Khammam

News April 26, 2024

30న కొత్తగూడెంలో కేసీఆర్ రోడ్ షో

image

ఈనెల 30వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ఉందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 30న సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు పరిధిలోని పార్టీ శ్రేణులు పాల్గొనాలని సూచించారు.

News April 26, 2024

BREAKING.. ఖమ్మం: లారీ ఢీకొని మహిళ మృతి

image

లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద మహిళ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు కోదాడకు చెందిన బానోతు భూది(55) అని స్థానికులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 26, 2024

KMM: నామినేషన్ విత్ డ్రా చేసుకున్న రాయల

image

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశానుసారం తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నానని రాయల నాగేశ్వరరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

News April 26, 2024

ఖమ్మం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని(19) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.

News April 26, 2024

ఖమ్మం: యువకుడి దారుణ హత్య

image

ఓ యువకుడిని ఇద్దరు యువకులు <<13119836>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం.. ముదిగొండ మండలం గంధసిరికి చెందిన షరీఫ్ వివహేతర సంబంధం విషయంలో అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, వంశీతో కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం షరీఫ్ రాత్రి ఓ కూల్‌డ్రింక్ షాప్ వద్ద ఉండగా పథకం ప్రకారం ఇద్దరూ గొడవపెట్టుకుని కాళ్లతో, చేతులతో కొడుతూ దాడి చేశారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదైంది.

News April 26, 2024

KMMకు 45 మంది, మహబూబాబాద్‌కు 30

image

ఎంపీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఖమ్మం లోక్‌సభ స్థానానికి 45 మంది 72 సెట్లు, మహబూబాబాద్‌ స్థానానికి 30 మంది 56 సెట్ల నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ప్రధాన పార్టీల నుంచి KMMలో రఘురాంరెడ్డి(కాంగ్రెస్‌), నామా నాగేశ్వరరావు(BRS), తాండ్ర వినోద్‌రావు(BJP), MHBDకు బలరాంనాయక్‌(కాంగ్రెస్‌), కవిత(BRS), సీతారాంనాయక్‌(BJP) నామపత్రాలు సమర్పించారు.

News April 26, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} దమ్మపేటలో కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరు పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 26, 2024

గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

image

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ గురువారం రిలీజ్ అయింది. మే 2న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ, 10న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 13 గడువు కాగా పోలింగ్ మే 27న జరగనుంది. ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

News April 25, 2024

‘బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం నష్టానికి గురైంది’

image

పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆ నాయకుల అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. రాబోయే 30 ఏళ్లకు రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

News April 25, 2024

KMM: ఏజెన్సీ ప్రాంతంలో 88 మంది అరెస్ట్

image

ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో కొన్ని రోజులుగా సారా బట్టీలు, దుకాణాలపై దాడి చేసి 115 కేసుల్లో 88 మందిని అరెస్ట్ చేశామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఇంద్రజిత్ గురువారం వెల్లడించారు. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, Y.రామవరం, దేవీపట్నం, మారేడుమిల్లి మం.ల్లో ఈ దాడులు చేశామన్నారు. సారా బట్టీలు, సారా అమ్మకాలపై తగు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.