Khammam

News April 25, 2024

‘పోలీసులు విధినిర్వహణలో బాధ్యతగా ఉండాలి’

image

పోలీసులు విధినిర్వహణలో చట్టాలపై అవగాహన, బాధ్యతాయుతమైన విధులు చాలా కీలకమని ఎస్పీ సునీల్ దత్ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్లకు పలు అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. చట్టాలను అమలు చేయడం, శాంతి సామరస్యాన్ని కాపాడటం, నేర కార్యకలాపాలు కట్టడి చేయడం వంటి కీలకమైన భాధ్యతలు నిర్వహించాల్సిన ట్రైన్ కానిస్టేబుళ్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

News April 25, 2024

ఖమ్మంలో కాంగ్రెస్‌తో కమ్యూనిస్టుల దోస్తాన్

image

ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు ముందడుగు వేశాయి. గురువారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామ్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేపట్టిన భారీ ర్యాలీలో ఆయా పార్టీల శ్రేణులు భాగస్వాములయ్యాయి.

News April 25, 2024

ఎన్నికలపై ఎస్పీ సమీక్ష

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకూడదని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి భాదితులకు న్యాయం చేకూర్చాలన్నారు.

News April 25, 2024

ఖమ్మంలో రెండు కోట్ల రూపాయలకు ఐపీ

image

ఖమ్మంలోని పాక బండ బజార్‌కు చెందిన రవీంద్రనాథ్ సింగ్ మొత్తం 32 మందిని ప్రతివాదులుగా పేర్కొంటూ రెండు కోట్ల రూపాయలకు స్థానిక కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. దివాలాదారుడు రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో పెట్టుబడుల కోసం స్నేహితులు, బంధువుల వద్ద రూ.2,18, 10, 000 అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశాడు.

News April 25, 2024

‘ఎన్నికల ఉల్లంఘన పై ఫిర్యాదు చేయోచ్చు’

image

లోక్ సభ సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లైతే తనకు తెలియజేయాలని సాధారణ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డా.సంజయ్ గేండ్రాజ్ తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనలు, ఫిర్యాదులు ఉంటే స్వయంగా స్వీకరించడానికి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఆఫీసర్స్ గెస్ట్ హౌజ్‌లో (NSP) అందుబాటులో ఉంటానని ప్రకటించారు. ఫోన్ నంబర్ 93462 93006 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

News April 25, 2024

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి నామినేషన్

image

ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా రామ సహాయం రఘురామ్ రెడ్డి నామినేషన్ వేశారు. అంతకుముందు కాల్వ ఒడ్డు నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్‌కు నామినేషన్ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఎంపీ రేణుక చౌదరి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.

News April 25, 2024

ముదిగొండ మండలంలో యువకుడి దారుణ హత్య

image

ఓ యువకుడిని ఇద్దరు యువకులు దాడి చేసి హత్య చేసిన ఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో షరీఫ్ అనే యువకుడి పై ఇద్దరు యువకులు మూకుమ్మడిగా దాడి చేయడంతో వారి దెబ్బలను తట్టుకోలేక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. యువకుడి హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News April 25, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.18,600 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.200 తగ్గగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు. ప్రతిఒక్కరు మార్కెట్ నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News April 25, 2024

KMM: BRSఅభ్యర్థి నామా ఆస్తులు రూ.155 కోట్లు

image

ఖమ్మం BRS అభ్యర్థి నామానాగేశ్వరరావు కుటుంబానికి రూ.155.90కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తం ఆస్తిలో నామా పేరిట రూ.71.68 కోట్లు, భార్యచిన్నమ్మ పేరిట రూ.78.25కోట్లు, కుటుంబానికి రూ.5.96కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఇందులో నామా పేరిట 45.42 ఎకరాలు ఆయన సతీమణి పేరు మీద 25.04 ఎకరాలు కుటుంబ ఆస్తిలో 27.35 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. నామా పై 2 కేసులు ఉన్నాయి.

News April 25, 2024

ఖమ్మం: గురుకుల కళాశాలలో ప్రవేశానికి 28న పరీక్ష

image

బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో, ఉమ్మడి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 28న పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి టి అంజలి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి జిల్లాలో 15 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. www.mjptbcwreis.gov.in వెబ్సైట్ ద్వారా విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.