India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జూలూరుపాడు: పడమట నర్సాపురం వాసి కల్పన- శ్రీనివాస్ భార్యాభర్తలు. వారిద్దరూ హైదరాబాదులోని ఎల్బీనగర్ ఉంటున్నారు. గత నెల 22న అనుమానాస్పద స్థితిలో కల్పన మృతి చెందింది. కల్పన మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా తాజాగా వచ్చిన రిపోర్టులో నివ్వెర పోయే నిజాలు బయటపడ్డాయి. కల్పనను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని కల్పనా కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా హత్య అనే తెలిందన్నారు.

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. వారం నుంచి వాతావరణంలో స్వల్ప మార్పులు వచ్చి రాత్రిళ్లు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో రోజురోజుకి క్రమంగా చలి పెరుగుతుంది. మరోవైపు పగలు ఎండ దంచికొడుతున్నా.. సాయంత్రం అయ్యే సరికి వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఒక్కోసారి అప్పటికప్పుడే జోరు వానలు కురుస్తున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్లో స్కిన్లెస్ KG రూ.200కే విక్రయించారు. గత 3 వారాలుగా మాంసం ధరలు పెరుగుతూ వచ్చాయి. బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ KG రూ. 243, విత్ స్కిన్ KG రూ. 213గా ధర నిర్ణయించారు. రిటైల్లో రూ. 147, ఫాంరేటు ధర రూ. 125 ఉంది. కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ. 15 వరకు తగ్గించి అమ్మకాలు చేస్తుంటారు.

∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో ఫార్మా కౌన్సిలింగ్ ∆} ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన

చింతూరు మండలం చట్టి గ్రామ ప్రధాన రహదారిపై మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్థులు చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో ప్రధానంగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య వస్తుందన్నారు. ఈ ప్రాంతం నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతుందని ఆరోపించారు. వైన్ షాపు పెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం కనిపిస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరికీ ఒకే అజెండా ఉందని, అందుకే ఈ ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వారి ఆస్తులు పరిరక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున రభస చేస్తున్నారని, రాబందుల్లా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యానించారు.

తల్లాడ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న అంబులెన్స్ను వేగంగా వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

భద్రాద్రి ఖమ్మం జిల్లాలో ఈనెల 25న రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ పర్యటించనున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి పర్యటన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉదయం భద్రాద్రి స్వామివారిని దర్శించుంటారు. అనంతరం పాల్వంచ జిల్లా కలెక్టరేట్ నందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తదనంతరం ఖమ్మం జిల్లా కలెక్టరేట్కు చేరుకొని అక్కడ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.