India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కె. సురేంద్ర మోహన్ను ప్రత్యేక అధికారిగా నియమించారు.

ఖమ్మం: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కా ప్రణాళికతో, ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సుమారు 6,33,304 కుటుంబాలున్నట్లు అంచనా ఉందన్నారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

∆} ఖమ్మం:వారికి రెండో ప్రాధాన్యతలో ఇల్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి ∆}భద్రాచలం: పవిత్ర గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు∆}ఖమ్మం: కారు- బైక్ ఢీకొని యువకుడు మృతి∆} దమ్మపేట:వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మల∆}భద్రాచలం: రూ. 3 కోట్ల గంజాయి దహనం చేసిన అధికారులు∆}కొత్తగూడెం: క్లినిక్ సీజ్ చేసిన వైద్యాధికారులు∆}గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి సీతక్క

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ బిసి కమీషన్ నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల బహిరంగ విచారణ అనివార్య పరిస్థితుల కారణంగా ప్రభుత్వం వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లాలోని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ బిసి కమీషన్ నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల బహిరంగ విచారణ అనివార్య పరిస్థితుల కారణంగా ప్రభుత్వం వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లాలోని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

పాలన, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఉదయం కాసేపు గడిపారు. పచ్చని పంట పొల్లాల్లో కలియ తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించారు. ఆయిల్ పామ్ సాగులో ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, సస్య రక్షణ పద్ధతుల గురించి కూలీలతో చర్చించారు.

మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ మొదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. గత BRS ప్రభుత్వంలో పింక్ కలర్ చొక్కా వేసుకున్న వాళ్లకే స్కీములు ఇచ్చారని అన్నారు. అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిరాజుగూడెంకు చెందిన సాయి(22) తన బైక్పై ఆదివారం రాత్రి ఖమ్మం నుంచి ఇంటికి వస్తుండగా ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సాయిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సాయి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

☆ ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో నేడు ప్రజావాణి కార్యక్రమం ☆ ఖమ్మంలో నేడు మంత్రి తుమ్మల పర్యటన ☆ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నేడు పునః ప్రారంభం ☆ తిరుమలాయపాలెం కాంగ్రెస్ నేతలతో నేడు మంత్రి పొంగులేటి సమావేశం ☆ కారేపల్లిలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ☆ భద్రాచలం ఐటిడిఏలో నేడు గిరిజన దర్బార్ కార్యక్రమం ☆ ఉమ్మడి జిల్లాలో నేడు కార్తీక మాసం మొదటి సోమవారం వేడుకలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. వరుసగా నాలుగు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.