Khammam

News April 29, 2024

కాంగ్రెస్‌ మెడలు వంచాలంటే బీఆర్‌ఎస్‌కు బలం ఇవ్వాలి: కేసీఆర్‌

image

కాంగ్రెస్‌ మెడలు వంచాలంటే బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌ ఎన్నికల్లో బలం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్‌షోలో భాగంగా ఖమ్మం కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలు ఇచ్చిందన్నారు. రైతుబంధును బుర్రలేక పెట్టినమా ? ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ, మద్దతు లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదన్నారు.

News April 29, 2024

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్

image

పాల్వంచ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని ఏ.ఆర్.ఓలు, ఆర్డీవోలు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ సిబ్బందితో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రియాంక అల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ.. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News April 29, 2024

ఖమ్మం అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట: భట్టి

image

ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యువ నేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మంలో అయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో సంపద, వనరులను జనాభా సంఖ్యకు అనుగుణంగా పంచాలనేది రాహుల్ గాంధీ లక్ష్యమన్నారు. కేసీఆర్ పదేళ్లుగా రాష్ట్రాన్ని దోచేసి సిగ్గులేకుండా ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు.

News April 29, 2024

KCR దిగజారి మాట్లాడుతున్నారు: డిప్యూటీ సీఎం

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలోనే కరెంట్ కష్టాలు మొదలయ్యయని .. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారని భట్టి ఫైర్ అయ్యారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆయన మండిపడ్డారు.

News April 29, 2024

కేసీఆర్ బస్సు యాత్ర ఏర్పాట్ల పరిశీలన

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరానికి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. కేసీఆర్ బస్సు యాత్ర ఖమ్మం కాల్వఒడ్డు నుంచి జెడ్పీ సెంటర్ వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

News April 29, 2024

నడ్డా హెలికాప్టర్, కాన్వాయ్ తనిఖీ

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు హాజరావడానికి వెళ్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా హెలికాప్టర్, కాన్వాయ్‌ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు.

News April 29, 2024

ఖమ్మం జిల్లాలో బరిలో ఉండేది ఎవరు!

image

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో నేడు తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు సమయం ముగియడంతో.. ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారు అనే విషయం వెల్లడి కానుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఖమ్మం జిల్లా పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.

News April 29, 2024

KMM: సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త!

image

రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే 1, 2 రోజులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి, ఇతర గ్రామానికి వెళ్తేనే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక PSలో సమాచారం ఇవ్వడంతో పాటు, జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా పోలీసులు సూచిస్తున్నారు.

News April 29, 2024

KMM: ఎంపీ అభ్యర్థుల ప్రచారం.. ఓ ‘అగ్గి’ పరీక్షే

image

లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు సతమతమవుతున్నాయి . వారికి ఎండ ఓ సవాలుగా మారింది. రెండు వారాలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది. ఎండ తీవ్రతతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

News April 29, 2024

ఖమ్మం: కాంగ్రెస్ నేత నామినేషన్ ఉపసంహరణ

image

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆ పార్టీ నేత పోట్ల నాగేశ్వరరావు  ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నుంచి రామ సహాయం రఘురామ్ రెడ్డి పోటీలో ఉండడంతో నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.