Khammam

News October 20, 2024

సీతంపేటలో యువకుడి అనుమానాస్పద మృతి

image

గార్ల మండలంలోని సీతంపేటకు చెందిన గుమ్మడి మహేష్ రాత్రి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు గార్ల మండల ఎంపీడీవో ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  

News October 20, 2024

ఖమ్మం: సర్పంచ్, ఉప సర్పంచ్ అవ్వాల్సిందే!

image

కుల గణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. 2, 3 నెలల్లో పంచాయతీ పోరు జరగనుండగా పల్లెల్లో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. గతంలో ఓడినవారు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, గతంలో గెలిచిన వారు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మరోసారి.. ఏదైతేనేం ఎలాగైనా సర్పంచ్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలని కొందరు పావులు కదుపుతున్నారు.

News October 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> వైరాలో మున్సిపల్ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమీక్ష సమావేశం > ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల పర్యటన > వైరాలో ఉచిత వైద్య శిబిరం > సత్తుపల్లిలో సీపీఎం పార్టీ మండల కమిటీ సమావేశం > కొత్తగూడెంలో ఐద్వా జిల్లా కమిటీ సమావేశం ఇల్లెందులో విద్యుత్ సరఫరాకు అంతరాయం > దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి> మణుగూరులో ఎమ్మెల్యే పర్యటన

News October 20, 2024

ఖమ్మం: చిన్నారికి ఆపరేషన్ చేయించిన సోనూసూద్ 

image

సినీ నటుడు సోనూసూద్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. కల్లూరు మండలం చెన్నూరుకి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతుల 3 సంవత్సరాల చిన్నారికి గుండె సమస్యతో బాధపడుతోంది. రూ.6 లక్షల పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో తిరువూరు జ్ఞాన వేదిక వారు సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లారు. ముంబైలో శనివారం ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా నిలకడ ఉందని వైద్యులు చెప్పారు. 

News October 20, 2024

కనపడితే సమాచారం ఇవ్వండి: ఖమ్మం పోలీసులు 

image

ఖమ్మంలో చోరీలకు పాల్పడుతున్నాడంటూ ఓ వ్యక్తి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. అతని వివరాలు తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వన్ టౌన్ సీఐ 87126 59106, ఖమ్మం టౌన్ ఏసీపీ 87126 59105 నంబర్లకు కాల్ లేదా మెసేజ్ చేసి వివరాలు తెలియజేయాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 

News October 19, 2024

ఖమ్మం: పిడుగుపాటుకు తల్లీకూతుళ్లకు గాయాలు

image

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు తండాలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చెట్టుపై పిడుగు పడడంతో అక్కడే పొలంలో పనిచేస్తున్న తల్లీకూతుర్లకు గాయాలయ్యాయి. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గ్రామస్థులు వెంటనే వారిని 108 ద్వారా హాస్పిటల్‌కి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News October 19, 2024

20 లక్షల ఇళ్లు నిర్మించడమే లక్ష్యం: మంత్రి పొంగులేటి 

image

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 గృహాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పేదలకు అందజేస్తామని తెలిపారు.

News October 19, 2024

భద్రాద్రి రామయ్యకు సువర్ణ తులసి అర్చన

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం స్వామివారికి సువర్ణ తులసి అర్చన నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News October 19, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం > కొత్తగూడెంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన > సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన > ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు > ముదిగొండలో విద్యుత్ సరఫరా లో అంతరాయం > ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు > వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన > పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన

News October 19, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు అనంతరం సోమవారం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు కోరారు.