Khammam

News April 29, 2024

KMM: మహిళ మెడలో గొలుసు చోరీ

image

చేతిలో లగేజీతో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన స్థానిక కవిరాజనగర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక 13వ వీధిలో ఓమహిళ రెండు చేతుల్లో బ్యాగులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని గొలుసు లాక్కుని పారిపోయాడు. ఘటనలో 3 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

News April 29, 2024

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ హీట్

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ఎక్కుతుంది. ఒకే రోజు ఇద్దరు వివిధ పార్టీలకు చెందిన ఆగ్రనేతలు పర్యటనలతో జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మంలో రోడ్ షోకు KCR, కొత్తగూడెంలో BJP సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అటు కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి రఘురాం రెడ్డి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో దూసుకుపోతున్నారు. దీంతో జిల్లాలో పొలిటికల్ హీట్ తారస్థాయి చేరింది.

News April 29, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20,000 జెండా పాట పలకగా, క్వింటా నాన్ ఏసీ మిర్చి ధర రూ. 18,500 జెండా పాట పలికింది. అలాగే, క్వింటాల్ పత్తి ధర రూ.7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు మిర్చి ధర రూ.200 పెరగగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు.

News April 29, 2024

ఖమ్మం: నేటి నుంచి పలు రైళ్లు రద్దు

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడో రైల్వే లైన్ పనుల నేపథ్యంలో నేటి నుంచి పలు రైళ్ల రాకపోకలను రైల్వే ఉన్న తాధికారులను రద్దు చేసినట్లు ఖమ్మం ఇన్చార్జి చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. డివిజన్ పరిధిలోని చింతకాని, బోనకల్లు, పందిళ్లపల్లి, మధిరలో పాటు పలు రైల్వేస్టేషన్లలో మూడో రైల్వే లైన్ పనలు జరుగుతున్నాయని.. దీంతో పలు ఎక్స్ ప్రెస్ పలు ప్యాసింజర్ రైళ్లు నడపడం లేదని పేర్కొన్నారు.

News April 29, 2024

బీఆర్‌ఎస్‌కు సవాల్‌గా ఖమ్మం

image

ఖమ్మం లోక్‌సభ ఎన్నిక బీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2.65 లక్షల ఓట్లను కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. ఈ వ్యత్యాసాన్ని విశ్లేషిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నెలకొంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తగ్గడం.. అధికారంలో లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఎదురీత తప్పదా అన్న చర్చ కొనసాగుతోంది.

News April 29, 2024

1300-1400 ఎకరాల్లో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు..?

image

డోర్నకల్‌- గద్వాల రైలు మార్గాన్ని సర్వే సంస్థ గగనతల పద్ధతుల్లో గుర్తించింది. సూర్యాపేట- ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎస్‌సీపీ-104 నుంచి ప్రారంభించి డోర్నకల్‌ సమీపంలోని దుబ్బబంజర ప్రాంతంలో 118 వరకు మార్కింగ్‌ చేపట్టింది. కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణం మండలాల్లో సుమారు 1,300 నుంచి 1,400 ఎకరాల భూములు సేకరించనున్నట్లు సమాచారం.

News April 29, 2024

నేడు ఖమ్మంకు కేసీఆర్

image

ఈరోజు సాయంత్రం ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్‌ నుంచి జడ్పీ సెంటర్‌ వరకు కేసీఆర్ రోడ్‌షో చేపట్టనున్నారు. జడ్పీ సెంటర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఖమ్మంలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ నివాసంలో రాత్రి బస చేస్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి ఖమ్మం వస్తున్న కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు బీఆర్‌ఎప్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

News April 29, 2024

ఖమ్మంలో పాగా వేసేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నం

image

ఖమ్మం సిట్టింగ్‌ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును మరోసారి బరిలో దించింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్‌, తాతా మధు, రేగా కాంతారావు, తదితరులు ప్రచార బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. గతంలోనూ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటకపోయినా ఎంపీ ఎన్నికల్లో గెలిచామని ఈసారీ అలాగే జరగబోతుందని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

News April 28, 2024

నన్ను గెలిపిస్తే ప్రజాసేవకుడిగా నిలిచిపోతా : రఘురాంరెడ్డి

image

ఆయోధ్యలో రామాలయం కట్టి బీజేపీ పార్టీ ఓట్లు అడుగుతోందని, తాము సైతం మరిపెడలో అతిపెద్ద రామాలయాన్ని నిర్మించామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తనను దొర అని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు, మరిపెడ, చేగొమ్మలో తన ఆస్తులను ప్రజల అవసరాల కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా నిలిచిపోతానని చెప్పారు.

News April 28, 2024

బీజేపీ, బీఆర్ఎస్‌ని సమాధి చేయాలి: ఎమ్యెల్యే కూనంనేని

image

లోక్ సభ ఎన్నికల్లో దేశాన్ని దోచుకున్న బీజేపీని, రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీలను సమాధి చేయాలని కొత్తగూడెం ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించిన సీపీఐ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ బీజేపీ తన సమాధిని తానే తవ్వుకుంటుందన్నారు.