Khammam

News April 21, 2024

వర్షాల నేపథ్యంలో రైతుల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల

image

అకాల వర్షాలు, పంట నష్టాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆరా తీశారు. రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టంపై మంత్రి తుమ్మల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. రానున్న 3, 4 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని.. పంట కొనుగోలు కేంద్రాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని తుమ్మల ఆదేశించారు.

News April 21, 2024

ఖమ్మం: రూ.48,63,300 విలువైన సొత్తు స్వాధీనం

image

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి శనివారం వరకు 517మందిపై 471 కేసులు నమోదు చేసి.. రూ.48,63,300 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వ్యయ పరిశీలన సెల్‌ నోడల్‌ అధికారి మురళీధర్‌రావు తెలిపారు. 40 కేసుల్లో బాధ్యులు ఆధారాలను సమర్పించడంతో తిరిగి ఇచ్చామన్నారు. ఇవి కాకుండా రూ.3.50లక్షల విలువైన పీడీఎస్‌ బియ్యం స్వాధీనం చేసుకుని 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

News April 21, 2024

29 వరకు బీఈడీ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) రెండో సంవత్సరం, రెండో సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్ష ఫీజు తేదీని కేయూ అధికారులు ప్రకటించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 29లోపు చెల్లించవచ్చని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహా చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రాధిక తెలిపారు. ఆలస్య రుసుంతో మే 5 వరకు చెల్లించవచ్చన్నారు.

News April 20, 2024

KMM: ఇక గొర్రెల పంపిణీ లేనట్టేనా!

image

గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధకశాఖ అధికారులు నిర్ణయించారు. గతేడాది డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గొర్రెల పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గొర్రెల పెంపకందారులు తమకు ప్రభుత్వం వెంటనే యూనిట్లు పంపిణీ చేయాలని లేదా.. తాము చెల్లించిన డీడీలు అయినా వెనక్కి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 20, 2024

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్‌లో వడదెబ్బ నుంచి రక్షణ సూచనలపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎండదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఉదయం‌ 11గంటలు దాటితే బయటకు రావొద్దని కలెక్టర్ సూచించారు.

News April 20, 2024

KMM: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన BRS నేతలు

image

మాజీ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు శనివారం BRS నాయకులు పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఖమ్మం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీ వద్దిరాజు, నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయిన రూ. 2లక్షల రుణమాఫీ, రూ. 15 వేలు రైతు భరోసా, రూ. 4 వేలు పెన్షన్, వరికి రూ. 500 బోనస్ హామీలు అమలు చేయాలని గుర్తు చేశారు.

News April 20, 2024

KU డిగ్రీ విద్యార్థులకు చివరి అవకాశం

image

మే 6 నుంచి జరగబోయే కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు కోసం ప్రతి సెమిస్టర్‌కి రూ. 250 అపరాధ రుసుముతో ఈ నెల 24 వరకు చెల్లించుకోవచ్చని యూనివర్సిటీ బోర్డు పేర్కొంది. ఈ చివరి అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

News April 20, 2024

KMM: 25న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నామినేషన్

image

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఈనెల 25న కొత్తగూడెంలో నామినేషన్ వేస్తున్నామని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి షేక్ ఖలీల్ పాషా శనివారం ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల సహకారంతో వైయస్సార్ సంక్షేమ పాలన అందించాలనే తపనతో పోటీ చేస్తున్నానని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి గెలిపించాలని కోరారు.

News April 20, 2024

 KMM: BRS రెబల్ అభ్యర్థిగా బాజిబాబా నామినేషన్

image

ఖమ్మం MP స్వతంత్ర అభ్యర్థిగా BRS జిల్లా విద్యార్థి విభాగం అద్యక్షుడు షేక్ బాజిబాబా నామినేషన్ దాఖలు చేసారు. జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు నామినేషన్ పత్రాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. ముస్లింలకు MP టికెట్ ఇవ్వాలని జిల్లా ముస్లిం మైనార్టీలు కేసీఆర్‌ను విన్నవించారని, కానీ వారి విజ్ఞప్తిని కేసీఆర్ తోసిపుచ్చారని అన్నారు. తమ గొంతును వినిపించేందుకు రెబల్ అభ్యర్థిగా తాను నామినేషన్ వేసినట్లు తెలిపారు.

News April 20, 2024

KMM: మానవత్వం చాటుకున్న CRPF ఎస్సై

image

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి తీవ్ర గాయాలైన ఘటన పురుషోత్తపట్నం వద్ద చోటుచేసుకుంది. గమనించిన CRPF ఎస్సై యాకూబ్ పాషా అతనికి ప్రథమ చికిత్సను అందించి CRPF బెటాలియన్‌కు చెందిన అంబులెన్సులో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.