India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల సంఘం లైబ్రరీ హాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి డిజిటల్ లైబ్రరీని కొత్తగూడెం బార్ అసోసియేషన్లో ప్రారంభించడం చాలా శుభపరిణామని, న్యాయవాదులు డిజిటల్ లైబ్రరీని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా తమ వృత్తి నైపుణ్యతను మెరుగుపరుచుకోవచ్చుననీ న్యాయమూర్తి తెలిపారు.

∆}KMM: కేటీఆర్ పాదయాత్రపై మంత్రి పొంగులేటి సెటైర్ ∆}బోనకల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం∆}భద్రాద్రి: సీసీఐ కేంద్రం వద్ద రైతుల ఆందోళన ∆}మధిర శివాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు∆}ఖమ్మం: పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు∆}తల్లాడ: ఐకేపీ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాగమయి∆}చుంచుపల్లి: ‘వరి ధాన్యంపై బోనస్ ప్రకటించడం ఓ వరం’

కార్తీకమాసం సందర్భంగా ఈ నెల 10 తేదిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు డిపోల నుంచి పంచరామాలు, అన్నవరానికి వెళ్లే భక్తులకు సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. సీట్లు బుకింగ్ కొరకు www.tgsrtcbus.in సంప్రదించాల్సిందిగా కోరారు.

కులగణన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి 2,3 నెలలు సమయం పట్టే అవకాశముండగా గ్రామాల్లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. పలు కారణాలతో గతంలో పోటీ నుంచి చేయనివారు వారు ఈసారి సై అంటున్నారు. సర్పంచ్ సంగతి పక్కన పెడితే వార్డు సభ్యుడిగా చేయాలన్నా కొన్ని చోట్ల పోటీ ఉంది. వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ దక్కించుకోవాలని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది.

పక్షుల గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులచే అనుసంధానం చేయబడిన “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ప్రజా భవన్ లో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్(HBP) సభ్యులచే అనుసంధానం చేయబడిన “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ను డిప్యూటీ సిఎం ఆవిష్కరించారు. పక్షుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని భట్టి పేర్కొన్నారు.

సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల దాన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100 కు పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నెలలో 4,481 కాల్స్ వచ్చాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. వీటిపై 74 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-1, దొంగతనాలు-4, సాధారణ ఘటనలు-24, యాక్సిడెంట్లు-12, అనుమానస్పద మరణాలు-10, ఇతర కేసులు- 23 అన్నారు. డయల్-100 కు అత్యవసర సమయాల్లో మాత్రమే ఫోన్ చేయాలన్నారు.

జ్వరంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన బుధవారం రఘునాథపాలెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పరికలబోడుతండాకు చెందిన సురేశ్ పెద్ద కుమార్తె కుషి(4)కి కొన్ని రోజులు నుంచి జ్వరం వస్తుండడంతో RMP వద్దనే చికిత్స చేయించారు. చిన్నారి ఆరోగ్యం విషమించడంతో చిన్నారిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా ప్లేట్ లెట్స్ పడిపోవడంతో చికిత్స పొందుతూ మరణించింది. వారం రోజుల కిందటే చిన్నారి బర్త్ డే జరిపారు.

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల వద్ద నుంచి మద్దతు ధరకే నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి కె.సురేంద్ర మోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో కలిసి సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు.

కొత్తగూడెం మున్సిపాలిటీ చిట్టిరామవరం తండాకు చెందిన అజ్మీర శివ(24) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాలిలా.. వ్యవసాయ పనుల నిమిత్తం వారి తల్లిదండ్రులు ఉదయం పొలాలకు వెళ్లిపోయారు. కాగా సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉరి వేసుకుని ఉన్నట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువకుడు కొత్తగూడెం టౌన్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడని చెప్పారు.
Sorry, no posts matched your criteria.