India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

ప్రభుత్వాల తలరాత మార్చే శక్తి ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని కోరారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులదే కీలకపాత్ర అని పేర్కొన్నారు.

నేలకొండపల్లి మండలం చెన్నారం పాండవ చెలక కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని పగడాల నాగయ్య (70) అనే వృద్ధుడు మృతి చెందాడు. తన కుమారుడి ఇంటికి సమీపంలో చిన్న రేకుల గదిలో వృద్ధుడు ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా.? మరేదైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.

మణుగూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హై స్కూల్లో కరెంట్ షాక్తో ఇద్దరు వాచ్మెన్లు మృతి చెందారు. ఈరోజు ఉ.5.30కు పాఠశాల ఆవరణలో ఉన్న విద్యుత్ మెయిన్ తీగలకు పాఠశాలలో ఉన్న ఇనుప స్తంభం తీస్తుంగా.. విద్యుత్ తీగలకు తగలడంతో మణుగూరుకు చెందిన ఉపేందర్, రత్నం వాచ్మెన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి మృతితో దుఃఖసాగరంలో మునిగారు.

రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 4 వరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిందే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలిచ్చారు. శనివారం ఆయన సచివాలయంలో పత్తి కొనుగోళ్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సౌకర్యంగా పంటను విక్రయించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఖమ్మం: నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి ఉత్తమ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ కూసుమంచి తహశీల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా డా. కళావతి భాయి శనివారం DMHO కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా తన వంతు కృషి చేస్తానని డీఎంహెచ్వో అన్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని చెప్పారు. నూతన డీఎంహెచ్వోకు డిప్యూటీ డిఎంహెచ్ఓ సైదులు పలువురు వైద్యాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

మణుగూరు పగిడేరు ఎస్టీ కాలనీకి చెందిన కుంజా భీమయ్యను (59) తన కొడుకు కుంజా రాములు శుక్రవారం రాత్రి కర్రతో కొట్టి హత్య చేశాడు. పోలీసులు వివరాలిలా.. మద్యం మత్తులో ఉన్న రాములు కర్రతో భీమయ్య తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భీమయ్యను ఆస్పత్రిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాక లో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లి లో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ట్రంక్ కు సంబంధించి అంశంపై చర్చించారు. వచ్చే పంట కాలం లోపల నీరు వచ్చే విధంగా పనులు ప్రారంభించి సత్తుపల్లికి నీరు ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. కావాల్సిన భూ సేకరణ, ఇతర పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.