India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో రోజువారీ కూలీలు, పెయింటింగ్ పనులు చేసేవారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో పెయింటర్ చిర్ర సురేశ్ మాట్లాడుతూ.. 2 నెలల నుంచి నిత్యావసర సరకుల ధరలు మండిపోతున్నాయని, వంట నూనె, వెల్లుల్లి, టమాట ఇలా అన్నింటి రేట్లు పెరిగిపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని స్థితి తమదని, రేట్లు తగ్గించాలని కోరారు.

ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించి, చికిత్సపొందుతూ మృతిచెందిన ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం వెంకటాపురం పరిధి పాలగుంపు గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మొక్కటి కోస(31) ఈనెల 9న కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఖమ్మంలో ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం& భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

జూలూరుపాడు, ఏన్కూరు మండలాల సరిహద్దులో పెద్ద పులి సంచరిస్తుందన్నవిషయాన్ని రైతుల ద్వారా తెలుసుకున్న జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. పాదముద్రలను గుర్తించి, 90 శాతం పెద్ద పులి అడుగులను పోలి ఉన్నాయని తేల్చి చెప్పారు. రైతులు ఒంటరిగా తిరగడం శ్రేయస్కరం కాదని అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా 4 రోజుల క్రితం ఓ శునకాన్ని పులి చంపేసిందని రైతులు తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఉన్న అశ్వాపురం, బయ్యారం క్రాస్ రోడ్, సుజాతనగర్, జూలూరుపాడు, నేలకొండపల్లి, కొణిజర్ల, దమ్మపేటలో TGSRTC లాజిస్టిక్ కేంద్రాలను నడుపుటకు ఏజెంట్లను ఆహ్వానిస్తున్నట్లు కార్గో ATM పవన్ కుమార్ తెలిపారు. ఏదైనా వ్యాపారం నిర్వహిస్తూ కంప్యూటర్ ప్రింటర్, వెయింగ్ మెషీన్ ఉన్నవారు అర్హులు అని తెలిపారు. మరిన్ని వివరాలకు 9154298582 సంప్రదించాలన్నారు.

గిరిజన ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకులకు బ్యూటీషియన్, టైలరింగ్, తేనెటీగల పెంపకం కోర్సులపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీవో పీవో రాహుల్ తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగ గిరిజన యువత విద్యార్హత పత్రాలు, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్, రేషన్ కార్డ్/ఉపాధిహామీ బుక్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్తో ఈనెల 18 లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలన్నారు.

భద్రాద్రి పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా కింది స్థాయి ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. 5 నెలల కిందట అశ్వారావుపేట SI ఉన్నతాధికారుల వేధిస్తున్నారని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా <<14348076>>బూర్గంపాడు కానిస్టేబుల్ <<>>కూడా ఇదే కారణంతో సూసైడ్ చేసుకున్నారు. కింది స్థాయి ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులకు అడ్డుకట్ట పడేది ఎప్పుడో అని పలువురు చర్చించుకుంటున్నారు.

మద్యానికి బానిసైనా కొడుకు తండ్రిని హతమార్చిన ఘటన దమ్మపేట మండలం వడ్లగూడెంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. కృష్ణయ్య(70), భార్య మంగమ్మ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కొడుడు సత్యనారాయణ మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మద్యం కోసం కృష్ణయ్య వద్ద డబ్బులు అడగటంతో గొడవ మొదలైంది. కోపోద్రిక్తుడైన కొడుకు తన తండ్రి మెడను కత్తితో కోశాడు. కృష్ణయ్యను ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} పాల్వంచ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ, రేపు రెండు రోజులపాటు ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 14న రఘునాధపాలెం మండలం రజబ్ ఆలీ నగర్, ఎన్వి బంజార, పంగిడి గ్రామాలలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 15న ఖమ్మం నగరంతో పాటు మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయి గూడెంలో పర్యటించనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.