India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర సచివాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్, మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాట్సాప్ (8897281111) ద్వారా రైతులు సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, కార్యదర్శులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవకతవకలు జరిగితే సహించేది లేదని తుమ్మల హెచ్చరించారు.

మధిరలో గురువారం రాత్రి ట్రాన్స్జెండర్స్ లారీ డ్రైవర్పై దాడి చేసిన విషయం తెలిసిందే. మధిర ఎస్ఐ సంధ్య ఈరోజు ఉదయం వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటానని ఎస్ఐ సంధ్య హెచ్చరించారు.

కార్తీకమాసం సందర్భంగా ఖమ్మం నుంచి పంచరామాలు, అన్నవరంకి వచ్చే నెల 3, 10,17,24 తేదిలలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఖమ్మం DM దినేష్ కుమార్ తెలిపారు. పంచరామాల కు సర్వీస్ నెం:64095 సూపర్ లగ్జరీ కు రూ.1900, సర్వీస్ నెం:64096 డీలక్స్ కు రూ.1680, అన్నవరం కు సర్వీస్ నెం:64058 డీలక్స్ కు రూ.720 చార్జ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సీట్లు బుకింగ్ కొరకు www.tgsrtcbus.in సంప్రదించాలని కోరారు.

భద్రాచలంలో గోదావరి ఘాట్ వద్ద పండగ పూట విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరానికి చెందిన చలపతి(25) తన ఇద్దరు స్నేహితులతో కలిసి గురువారం భద్రాచలం గోదావరి నది వద్ద స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతయ్యాడు. గల్లంతైన చలపతితో పాటు ఇద్దరు స్నేహితులు గోదావరిలో కొట్టుకొని పోతుండగా ఫోటోగ్రాఫర్లు ఇద్దరిని రక్షించారు.

హైదరాబాద్లో దారుణం జరిగింది. పోలీసుల వివరాలు.. ఖమ్మం నుంచి ఓ మహిళ భర్త, కుమార్తెతో పాటు నగరానికి వచ్చింది. ఈమెకు అస్లాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అంతే కాకుండా కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నేటి నుంచి ఆదివారం వరకు 4 రోజుల పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ వర్గాలు తెలిపాయి. ఈనెల 31న దీపావళి, వచ్చేనెల 1న అమావాస్య, 2వ తేదీన శనివారం వారాంతపు సెలవు, 3న ఆదివారం సాధారణ సెలవుగా ప్రకటించినట్లు వెల్లడించారు. తిరిగి సోమవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు మొదలవుతాయనే విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు.

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యాటన ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పలు శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పది ఏళ్ల విధ్వంసపు పాలనలో చీకట్లు తొలగిపోయాయని.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలనలో తెలంగాణ సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్న పెద్దలందరూ పండుగ జరుపుకోవాలని.. ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం వరి ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీపై మిల్లర్లతో, బ్యాంక్ అధికారులతో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజతో కలిసి సమావేశం నిర్వహించారు. మిల్లులకు సరఫరా చేసే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ ఉండాలని చెప్పారు.

మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చెప్పారు. చర్ల ఎల్ఓఎస్ కమాండర్గా పనిచేస్తున్న సోది పోజి, ఎల్జీఎస్ కమాండర్గా పనిచేస్తున్న మడివి సోమిడి ఈరోజు భద్రాద్రి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని రోహిత్ రాజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.