్ పార్టీని బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని డిప్యూటీ సీఎం మల్లు మట్టి విక్రమార్క అన్నారు. మధిరలో జరిగిన పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు మాసాల్లోనే తాము చెప్పిన గ్యారంటీలను అమలు చేసి చూపించామన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా పాలన చేశారని ఆరోపించారు.

News April 30, 2024

ఆటోను ఢీకొన్న లారీ, ఆటో డ్రైవర్ మృతి

image

ఆటోను లారీ ఢీకొట్టగా ఆటో డ్రైవర్ మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గోసు గోపయ్య(42) ఆటో డ్రైవర్ గా
పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి ఖమ్మం నుంచి వెంకటగిరి వస్తుండగా మార్గమధ్యలో లారీ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.