Khammam

News October 22, 2024

ఖమ్మం: ట్రాక్టర్‌ ఇంజిన్‌లో ఇరుక్కుని ఇద్దరి మృతి

image

కొనిజర్ల (M) తనికెళ్ల సమీపంలోని బోడియాతండా కట్టేబోడు బ్రిడ్జి వద్ద సోమవారం <<14419094>>ఇద్దరు <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా శాంతినగర్‌కు చెందిన సైదులు(50) బీమ్‌దేవ్(45) రఘునాథపాలెం నుంచి ఇనుప రాడ్‌ల కోసం ట్రాక్టర్‌పై వెళ్లారు. ఈక్రమంలో బోడియాతండా ప్రధాన సాగర్ కాలువపై ట్రాక్టర్‌ అదుపుతప్పి కాలువలోకి బోల్తా పడింది. ఈఘటనలో వారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయి మృతి చెందారు.

News October 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి జిల్లాలో పర్యటన > ఖమ్మం కలెక్టరేట్లో దిశా కమిటీ సమావేశం> కొత్తగూడెంలో రెండో రోజుకు ఐద్వా రాష్ట్ర మహాసభలు > జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన> భద్రాద్రి కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం > ఖమ్మంలో సిపిఎం పార్టీ త్రీ టౌన్ కమిటీ సమావేశం > ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ఫార్మా డీ, బీ కోర్సులో ప్రవేశానికి కౌన్సెలింగ్

News October 22, 2024

KMM: ఎగువన వర్షాలు.. పాలేరు జలాశయానికి చేరుతున్న వరద

image

ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పాలేరు జలాశయంలో నీరు స్వల్పంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాలేరు ఏటి ద్వారా జలాశయానికి స్వల్పంగా వరద నీరు చేరుతోంది. దీంతో సోమవారం ఉదయం 19 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం సోమవారం రాత్రికి 19.7 అడుగులకు చేరిందని అధికారులు చెప్పారు.

News October 22, 2024

ఖచ్చితమైన నివేదికతో సమావేశానికి హాజరు కావాలి: కలెక్టర్

image

ఖమ్మం: రేపటి దిశ కమిటీ సమావేశానికి అధికారులు ఖచ్చితమైన నివేదికలతో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. రేపటి దిశ కమిటీ సమావేశం సన్నద్ధం పై కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి సోమవారం సమీక్షించారు. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు, ఖర్చు పెట్టిన నిధులు, చెల్లింపులకు సంబంధించి నమోదుచేసిన మొత్తం, మిగులు నిధుల వివరాలు చూపాలని పేర్కొన్నారు.

News October 21, 2024

ట్రాక్టర్ బోల్తా..  ఇద్దరు వ్యక్తులు మృతి

image

కొనిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని బొడియ తండా కట్టేబోడు బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి ఎన్ఎస్పి కాలువలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌పై  ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది.

News October 21, 2024

కిష్టాపురం గ్రామపంచాయతీ ఓటర్ జాబితా

image

సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామపంచాయతీ తాజా ఓటర్ జాబితాను అధికారులు విడుదల చేశారు. గ్రామపంచాయతీలో మొత్తం 10వార్డుల్లో 1594మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో పురుషులు 798మంది, మహిళలు 796మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. కాగా గ్రామపంచాయతీలో మహిళా ఓటర్లు కంటే పురుషులు ఇద్దరు మాత్రమే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు.

News October 21, 2024

పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి

image

కొత్తగూడెంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు సోమవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలిని అర్పించారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసు అమరవీరుల లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

News October 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} దమ్మపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} అన్నపు రెడ్డి పల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి

News October 21, 2024

ఖమ్మం: నేటి నుంచి కౌన్సెలింగ్

image

SR&BGNR కాలేజీలో టీజీ ఎప్‌సెట్ 2024 కౌన్సెలింగ్ జరగనుందని ప్రిన్సిపల్ డా.మహ్మద్ జాకీరుల్లా తెలిపారు. బీఫార్మసీ, ఫార్మా డీ కోర్సులలో అడ్మిషన్స్ పొందే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఇవాళ్టి నుంచి 23 వరకు కాలేజీ ఆడిటోరియంలో ‌జరుగుతుందన్నారు. విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో సకాలంలో హాజరు కావాలని సూచించారు.

News October 21, 2024

22న దిశ కమిటీ సమావేశం : కలెక్టర్

image

ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిశ కమిటీ చైర్మన్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.