India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సమగ్ర కుటుంబ సర్వే నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సర్వేపై భట్టి ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇంటింటి సమగ్ర సర్వే నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని, వాటిని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు కలెక్టర్ల దృష్టికి తేవాలని పేర్కొన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వసతి గృహం భవనం నుంచి కిందకు పడి ఓ భక్తుడు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సీఆర్ఓ కార్యాలయం సమీపంలోని రామాసదనంపై అంతస్తు నుంచి చెన్నైకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలతో మరణించినట్లు స్థానికులు చెప్పారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదర్శన కోసం ఈ నెల 13 బుధవారం ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఖమ్మం నుంచి 64064, మధిర నుండి 66566, సత్తుపల్లి నుంచి 99599, భద్రాచలం నుంచి 55555 సర్వీస్ నంబర్స్ గల బస్సులు రాత్రి బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయన్నారు. సీట్ల బుకింగ్ కోసం www.tgsrtcbus.in సంప్రదించాలని కోరారు.

ఖమ్మం ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న జాలాది పార్థసారథి శుక్రవారం అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 2003 కానిస్టేబుల్ బ్యాచ్కి చెందిన పార్థసారథి సౌమ్యుడిగా పేరుపొందారు. పార్థసారథి కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు అధికారులు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈరోజు, రేపు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కోరారు.

భద్రాద్రి ఆలయంలో బ్రహ్మోత్సవాల తేదీలను శుక్రవారం ఆలయ వైదిక పెద్దలు ఖరారు చేశారు. డిసెంబర్ 31 నుంచి అధ్యయన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. జనవరి 9న తెప్పోత్సవం, 10న వైకుంఠ ద్వార దర్శనం, 12న విశ్వరూప సేవ ఉంటుందన్నారు. అధ్యయన ఉత్సవాల్లో భాగంగా దశావతారాలలో రామయ్య దర్శమిస్తారని తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం వణికిపోతున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఉదయం ఉష్ణోగ్రతలు సుమారు 15 డిగ్రీలు నమోదవుతోంది. ఈసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతవరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంతో.. చిన్నపిల్లలు వృద్ధుల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సర్వే నిర్వహణకు నిర్దేశించిన ఫార్మాట్లో ఫారాలు సిద్ధమయ్యాయా, సిబ్బందికి అవసరమైన పరికరాలు, స్టేషనరీ ఐటెమ్స్ పంపిణీ మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

కల్లూరుకు చెందిన “తోపుడు బండి సాదిక్”గా పేరొందిన సాదిక్ అలీ మృతి బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం X ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. వివిధ రకాలుగా సాదిక్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజల మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపారు. పిల్లల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు తోపుడు బండిలో పుస్తకాలు పెట్టుకుని పంపిణీ చేశారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.